25 నుంచి సార్వత్రిక పరీక్షలు..
వివిధ కారణాలతో ఆగిపోయిన చదువును ముందుకు సాగించడానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఎంతగానో దోహద పడుతోంది.
జిల్లా కేంద్రంలోని జడ్పీ జన్కాపూర్ అధ్యయన కేంద్రంలో తరగతులు వింటున్న సార్వత్రిక ఎస్ఎస్సీ విద్యార్థులు
న్యూస్టుడే, ఆసిఫాబాద్ అర్బన్: వివిధ కారణాలతో ఆగిపోయిన చదువును ముందుకు సాగించడానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఎంతగానో దోహద పడుతోంది. సామాజిక, ఆర్థిక రంగాల్లో వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల బాలలు పాఠశాల స్థాయిలో చదువును మానేస్తున్నారు. రెగ్యులర్ చదువులకు దూరమై డ్రాపౌట్స్గా మిగిలిపోతున్నారు. వయసుదాటిపోయి కనీస విద్యార్హతలు లేక వృత్తి, ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారు. ఉద్యోగాల్లో పదోన్నతులు అందుకోలేక పోతున్నారు. ఇలాంటి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం టాస్ (సార్వత్రిక విద్య)ను అందుబాటులోకి తెచ్చింది. పాఠశాల చదువును ఆపేసిన వారికి ఎస్సెస్సీ, పదో తరగతి పూర్తి చేసిన వారికి ఇంటర్ చదువును అందిస్తోంది. పట్టణాలు, మండల కేంద్రాల్లోని పాఠశాలల్లో అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేసి పాఠ్యపుస్తకాలు అందించి సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. తమ పనులు చేసుకుంటూనే రెండో శనివారం, ఆదివారాల్లో తరగతులకు హాజరవుతున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి ఇందులో చేరిన వారికి ఈ నెల 25వ తేదీ నుంచి తుది పరీక్షలు నిర్వహించనుంది. జిల్లాలో ఈ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే రెగ్యులర్ చదువులకు సమానార్హత గల ధ్రువపత్రాలు జారీ చేస్తారు.
జిల్లాలో 19 అధ్యయన కేంద్రాలు ఉండగా.. 440 మంది ఎస్సెస్సీ, 320 మంది ఇంటర్ ప్రవేశం పొందారు. అధ్యయన తరగతులకు హాజరై ఈ నెల 25వ తేదీ నుంచి మే నెల 2వ తేదీ వరకు జరిగే పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షల్లో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి వసతి, విద్యుత్తు, వైద్యం, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంచాలని పాలనాధికారి సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు శ్రద్ధ తీసుకుంటున్నారు.
ఏర్పాట్లు ఇలా..
జిల్లాలో నిర్వహించనున్న సార్వత్రిక ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల కోసం నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్, కాగజ్నగర్ కేంద్రాల్లో రెండేసి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఎస్సెస్సీ పరీక్షకు 440 మంది అభ్యర్థులు హాజరవనుండగా.. రెండు కేంద్రాలు, ఇంటర్ పరీక్షకు 320 మంది అభ్యర్థుల కోసం రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి సీఎస్, డీవోలు, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ప్రతి రోజూ రెండు పేపర్లు నిర్వహిస్తారు. మే 3-10 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు
[ 06-05-2024]
బెల్లంపల్లి మండలం కాసిరెడ్డిపల్లె గ్రామంలో ఆదివారం ఓ నవ వధువు వరుడి ఇంటి ముందు బంధువులతో కలిసి ఆందోళన చేసింది. వధువు కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. -
కమలదళం.. కదనోత్సాహం
[ 06-05-2024]
‘‘గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబాకు ప్రణామం.. బాసర సరస్వతీ, పోరాటయోధుడు కుమురం భీం, రాంజీగోండ్, కొండా లక్ష్మణ్ బాపూజీలకు ప్రణామాలు..’’ అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కాగజ్నగర్లో నిర్వహించిన వికాస సంకల్ప సభలో ప్రసంగం ప్రారంభించారు. -
‘గిరి’యువతకు ఉపాధి కరవు
[ 06-05-2024]
ఆదివాసీ గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కలగానే మిగులుతోంది. యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ)లలో యువత ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా నైపుణ్యాల శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాల్సి ఉండగా.. శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, జాబ్ మేళాల ఏర్పాటు కోసం నిధుల కేటాయింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. -
కాంగ్రెస్లో కొత్తదనం.. కలిసొచ్చిన పాతతరం
[ 06-05-2024]
ప్రజలకు అభివాదం చేస్తూ, యువతకు స్వీయచిత్రాల అవకాశమిచ్చిన అగ్రనేత రాహుల్గాంధీ, గాడిద గుడ్డు కథ వివరిస్తూ నినాదాలు చేయించిన సీఎం రేవంత్రెడ్డి, ఒకే వేదికపై కూచాడి శ్రీహరిరావు, ఇంద్రకరణ్రెడ్డి, విఠల్రెడ్డి, వేణుగోపాలాచారి కనిపించటం, భారీగా తరలివచ్చిన జనం.. -
మండుతున్న ఎండలు.. వేడెక్కుతున్న భవనాలు
[ 06-05-2024]
వేసవిలో మండుతున్న ఎండలకు పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. సిమెంటు కాంక్రీటు భవనాలు వేడెక్కుతున్నాయి. సాధారణంగా గది ఉష్ణోగ్రత 24 డిగ్రీలు ఉంటుంది. మండుతున్న ఎండలతో ఈ ఉష్ణోగ్రతలు సైతం సాధారణ స్థాయిని మించి నమోదవుతున్నాయి. -
కేంద్రాలు దూరం.. తప్పని భారం!
[ 06-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయ (కేయూ) పరిధిలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న డిగ్రీ పరీక్షల్లో విద్యార్థులకు అవస్థలు తప్పేలా లేవు. వారం రోజులుగా 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. -
ప్రశాంతంగా నీట్
[ 06-05-2024]
వైద్య విద్యలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్ యూజీ-2024) ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. -
సెలవు కరవు.. విధుల బరువు..
[ 06-05-2024]
కనిపించని నాలుగో సింహం పోలీస్. ఇది అక్షర సత్యం. అదే సమయంలో పోలీసు జీవితం వెనక కనిపించని కష్టాలు, ఒత్తిళ్లు, ఆరోగ్య, కుటుంబ సమస్యలతో పోలీసులు మానసికంగా కుంగిపోతున్నారు. ఖాకీ చొక్కా.. ప్యాంటులో హుందాతనంగా కనిపిస్తుంటారు. -
వసతులు లేక ఇక్కట్లు
[ 06-05-2024]
పేదలకు గూడు కల్పించేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు పడకగదుల ఇళ్ల పథకంలో భాగంగా పట్టణంలోని బంగల్పేట్ శివారులో పెద్దమొత్తంలో జీప్లస్2 విధానంలో గృహాలను నిర్మించారు. -
చిన్నగూడు.. ఆదర్శం చూడు
[ 06-05-2024]
ఎక్కడి నుంచో వలస వచ్చిన కూలీలు వారు. ఉండేందుకు తాత్కాలికంగా టార్పాలిన్లతో కట్టుకున్న నివాసాలు వారివి. పనికెళితేనే పూట గడిసే పరిస్థితి. వారి గురించి ఇంతే చెబితే అందులో ప్రత్యేకత ఉండదు. -
పెన్సిల్తో అద్భుతాలు.. జీవం ఉట్టిపడేలా చిత్రాలు
[ 06-05-2024]
చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడమంటే అమితాసక్తి ప్రదర్శించే ఆ యువకుడు పెన్సిల్తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. బొమ్మను చూస్తే చాలు ఉన్నది ఉన్నట్టు గీస్తూ ఔరా అనిపిస్తున్నాడు. -
డిగ్రీ ప్రవేశాల.. ‘దోస్త్’
[ 06-05-2024]
ప్రభుత్వం డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) ప్రకటన జారీ చేసింది. డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఈ నెల 6వ తేదీ రిజిస్ట్రేషన్లు ప్రారంభమై మూడు విడతల్లో సీట్లు కేటాయింపు జరగనుంది. -
నేటి నుంచి డిగ్రీ పరీక్షలు
[ 06-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఒకవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రస్తుత తరుణంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ తదితర కోర్సుల్లో రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ పరీక్షల నిర్వహిస్తుండటం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
క్రాంతినగర్ ఘటనలో 40 మందిపై కేసులు
[ 06-05-2024]
ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్లో శుక్రవారం రాత్రి, శనివారం చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన 40 మందిని బాధ్యులుగా గుర్తించి ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు ఆదివారం కేసులు నమోదు చేశారు. -
విజ్ఞాన భాండాగారం.. అంతర్జాలం
[ 06-05-2024]
దేశంలో ఓ వైపు ఎన్నికల వేడి, హడావుడి నడుస్తుండగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులకు పోటీ పరీక్షల కాలం ముందుంది. రాజకీయ నాయకులు ఓట్ల కోసం పోటీ పడుతుండగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లను అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఆస్ట్రేలియా విమానయాన సంస్థ నిర్వాకం!
-
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!