రక్తహీనతతో కస్తూర్బా విద్యార్థిని మృతి
రక్తహీనతతో జి.మాడుగుల కస్తూర్బా విద్యాలయం విద్యార్థిని మృత్యువాతపడింది. విద్యార్థిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందించిన వివరాల ప్రకారం.. సింగర్భ పంచాయతీ రచ్చపల్లి గ్రామానికి చెందిన యోహాను, సరస్వతి దంపతుల కుమార్తె చెర్రెకి జెసి గ్రేసీ కస్తూర్బా విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతోంది.
జెసిగ్రేసీ (పాతచిత్రం)
జి.మాడుగుల, న్యూస్టుడే: రక్తహీనతతో జి.మాడుగుల కస్తూర్బా విద్యాలయం విద్యార్థిని మృత్యువాతపడింది. విద్యార్థిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందించిన వివరాల ప్రకారం.. సింగర్భ పంచాయతీ రచ్చపల్లి గ్రామానికి చెందిన యోహాను, సరస్వతి దంపతుల కుమార్తె చెర్రెకి జెసి గ్రేసీ కస్తూర్బా విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతోంది. గత నెల 15వ తేదీన పాఠశాలలో తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఉపాధ్యాయులు వెంటనే జి.మాడుగుల పీహెచ్సీకి, అక్కడి నుంచి పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. 17న విశాఖపట్నం కింగ్జార్జి ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న తరువాత ఈనెల 7న డిశ్ఛార్జి చేశారు. తల్లిదండ్రులు విద్యార్థిని ఇంటికి తీసుకెళ్లారు. ఈనెల 10వ తేదీన విద్యాలయ ప్రత్యేకాధికారి పార్వతి, సిబ్బంది రెండు దఫాలుగా రచ్చపల్లి వెళ్లి విద్యార్థినిని పాఠశాలకు పంపించాలని కోరగా.. పూర్తిగా తగ్గలేదని, తగ్గిన తరువాత పంపుతామని చెప్పడంతో ఉపాధ్యాయులు వెనుదిరిగారు. ఈ క్రమంలో ఈనెల 23న జెసిగ్రేసీ మళ్లీ తీవ్ర అనారోగ్యానికి గురైంది. వెంటనే కుటుంబసభ్యులు పాడేరు జిల్లా ఆసుపత్రికి, అక్కడి నుంచి విశాఖపట్నం తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృత్యువాత పడింది. విద్యార్థినికి రక్తహీనతతోపాటు జన్యుపరమైన వ్యాధి ఉందని, మొదట్లోనే గుర్తించి వైద్యసేవలు అందిస్తే బతికేదని వైద్యులు చెప్పినట్లు తండ్రి యోహాను తెలిపారు. విద్యార్థిని మృతితో స్వగ్రామం రచ్చపల్లి, పాఠశాలలో విషాదఛాయలు అలముకున్నాయి. కుమార్తె మృతితో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. విద్యార్థిని అనారోగ్యానికి గురైన నాటి నుంచి వైద్య సేవలు అందిస్తున్నామని, చివరి నిమిషం వరకు పాఠశాల ఆరోగ్య సహాయకురాలు దమయంతి పర్యవేక్షించారని కస్తూర్బా ప్రత్యేకాధికారి పార్వతి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షేమ పాలన త్వరలో సాకారం
[ 05-05-2024]
సంక్షేమ పాలన కూటమి గెలుపుతో త్వరలోనే సాకారమవుతుందని పాడేరు అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. జి.మాడుగుల మండల కేంద్రంలో తెదేపా కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. -
కూటమి బలం చాటుదాం
[ 05-05-2024]
-
డాక్టర్ జగన్మోసంరెడ్డి
[ 05-05-2024]
అర్థ రూపాయి ఖర్చుపెట్టి రూ. 500తో ప్రచారం చేసుకుంటారు జగన్. వైద్య, ఆరోగ్య శాఖలో నాడు-నేడు, ఫ్యామిలీ ఫిజీషియన్, ఆరోగ్య సురక్ష అంటూ ప్రచార ఆర్భాటం చేసుకున్నారే తప్ప వాటితో రోగులకు మేలు జరిగిందే లేదు. -
అనంత బాబు ఆటలు సాగనీయం
[ 05-05-2024]
వైకాపా ప్రభుత్వంలో ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారని రాష్ట్రం బాగుపడాలంటే తెదేపా ప్రభుత్వం రావాల్సిందే అని రంపచోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి అన్నారు. -
ఓటేయాలంటే పాట్లెన్నో..!
[ 05-05-2024]
ఏళ్లు గడుస్తున్నా మన్యంవాసులకు రవాణా కష్టాలు గట్టెక్కడం లేదు. పాడేరు డివిజన్ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు నేటికీ ఓటేయాలంటే కిలోమీటర్ల దూరం నడక సాగించాల్సిన పరిస్థితి ఉంది. -
ఫెర్రో.. ‘జగన్ దెబ్బకు’ మొర్రో!
[ 05-05-2024]
ఫెర్రో పరిశ్రమలు లేకపోతే దేశానికి ప్రగతి ఉండదు. చంద్రయాన్-3 ప్రయోగానికి సైతం ఫెర్రో ఉత్పత్తులనే వినియోగించారు. ఈ పరిశ్రమకు ప్రధాన ముడిసరకు విద్యుత్తు. ఏపీలో దీనిని భారం చేశారు. -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
[ 05-05-2024]
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్సై అరుణ్కిరణ్ పేర్కొన్నారు. శనివారం చింతపల్లిలో సీఆర్పీఎఫ్, ఏపీఎస్పీ, స్థానిక పోలీసులు ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. -
పోలింగు కేంద్రాల్లో సమస్యలుంటే చెప్పండి
[ 05-05-2024]
ఎన్నికల విధులు నిర్వహించన్ను అధికారులు, సిబ్బంది ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై పూర్తిస్తాయిలో శిక్షణ తీసుకుని అవగాహన కలిగి ఉండాలని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎస్.ప్రశాంత్కుమార్ పేర్కొన్నారు. -
జగన్ పాలనలో పరిశ్రమలు పోయాయ్
[ 05-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదని, ఉన్నవి పోయాయని సినీ హీరో నారా రోహిత్ ఆరోపించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. -
కొత్తగా 30 వేల మందికి పింఛన్లు
[ 05-05-2024]
‘జూన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే 50 ఏళ్ల వయస్సుండే ప్రతి గిరిజనుడికి జులై నుంచి రూ.నాలుగు వేల పింఛను అందుతుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల బోనస్ రూ. మూడు వేలు అదనం. ఈ నిర్ణయంతో రంపచోడవరం నియోజకవర్గంలో ఇప్పటికే 40 వేల మందికి పింఛన్లు అందుతున్నాయి. -
మూడో రోజూ అవే అవస్థలు..
[ 05-05-2024]
మారేడుమిల్లి మండలంతోపాటు, వై.రామవరం మండలం ఎగువ ప్రాంతానికి చెందిన పింఛనుదారులు నగదు కోసం మారేడుమిల్లిలోని యూనియన్ బ్యాంకుకు పోటెత్తడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది.