పక్కా ప్రణాళిక.. పునశ్చరణే కీలకమిక!
విద్యార్థి జీవితంలో పదో తరగతి పరీక్షలు ఎంతో కీలకమైనవి. మంచి కళాశాలలో సీటు సాధించాలంటే మార్కులే గీటురాయి. ఇప్పటికే విద్యార్థులకు ఉపాధ్యాయులు సిలబస్లు పూర్తిచేశారు.
రాజవొమ్మంగి, ఎటపాక, న్యూస్టుడే
రాజవొమ్మంగి గురుకులంలో ప్రత్యేక తరగతుల్లో విద్యార్థినులు
విద్యార్థి జీవితంలో పదో తరగతి పరీక్షలు ఎంతో కీలకమైనవి. మంచి కళాశాలలో సీటు సాధించాలంటే మార్కులే గీటురాయి. ఇప్పటికే విద్యార్థులకు ఉపాధ్యాయులు సిలబస్లు పూర్తిచేశారు. ప్రత్యేక తరగతులతో తర్ఫీదునిచ్చారు. ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు జిల్లావ్యాప్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తరుణంలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. సమయపాలన పాటించడం, చేతిరాత, ఆరోగ్యం తదితర అంశాలపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
ఈ ఏడాది ఆరు ప్రశ్నపత్రాలే..
గతంలో మాదిరిగా 11 ప్రశ్నపత్రాలు ఉండవు. ఈ ఏడాది ప్రభుత్వం వాటిని కుదించి ఆరు ప్రశ్నపత్రాలుగా మార్పుచేసింది. సైన్సుకు సంబంధించి జీవ, రసాయన, భౌతిక శాస్త్రాలు ఒకే పరీక్షగా నిర్వహిస్తారు. ఒక్కో విద్యార్థికి ముందుగా 24 పేజీలు ఉండే జవాబు పత్రం ఇస్తారు. అది పూర్తిగా రాసిన విద్యార్థులు కావాలంటే అదనంగా మరో 12 పేజీలు ఉండే జవాబుపత్రం తీసుకోవచ్చు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా జవాబు పత్రాలపై వరుస సంఖ్య ఉంటుంది. ఒక విద్యార్థి పత్రాలు, మరొకరి వద్ద ఉంటే సులభంగా గుర్తించి చూసిరాతను అరికట్టవచ్చు.
మంచి చేతిరాతతో మేలు
పరీక్షల్లో చేతిరాత ఎంతో కీలకమైనది. రోజూ రెండు పేజీల్లో గుండ్రంగా, స్పష్టంగా, అక్షర దోషాలు, కొట్టివేతలు లేకుండా రాయడం సాధన చేయాలి. పదానికి పదానికి మధ్య ఖాళీ ఉంచాలి. వాక్య నిర్మాణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించాలి. సమాధానం రాసేటప్పుడు శీర్షికలు, ఉప శీర్షికలు, ముఖ్యాంశాలు కనిపించేలా కింద గీతలు గీయాలి.
బృంద పఠనంతో మేలు
* విద్యార్థులు ఇప్పటివరకు చదివింది ఒక ఎత్తు. పునశ్చరణ మరో ఎత్తు. సబ్జెక్టుల వారీగా తగిన ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి.
* బృంద చర్చలు, పఠనంతో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. కొత్త విషయాల జోలికి వెళ్లకపోవడం మంచిది. బీ వెనుకబడిన అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి. పాఠ్యాంశాల్లో ముఖ్యమైన అంశాలకు గీతలు గీస్తూ చదవాలి. బీ మార్కులవారీగా అంటే అర, ఒకటి, రెండు, నాలుగు మార్కుల ప్రశ్నలపై అధికంగా దృష్టిపెట్టాలి.
* పరీక్ష గదిలో ఒకటికి రెండుసార్లు ప్రశ్నపత్రం చదివి రాయాలి.
తగినంత నిద్ర అవసరం
- శ్రీదుర్గ, పీహెచ్సీ వైద్యాధికారిణి, రాజవొమ్మంగి
తల్లిదండ్రులు పిల్లల చదువు, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మంచి పౌష్టికాహారం అందించాలి. చాలా మంది విద్యార్థులు రాత్రులు ఎక్కువగా మేల్కొని చదువుతుంటారు. దీని వల్ల పరీక్ష రాసేటప్పుడు నిద్ర వచ్చే అవకాశం ఉంది. నిద్ర సరిగా లేకపోతే అనారోగ్యం బారినపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మంచింది. ఆహారం తీసుకోకుండా పరీక్షలకు వెళ్లడం సరైన నిర్ణయం కాదు. టీవీ, చరవాణులకు దూరంగా ఉండాలి.
సమయపాలన తప్పనిసరి
- ఎస్.సత్యవేణి, ప్రిన్సిపల్, గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, రాజవొమ్మంగి
విద్యార్థులు పరీక్షల్లో సమయపాలన కచ్చితంగా పాటించాలి. కేంద్రానికి ముందుగానే చేరుకోవాలి. ఆందోళన లేకుండా ప్రశ్నపత్రంలో వచ్చిన ప్రశ్నలకు ముందుగా సమాధానాలు రాయాలి. ప్రస్తుతం ఉన్న సమయంలో ప్రణాళిక ప్రకారం చదవాలి. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు చరవాణి ఇవ్వకూడదు. ఎన్ని గంటలు చదివాం అన్నది కాదు ఎంత బాగా చదివామన్నదే ముఖ్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షేమ పాలన త్వరలో సాకారం
[ 05-05-2024]
సంక్షేమ పాలన కూటమి గెలుపుతో త్వరలోనే సాకారమవుతుందని పాడేరు అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. జి.మాడుగుల మండల కేంద్రంలో తెదేపా కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. -
కూటమి బలం చాటుదాం
[ 05-05-2024]
-
డాక్టర్ జగన్మోసంరెడ్డి
[ 05-05-2024]
అర్థ రూపాయి ఖర్చుపెట్టి రూ. 500తో ప్రచారం చేసుకుంటారు జగన్. వైద్య, ఆరోగ్య శాఖలో నాడు-నేడు, ఫ్యామిలీ ఫిజీషియన్, ఆరోగ్య సురక్ష అంటూ ప్రచార ఆర్భాటం చేసుకున్నారే తప్ప వాటితో రోగులకు మేలు జరిగిందే లేదు. -
అనంత బాబు ఆటలు సాగనీయం
[ 05-05-2024]
వైకాపా ప్రభుత్వంలో ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారని రాష్ట్రం బాగుపడాలంటే తెదేపా ప్రభుత్వం రావాల్సిందే అని రంపచోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి అన్నారు. -
ఓటేయాలంటే పాట్లెన్నో..!
[ 05-05-2024]
ఏళ్లు గడుస్తున్నా మన్యంవాసులకు రవాణా కష్టాలు గట్టెక్కడం లేదు. పాడేరు డివిజన్ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు నేటికీ ఓటేయాలంటే కిలోమీటర్ల దూరం నడక సాగించాల్సిన పరిస్థితి ఉంది. -
ఫెర్రో.. ‘జగన్ దెబ్బకు’ మొర్రో!
[ 05-05-2024]
ఫెర్రో పరిశ్రమలు లేకపోతే దేశానికి ప్రగతి ఉండదు. చంద్రయాన్-3 ప్రయోగానికి సైతం ఫెర్రో ఉత్పత్తులనే వినియోగించారు. ఈ పరిశ్రమకు ప్రధాన ముడిసరకు విద్యుత్తు. ఏపీలో దీనిని భారం చేశారు. -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
[ 05-05-2024]
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్సై అరుణ్కిరణ్ పేర్కొన్నారు. శనివారం చింతపల్లిలో సీఆర్పీఎఫ్, ఏపీఎస్పీ, స్థానిక పోలీసులు ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. -
పోలింగు కేంద్రాల్లో సమస్యలుంటే చెప్పండి
[ 05-05-2024]
ఎన్నికల విధులు నిర్వహించన్ను అధికారులు, సిబ్బంది ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై పూర్తిస్తాయిలో శిక్షణ తీసుకుని అవగాహన కలిగి ఉండాలని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎస్.ప్రశాంత్కుమార్ పేర్కొన్నారు. -
జగన్ పాలనలో పరిశ్రమలు పోయాయ్
[ 05-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదని, ఉన్నవి పోయాయని సినీ హీరో నారా రోహిత్ ఆరోపించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. -
కొత్తగా 30 వేల మందికి పింఛన్లు
[ 05-05-2024]
‘జూన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే 50 ఏళ్ల వయస్సుండే ప్రతి గిరిజనుడికి జులై నుంచి రూ.నాలుగు వేల పింఛను అందుతుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల బోనస్ రూ. మూడు వేలు అదనం. ఈ నిర్ణయంతో రంపచోడవరం నియోజకవర్గంలో ఇప్పటికే 40 వేల మందికి పింఛన్లు అందుతున్నాయి. -
మూడో రోజూ అవే అవస్థలు..
[ 05-05-2024]
మారేడుమిల్లి మండలంతోపాటు, వై.రామవరం మండలం ఎగువ ప్రాంతానికి చెందిన పింఛనుదారులు నగదు కోసం మారేడుమిల్లిలోని యూనియన్ బ్యాంకుకు పోటెత్తడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది.