224 మందికి 120 గుడ్లు
పాఠశాల విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేమితో చిన్నారులకు రుచికరమైన భోజనం అందని పరిస్థితులు కొనసాగుతున్నాయి.
మధ్యాహ్న భోజనంలో ఎన్నో లోపాలు
న్యూస్టుడే, అరకులోయ పట్టణం
పాఠశాల విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేమితో చిన్నారులకు రుచికరమైన భోజనం అందని పరిస్థితులు కొనసాగుతున్నాయి. అరకులోయ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ‘న్యూస్టుడే’ సోమవారం పరిశీలించింది. పథకం అమల్లో పలు లోపాలు బయటపడ్డాయి.
అరకులోయ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో గుడ్లు విద్యార్థులందరికీ సరిపోలేదు. కూరగాయలు కానరాని వెజిటబుల్ రైస్ వడ్డించారు. ఈ పాఠశాలలో 325 మంది విద్యార్థులు చదువుతున్నారు. సోమవారం 224 మంది పాఠశాలకు హాజరయ్యారు. మెనూ ప్రకారం గుడ్డుకూర, వెజిటబుల్ ఫ్రైడ్రైస్, ఒక చెక్కీ విద్యార్థులకు అందించాల్సి ఉంది. ఒంటపూట బడులు కావడంతో పరీక్ష రాసిన వెంటనే పలువురు విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయకుండానే ఇళ్లకు వెళ్లిపోయారు. ఉన్నవారిలో కొంతమందికి గుడ్లు పూర్తిగా అందలేదు. 224 మందికి 120 గుడ్లు మాత్రమే పాఠశాల ఉపాధ్యాయులు అందించారని మధ్యాహ్న భోజన నిర్వాహకులు తెలిపారు. 20 కిలోల అన్నం వండినట్లుగా చెప్పారు. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్లో అక్కడక్కడ బీట్రూట్, క్యారెట్ ముక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. రంగుమారిన ముద్ద అన్నంలో పలచగా ఉన్న గుడ్డు, టమాటా కూరను విద్యార్థులకు అందించారు. అన్నం చాలావరకు మిగిలిపోయింది. మండల విద్యాశాఖ అధికారి-1గా పూర్తిస్ధాయి బాధ్యతలు నిర్వహిస్తున్న మోహనరావు ఈ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా ఉన్నారు. ‘న్యూస్టుడే’ పరిశీలిస్తున్న సమయంలో పాఠశాలకు వచ్చిన ఎంఈఓ మోహనరావు గుడ్లు ఎందుకు సరిపడా వండలేదని నిర్వాహకులను ప్రశ్నించారు. ఉపాధ్యాయులు గుడ్లు ఇవ్వలేదని వారు సమాధానం చెప్పారు. కూరలో గుడ్లు అయిపోవడంతో టమాటా చారు మాత్రమే వేశారు. దీనిపై నిర్వాహకులను ప్రశ్నించగా పక్కన మూతపెట్టి దాచిన 20 గుడ్లను చిన్నారులకు అందించారు.
దీనిపై ఎంఈఓ మోహనరావును ‘న్యూస్టుడే’ వివరణ కోరగా.. ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం నిర్వహణ చూసే ఉపాధ్యాయుడికి ప్రేరణ పరీక్ష ఉండటంతో మరో ఉపాధ్యాయుడికి సరకులు ఇచ్చే బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఆయనకు అవగాహన లేకపోవడంతో సమస్య ఏర్పడిందన్నారు. ఇటువంటి సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
చాలీచాలని పదార్థాలు
రంపచోడవరం, న్యూస్టుడే: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు 250మంది వరకు విద్యార్థులు ఉన్నారు. వీరికి మధ్యాహ్నం చాలీచాలని భోజనం వండుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ‘న్యూస్టుడే’ పాఠశాలను సందర్శించగా కేవలం అయిదు కేజీల కిలోల బియ్యంతో ఎగ్రైస్ను కోడి గుడ్ల కూరను వండారు. వండిన ఆహార పదార్థాలు ఇంతమందికి సరిపోతాయా అని మధ్యాహ్న భోజన నిర్వాహకులను అడగ్గా మధ్యాహ్నం 12.30గంటలకు పాఠశాల ముగిసిన వెంటనే అందరూ ఇంటికి వెళ్లిపోతున్నారని సగం మంది కూడా భోజనం తినడంలేదని బదులిచ్చారు. పూర్తిస్థాయిలో విద్యార్థులకు వండిపెట్టినట్టు మాత్రం తమ రికార్డుల్లో నమోదు చేసుకొంటున్నారు.
రాజవొమ్మంగి, న్యూస్టుడే: రాజవొమ్మంగి అల్లూరి సీతారామరాజు జడ్పీ ఉన్నత పాఠశాలలో మూడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు 520 మంది విద్యార్థులు చదువుతుండగా 446 మంది హాజరయ్యారు. మెనూలో భాగంగా సోమవారం బిర్యాని, కోడిగుడ్లు కూర అందజేయాల్సి ఉంది. ఈ నెల 1 నుంచి మండలంలోని పాఠశాలలకు కోడిగుడ్లు సరఫరా నిలిచిపోవడంతో గుడ్లకు బదులుగా వంకాయ, బంగాళా దుంప కూర వండారు. పాఠశాలలో విద్యార్థులు భోజనం చేసేందుకు వీలుగా ప్రత్యేక గది లేకపోవడంతో వరండాల్లో తింటున్నారు. ప్రత్యేక గది ఏర్పాటుచేయాల్సిన ఆవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ జమానాలో నైపుణ్యం లేదు.. నయవంచనే!
[ 30-04-2024]
ఘనకీర్తి అంతా గతమే అన్న చందంగా తయారైంది గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులైన యువత పరిస్థితి. -
కుట్రలు కట్టిపెట్టు.. పింఛను సర్దిపెట్టు..
[ 30-04-2024]
గ్రామ/వార్డు సచివాలయాల్లో సిబ్బంది వేలల్లో ఉన్నారు. వీరిని కూడా పింఛన్ల పంపిణీలో భాగస్వాములను చేస్తే ఒకరోజులోనే అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 3.94 లక్షల పింఛన్లు ఇంటికే తీసుకువెళ్లి అందించడానికి అవకాశం ఉంది. -
వైకాపాది దుర్మార్గ పాలన
[ 30-04-2024]
వైకాపాకు ఓటేస్తే మనకు మనమే ఉరేసుకున్నట్లవుతుందని అరకు పార్లమెంట్ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. -
కూటమితోనే గిరిజన ప్రాంత అభివృద్ధి
[ 30-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే గిరిజన ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు. -
వైకాపా సర్కారును సాగనంపేందుకు జనం సిద్ధం
[ 30-04-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని రంపచోడవరం కూటమి అభ్యర్థి మిరియాల శిరీషాదేవి అన్నారు. -
తండ్రీకూతురికి ఓటుతో బుద్ధి చెప్పండి: సీఎం రమేశ్
[ 30-04-2024]
గత ఎన్నికల్లో మాడుగుల ఎమ్మెల్యేగా బూడి ముత్యాలనాయుడిని గెలిపించడం ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారిందని అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
బీఎన్ రహదారి ఊసెత్తని జగన్చప్పగా ప్రసంగం.. నాయకగణం డీలా
[ 30-04-2024]
సీఎం జగన్ తన ప్రసంగంలో సరికొత్త బాణి ఎంచుకున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో బాదుడే... బాదుడు అన్న ఆయన ఈ ఎన్నికల్లో పదేపదే గోవిందా.. గోవిందా అన్నారు. -
మే నెలలో ప‘రేషన్’ తప్పదా..!
[ 30-04-2024]
మే నెలలో రేషను సరకుల పంపిణీ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. -
కాంగ్రెస్తోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా
[ 30-04-2024]
రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కూటమి విజయం సాధించాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. -
నేడు మహిళా శంఖారావం
[ 30-04-2024]
మహిళా సంక్షేమాన్ని పట్టించుకోని సీఎం జగన్మోహన్రెడ్డికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి కోరార¢ు. -
మా పాసుపుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటోనా?
[ 30-04-2024]
రెండు సెంట్లు పాకదిబ్బ మినహా ఎలాంటి భూమిలేదు. పశువులను మేపుకొనే జీవిస్తున్నా. -
నేను చనిపోతే.. పీవీ సురేషే కారణం..!
[ 30-04-2024]
విశాఖ పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డు వైకాపా కార్పొరేటర్ పీవీ.సురేష్పై అదే పార్టీకి చెందిన మహిళా కార్యకర్త సోమవారం మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సచివాలయాలకు వెళ్లనవసరం లేదు
[ 30-04-2024]
మే నెల సామాజిక పింఛన్లకు సంబంధించి లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని డీఆర్డీఏ పీడీ శచీదేవి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఆ 60వేల ఓట్లు ఎవరివి?.. పాతబస్తీలో ఆచూకీ దొరకని ఓటర్లు
-
అన్నా క్షమించు... ఈ లోకంలో బతకలేకున్నా
-
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
-
‘కాల్చి పడేస్తా.. ఎవడొస్తాడో రమ్మను’.. సస్పెండైన ఓ ఎస్సై వీరంగం
-
మనవడిని కొట్టిందని.. కోడలిని హతమార్చిన మామ