వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించాలని అరకు ఎంపీ ఎన్డీయే అభ్యర్థిని కొత్తపల్లి గీత పిలుపునిచ్చారు.
అరకులోయ, అనంతగిరి, న్యూస్టుడే: ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించాలని అరకు ఎంపీ ఎన్డీయే అభ్యర్థిని కొత్తపల్లి గీత పిలుపునిచ్చారు. అరకులోయలో మంగళవారం కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కొత్తపల్లి గీత, పాంగి రాజారావు ఆధ్వర్యంలో రోడ్షో నిర్వహించారు. స్థానిక ఐటీఐ కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ అరుకు వరకు సాగింది. అరకులోయలో స్థానిక గిరి మహిళలు వీరికి థింసా నృత్యంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు అతికించుకొని తమ పథకాలుగా ప్రచారం చేసుకుందని ఆరోపించారు. జీవో నంబర్ 3 పునరుద్ధరణకు కృషి చేస్తామన్నారు. అనంతగిరి మండలంలోని మైనింగ్ను వైకాపా నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఎంపీ మాధవి సేవలు అవసరం లేదని వైకాపా వారే చెబుతున్నారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫాల్గుణ పనికిరారని వైకాపా అధిష్ఠానం గుర్తించిందని, మరి ఆయన కోడలు తనూజారాణికి ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారన్నారు. వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు మాట్లాడుతూ.. ప్రజలంతా కూటమి పక్షానే ఉన్నారన్నారు. వైకాపా ఐదేళ్ల పాలనలో ఒక్క గిరిజనుడికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వలేదన్నారు. మాజీ మంత్రి కిడారి శ్రావణ్కుమార్, భాజపా నాయకులు రాంచందర్, ఉమామహేశ్వరరావు, తెదేపా నాయకులు బూర్జ లక్ష్మి, ద్రౌపది, సుబ్బారావు, బాకూరి వెంకటరమణ, వంతల నాగేశ్వరరావు, దన్నేరావు, సాయిరాం, పాండురంగస్వామి తదితరులు పాల్గొన్నారు.
కూటమి విజయానికి ప్రజలంతా సహకరించాలని కూటమి ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత అన్నారు. మన్యం పర్యటనకు వచ్చిన ఆమెకు కాశీపట్నం, డముకు గ్రామాల్లో మహిళలు, స్థానిక యువత హారతులిచ్చి స్వాగతం పలికారు. ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ములియగుడలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రాజారావుతో కలిసి స్థానికులతో మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ జమానాలో నైపుణ్యం లేదు.. నయవంచనే!
[ 30-04-2024]
ఘనకీర్తి అంతా గతమే అన్న చందంగా తయారైంది గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులైన యువత పరిస్థితి. -
కుట్రలు కట్టిపెట్టు.. పింఛను సర్దిపెట్టు..
[ 30-04-2024]
గ్రామ/వార్డు సచివాలయాల్లో సిబ్బంది వేలల్లో ఉన్నారు. వీరిని కూడా పింఛన్ల పంపిణీలో భాగస్వాములను చేస్తే ఒకరోజులోనే అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 3.94 లక్షల పింఛన్లు ఇంటికే తీసుకువెళ్లి అందించడానికి అవకాశం ఉంది. -
వైకాపాది దుర్మార్గ పాలన
[ 30-04-2024]
వైకాపాకు ఓటేస్తే మనకు మనమే ఉరేసుకున్నట్లవుతుందని అరకు పార్లమెంట్ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. -
కూటమితోనే గిరిజన ప్రాంత అభివృద్ధి
[ 30-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే గిరిజన ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు. -
వైకాపా సర్కారును సాగనంపేందుకు జనం సిద్ధం
[ 30-04-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని రంపచోడవరం కూటమి అభ్యర్థి మిరియాల శిరీషాదేవి అన్నారు. -
తండ్రీకూతురికి ఓటుతో బుద్ధి చెప్పండి: సీఎం రమేశ్
[ 30-04-2024]
గత ఎన్నికల్లో మాడుగుల ఎమ్మెల్యేగా బూడి ముత్యాలనాయుడిని గెలిపించడం ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారిందని అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
బీఎన్ రహదారి ఊసెత్తని జగన్చప్పగా ప్రసంగం.. నాయకగణం డీలా
[ 30-04-2024]
సీఎం జగన్ తన ప్రసంగంలో సరికొత్త బాణి ఎంచుకున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో బాదుడే... బాదుడు అన్న ఆయన ఈ ఎన్నికల్లో పదేపదే గోవిందా.. గోవిందా అన్నారు. -
మే నెలలో ప‘రేషన్’ తప్పదా..!
[ 30-04-2024]
మే నెలలో రేషను సరకుల పంపిణీ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. -
కాంగ్రెస్తోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా
[ 30-04-2024]
రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కూటమి విజయం సాధించాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. -
నేడు మహిళా శంఖారావం
[ 30-04-2024]
మహిళా సంక్షేమాన్ని పట్టించుకోని సీఎం జగన్మోహన్రెడ్డికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి కోరార¢ు. -
మా పాసుపుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటోనా?
[ 30-04-2024]
రెండు సెంట్లు పాకదిబ్బ మినహా ఎలాంటి భూమిలేదు. పశువులను మేపుకొనే జీవిస్తున్నా. -
నేను చనిపోతే.. పీవీ సురేషే కారణం..!
[ 30-04-2024]
విశాఖ పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డు వైకాపా కార్పొరేటర్ పీవీ.సురేష్పై అదే పార్టీకి చెందిన మహిళా కార్యకర్త సోమవారం మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సచివాలయాలకు వెళ్లనవసరం లేదు
[ 30-04-2024]
మే నెల సామాజిక పింఛన్లకు సంబంధించి లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని డీఆర్డీఏ పీడీ శచీదేవి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఆ 60వేల ఓట్లు ఎవరివి?.. పాతబస్తీలో ఆచూకీ దొరకని ఓటర్లు
-
అన్నా క్షమించు... ఈ లోకంలో బతకలేకున్నా
-
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
-
‘కాల్చి పడేస్తా.. ఎవడొస్తాడో రమ్మను’.. సస్పెండైన ఓ ఎస్సై వీరంగం
-
మనవడిని కొట్టిందని.. కోడలిని హతమార్చిన మామ