logo

గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌

కశింకోట మండలం తాళ్లపాలెం డా.అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి గురువారం నిర్వహించిన కౌన్సెలింగ్‌ ప్రశాంతంగా జరిగింది.

Published : 20 Apr 2024 02:08 IST

కశింకోట, న్యూస్‌టుడే: కశింకోట మండలం తాళ్లపాలెం డా.అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి గురువారం నిర్వహించిన కౌన్సెలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి జిల్లాలకు చెందిన గురుకులాల్లో (తాళ్లపాలెంతో సహా కొక్కిరాపల్లి, నక్కపల్లి, నర్సీపట్నం, మేఘాద్రిగెడ్డ, కోనాం, మధురవాడ) ప్రవేశానికి ఈ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. విద్యార్థులకు గురుకుల సమన్వయాధికారి ఎస్‌.రూపావతి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్‌ జి.గ్రేస్‌తో 6 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మిగిలిన 183 సీట్లకు గాను 88 మంది విద్యార్థులు ప్రవేశం పొందారని రూపావతి తెలిపారు. ఈ మేరకు ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంపిక పత్రాలు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని