బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం.
జగన్ని నమ్మితే అప్పులపాలే
నిధుల విడుదలలో తీవ్ర జాప్యం
విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. గతంలో మాదిరిగా ‘ ఫీజులు ఇంతే కడతాం. ఇంతకంటే ఎక్కువ కట్టాల్సి వస్తే మీ ఆస్తులు అమ్ముకోండి. మీ చావు మీరు చావండి’ అనే విధానానికి స్వస్తి పలికాం. తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా త్రైమాసికం పూర్తయిన వెంటనే ఫీజులు జమ చేస్తున్నాం.
‘విద్యా దీవెన’ గురించి సీఎం జగన్ గొప్పలు
రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. వారందరినీ జగన్ నట్టేట ముంచారు. అయిదేళ్లుగా సమయానికి నిధులు విడుదల చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మరోవైపు ఫీజులు చెల్లించకుంటే పరీక్షలు రాసేందుకు అనుమతించబోమని కళాశాలల యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి. తమ పిల్లల చదువుకు ఆటంకాలు ఎదురవుతాయని తల్లిదండ్రులకు భయం పట్టుకుంది. దీంతో దొరికిన చోట అప్పులు చేసి, ఆస్తులు తాకట్టు పెట్టి పిల్లల ఫీజులు చెల్లించారు. వైకాపా ప్రభుత్వ ‘ఫ్యూజు’పీకేస్తేనే పరిస్థితి గాడిన పడుతుందని పలువురు చెబుతున్నారు.
బటన్ నొక్కినా రాని నిధులు
ఒక విద్యా సంవత్సరానికి నాలుగు విడతలుగా విద్యా దీవెన నిధులు విడుదల చేస్తారు. 2023-24 సంవత్సరంలో అక్టోబరు, నవంబరు, డిసెంబరు త్రైమాసికానికి సంబంధించిన విద్యా దీవెన నిధుల విడుదలకు మార్చి 1న సీఎం జగన్ బటన్ నొక్కారు. కానీ ఇప్పటికీ తల్లుల ఖాతాలకు జమ కాలేదు. ఆ త్రైమాసికానికి జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 44,177 మంది విద్యార్థులను అర్హులుగా తేల్చారు. వారికి మొత్తం రూ.34.72 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఇంకా మూడు విడతలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఈలోగా పరీక్షలు రావడంతో చాలా మంది తప్పనిసరి పరిస్థితుల్లో ఫీజులు చెల్లించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇప్పట్లో నిధులు విడుదల చేసే అవకాశం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
వాస్తవం
నగరానికి చెందిన ఓ విద్యార్థిని ఒక ప్రైవేటు కళాశాలలో పాలిటెక్నిక్ చివరి ఏడాది చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు నిరుపేదలు. రూ.25 వేల ఫీజు బకాయి చెల్లిస్తేనే హాల్టికెట్ ఇస్తామని యాజమాన్యం తేల్చిచెప్పింది. కొద్ది రోజుల్లో అప్పు చేసైనా చెల్లిస్తామని వేడుకున్నా ప్రయోజనం లేకపోయింది. కుమార్తె వేదన చూడలేని తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రెండు వారాల్లో రూ.12 వేలు చెల్లిస్తానని తల్లి నుంచి హామీ పత్రం తీసుకుని విద్యార్థినికి హాల్టికెట్ అందించారు.
రూ.35 వేలు చెల్లించా: మా అబ్బాయి పీఎం పాలెంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో ఏడాది చదువుతున్నాడు. ఈ ఏడాది ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. ఫీజు చెల్లించకుంటే పరీక్షలు రాయడం కుదరదని కళాశాల యాజమాన్యం హెచ్చరించింది. దీంతో మొత్తం రూ.35 వేలు చెల్లించా.
- అన్నాజీ, ప్రైవేటు ఉద్యోగి
కొలువులకు దూరం..
తెదేపా హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసేవారు. ప్రభుత్వం, యాజమాన్యాల మధ్యే ఫీజుల వ్యవహారం కొనసాగేది. ఎలాంటి ఇబ్బందులు, ఒత్తిడి లేకుండా విద్యార్థులు చదువు పూర్తిచేసేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ విధానాన్ని మార్చేసి.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మధ్యలోకి లాగారు. విధానాలు మార్చడంపై పెట్టిన దృష్టి నిధుల విడుదలపై లేకపోయింది. అయిదేళ్లలో ఒక్కసారి కూడా చెప్పిన సమయానికి నిధులు విడుదల చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చదువు పూర్తయిన విద్యార్థులు ఫీజు బకాయిలు చెల్లిస్తేనే ధ్రువపత్రాలు ఇస్తామని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. కొందరు అప్పు చేసి చెల్లిస్తుండగా.. మరికొందరు ధ్రువపత్రాలు తీసుకోలేదు. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు వచ్చినా వెళ్లలేక తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంక్షలు లేని సంక్షేమం అభివృద్ధి నిలయంగా మన్యం
[ 06-05-2024]
‘రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమైంది. మరికొద్ది రోజుల్లో జగన్ రాక్షస పాలన అంతం కాబోతోంది. ఆర్థికంగా, అభివృద్ధిపరంగా గాడితప్పిన ఈ రాష్ట్రాన్ని మోదీ నిబద్ధత, చంద్రబాబు సమర్థత, పవన్ కల్యాణ్ చతురతతో పునఃనిర్మాణం చేసుకుంటాం. -
కూటమి విజయభేరి నేడే
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోది తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో సభను విజయవంతం చేయడానికి భాజపా, తెదేపా, జనసేన పార్టీల నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. -
ఓటుతో వైకాపాకు బుద్ధి చెప్పండి: ఈశ్వరి
[ 06-05-2024]
మీకు ఏ కష్టమొచ్చినా అండగా నేనుంటా.. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. దీనికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఓటుతోనే వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. -
జనం ఆస్తులకు జగనే గండం
[ 06-05-2024]
ఇలా పదులు, వందలు కాదు వేల ఎకరాల భూములు వైకాపా నేతల చెరలో చిక్కాయి. వాటిపై కొందరు న్యాయస్థానాల్లో కేసులు వేసి ఉపశమనం పొందారు. -
సెల్ఫోన్ పేలి చిరు వ్యాపారికి గాయాలు
[ 06-05-2024]
సెల్ఫోన్ పేలి వ్యక్తికి గాయాలు పాలైన ఘటన పెదబయలు మండలం బొంగరం పంచాయతీ పరమలమ్మలో చోటు చేసుకుంది. -
చంద్రబాబుతోనే పోలవరం పూర్తి
[ 06-05-2024]
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, దానికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రంపచోడవరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి అన్నారు. -
మహిళలకు ఆర్టీసీ ప్రయాణం ఉచితం
[ 06-05-2024]
కూటమి గెలుపుతోనే గిరిజనులకు సంక్షేమ పథకాలు అందుతాయని అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు. -
ఆసుపత్రిలో ఆకలి కేకలు
[ 06-05-2024]
నక్కపల్లి ఆసుపత్రిలో నిత్యం సగటున 25 మంది రోగులు ఉండేవారు. వీరికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొవిడ్ పేరుతో దాదాపు మూడేళ్లపాటు నిలిపేసింది. -
ప్రత్యర్థులు అసూయ పడేలా అభివృద్ధి చేస్తా: సీఎం రమేశ్
[ 06-05-2024]
కూటమి అభ్యర్థులను గెలిపించి ఇటు కేంద్రం, అటు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ కోరారు. -
మోదీ సభకు సర్వం సిద్ధం
[ 06-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ విజయభేరి సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తాళ్లపాలెం సమీపంలోని సభాస్థలి ఏర్పాట్లను కూటమి నాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. -
యువత భవిత పట్టని పాలకులు: వడ్డే
[ 06-05-2024]
స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా రాష్ట్రం అభివృద్ధి చెందలేదని, ముఖ్యంగా మనం ఎన్నుకున్న నాయకులు అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని ‘భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక’ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
[ 06-05-2024]
పార్లమెంట్ అభ్యర్థి సి.ఎం.రమేశ్పై వైకాపా నాయకుల దాడిని నిరసిస్తూ పేటలో ఆదివారం కూటమి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. -
నీటి విడుదల నిలిపేసి గాలింపు
[ 06-05-2024]
మాచ్ఖండ్ జలవిద్యుత్కేంద్రానికి చెందిన జోలాపుట్ జలాశయం నుంచి ఆదివారం కొన్ని గంటలపాటు నీటి విడుదల నిలిపివేశారు.