నడి రోడ్డుపై చితి మంటలు
ఆ రెండు వాహనాలవి వేర్వేరు మార్గాలు, గమ్యాలు. జాతీయ రహదారి డివైడర్కు చెరో వైపున వెళ్తున్నాయి.
లారీలు దగ్ధమైన ఘటనలో అంతులేని విషాదం
ప్రత్తిపాడు(కాకినాడ జిల్లా) : ఆ రెండు వాహనాలవి వేర్వేరు మార్గాలు, గమ్యాలు. జాతీయ రహదారి డివైడర్కు చెరో వైపున వెళ్తున్నాయి. నడి రోడ్డుపై లావా ప్రవహించిన తీరుగా ఓ ప్రమాదం ఆ రెండు వాహనాలనూ ఉన్నపళంగా మండించింది. బతుకు పోరాటంలోని నలుగురు సగటు జీవులకు రహదారిపైనే చితిమంట పెట్టింది. ప్రత్తిపాడు మండలం ధర్మవరం జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి పెను సంచలనమైంది. . అనకాపల్లిలోని కోల్డు స్టోరేజీ నుంచి భీమవరం అశ్విని ఫిషరీస్ ప్రైవేటు లిమిటెడ్కు రొయ్యలను తీసుకెళ్తున్న కంటైనరును కడియం నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఇసుకలారీ ఢీకొంది. రెండు వాహనాల క్యాబిన్లను మంటలు చుట్టుముట్టాయి. కంటైనరు చోదకుడు ఉత్తరప్రదేశ్కు చెందిన వినోద్కుమార్ రాధేశ్యామ్ యాదవ్ (27), అందులో ఉన్న భీమవరం జిల్లా యనమదుర్రుకు చెందిన ఫిషరీస్ సూపర్వైజర్ కాలి పెద్దిరాజు(45), ఇసుక లారీ చోదకుడు కృష్ణాజిల్లా కోడూరుకు చెందిన జన్ను శ్రీను(45), ఇదే వాహనంలో మరో వివరాలు తెలియని వ్యక్తి సజీవ దహనమయ్యారు.ఎస్సై సుధాకర్ బృందం ప్రత్తిపాడు, జగ్గంపేట అగ్నిమాపక యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు మంటలు అదుపు చేసినా అందులోని మనుషులు ఏమయ్యారో తెలియని పరిస్థితి. చివరకు కాలిపోగా మిగిలిన మృతదేహాలే లభ్యమయ్యాయి. డ్రైవరు, క్లీనరు సీట్లలో దొరికిన ఈ అవశేషాలను బట్టి వివరాలు సేకరించినా.. డ్రైవరు కాకుండా ఇసుకలారీలో మరో వ్యక్తి ఎవరనేది తెలియరాలేదని ఎస్సై సుధాకర్ తెలిపారు.
మిన్నంటిన రోదనలు..
ప్రమాదంలో నలుగురు సజీవ దహనంతో ఆ కుటుంబాలు ఆధారాన్ని కోల్పోయాయి. ఇసుకలారీ చోదకుడు జన్ను శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారి బాధ్యతను ఇప్పుడు ఎవరు చూస్తారని అతడి బంధువులు రోదిస్తున్నారు. కడచూపునకూ నోచుకోకుండా ప్రమాదం జరగడం విధి చిన్నచూపేనని వాపోయారు. శ్రీను కుటుంబం మూడేళ్ల కిందట గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉంటున్నారని కోడూరు వాసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనంపైకి ‘రాకాసి చట్టం’
[ 05-05-2024]
బలవంతుడిదే రాజ్యం.. రౌడీయిజంతో దౌర్జన్యం చేసేవారికే భూమి అన్నట్టు వైకాపా ప్రభుత్వం వినాశకర చట్టాన్ని తెస్తోంది. అధికారం అండ ఉన్నవారి మాటే చెల్లుబాటయ్యేలా తనదైన విధ్వంసకర విధానాలను జనంపై రుద్దుతోంది. -
బూతులు.. గోతులు.. మనకొద్దు!
[ 05-05-2024]
జనసేనాని పవన్ కల్యాణ్ రాకతో ఎన్డీయే కూటమిలోనూతనోత్సాహం వచ్చింది. గుడివాడ, అవనిగడ్డల్లో శనివారం వారాహి విజయభేరి బహిరంగ సభల్లో పవన్ పాల్గొన్నారు. -
సూపర్-6లో సంక్షేమం కొత్త పుంతలు
[ 05-05-2024]
ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న మచిలీపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది నా అభిమతం. శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు రూ.2000 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. -
ఎత్తిపోయలే... ఒట్టి మాటలే...
[ 05-05-2024]
ఎన్నెస్పీ నీరు అందని చోట ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. వాటిలో చాలా మరమ్మతులకు గురయ్యాయి. ప్రతిపాదనలు పంపినా అయిదేళ్లలో పైసా విదల్చలేదు. -
అనువుగాని భూములే.. అపూర్వమా పేర్ని!
[ 05-05-2024]
వ్యవసాయ పరిశోధన స్థానానికి కేటాయించిన భూమి పరిశోధనలకు అనువుగా ఉండదు. అక్కడ భూసార పరీక్షలు కూడా చేశాం. చౌడు ఎక్కువగా ఉండడంతో పంటలు పండే అవకాశం ఉండదు. -
పోస్టల్ బ్యాలట్ వినియోగంలో సమాచార లోపం
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునే తేదీల విషయంలో సక్రమమైన సమాచారం ఇవ్వకపోవడంతో పలువురు ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. -
ఓటింగ్ ప్రక్రియ గందరగోళం.. పోస్టల్ బ్యాలట్లు మురిగే ప్రమాదం
[ 05-05-2024]
గుడివాడ పట్టణంలోని వీకేఆర్, వీఎన్బీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలట్్ ఫెసిలిటేషన్ సెంటర్లో శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సిన పోలింగ్ ఒక బూత్లో 9:50కి మరో బూత్లో 10:30 గంటలకు ప్రారంభం -
మ్యానిఫెస్టోలో పథకాలు అమలు చేస్తాం: కొల్లు
[ 05-05-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ పింఛన్లు అందజేయడంతోపాటు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.4వేలు అందిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి కొల్లు రవీంద్ర అన్నారు. -
స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్గా రామ గంగాధర్
[ 05-05-2024]
హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్రప్రదేశ్ నూతన కమిషనర్గా దోర్నాసుల రామ గంగాధర్ నియమితులయ్యారు. -
యార్లగడ్డ ప్రచారానికి అడ్డంకి.. ఆపై కత్తితో దాడి అని కేసు
[ 05-05-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొయ్యూరులో తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రచారం సందర్భంగా శుక్రవారం రాత్రి వైకాపాకు చెందిన కొందరు గలాటా సృష్టించారు. -
దివిసీమ విశిష్టత వివరించిన జనసేనాని
[ 05-05-2024]
అవనిగడ్డ సభలో జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ మాట్లాడుతూ దివిసీమ గొప్పతనం గురించి వివరిస్తూ ప్రజల్లో చైతన్యం నింపారు. -
వైకాపా నాయకుడి నోటి దురుసు
[ 05-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెదేపా మహిళా కార్యకర్తను వైకాపా నాయకుడు అసభ్య పదజాలంతో దూషించిన ఘటన రాణిగారితోటలో చోటుచేసుకుంది.