పంటల్లో సస్యరక్షణ చర్యలు
మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో మొక్కజొన్న, మినుము, చెరకు, కూరగాయ పంటలు, పండ్ల తోటల్లో వర్షం నీరు చేరింది.
ఘంటసాల, న్యూస్టుడే
ఘంటసాలపాలెంలో మొక్కజొన్న పొలంలో నిలిచిన వర్షం నీటిని పరిశీలిస్తున్న కేవీకే శాస్త్రవేత్తల బృందం
మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో మొక్కజొన్న, మినుము, చెరకు, కూరగాయ పంటలు, పండ్ల తోటల్లో వర్షం నీరు చేరింది. పంట పొలాల్లో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త పి.శ్రీలత, సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త కె.రేవతి వివరించారు.
మినుము పంట: మినుము పంటలో వర్షం నీరు నిల్వ ఉండకుండా చిన్న బోదులను ఏర్పాటు చేసుకొని నీటిని బయటకు తీయాలి. నూర్పిడి పూర్తయిన మినుము విత్తనాలను ఆరబెట్టుకోవాలి. మినుము గింజలకు బూజు పట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తనాలను కుప్పలుగా వేసి పరదాలు కప్పుకొని కాపాడుకోవాలి.
చెరకు : ముందుగా చెరకు పొలంలోని మురుగు నీటిని తీసివేయాలి. వర్షాలు తగ్గిన తరువాత అదనంగా 15 కిలోలు చొప్పున యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను పైపాటుగా వేసుకోవాలి.
కూరగాయ పంటలు: పలు రకాల కూరగాయ పంట పొలాల్లో చేరిన వాన నీటిని చిన్న కాలువల ద్వారా బయటకు తొలగించాలి. అధిక వర్షాల కారణంగా మిరప, టమాట పంటల్లో బాక్టీరియా, ఆకుమచ్చ తెగులు ఆశించే ఆస్కారం ఉన్నందున నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రాములు, ప్లాంటమైసిన్ 1 గ్రాము చొప్పున 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అధిక తేమ వలన పంట మీద గల కాయలకు ఆశించే కాయకుళ్లు తెగులు నివారణకు ముందుజాగ్రత్తగా మాంకోజెబ్ 2.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తెగులు ఉద్ధృతిని నివారించడానికి ప్రోపికొనజోల్ 1.0 మి.లీ. లేదా డైఫెన్కొనజోల్ 0.5 మి.లీ. లేదా అజాక్సిస్ట్రోలిన్ 1.0 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పండ్ల తోటలు: పలు రకాల పండ్ల తోటల్లో అధిక వర్షాలకు నిల్వ ఉన్న నీటిని తీసివేయాలి. లేత తోటల్లో చనిపోయిన మొక్కలను తొలగించి కొత్తవి నాటుకోవాలి. అధిక గాలులకు ఒరిగిపోయిన చెట్ల మొదళ్లకు మట్టిని ఎగదోసి వేర్లను కప్పి కర్రలతో ఊతమివ్వాలి. విరిగిన కొమ్మలను కత్తిరించి ఆ భాగంలో బోర్డో మిశ్రమం(కాపర్ సల్ఫేట్ 1 కిలో, సున్నం 1 కిలో, 10 లీటర్లు నీళ్లు) కలిపి పూయాలి. చెట్ల మొదలు దగ్గర ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు చొప్పున లీటరు నీటికి కలిపి పోయాలి. పలు రకాల పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే సత్ఫలితాలు సాధించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనంపైకి ‘రాకాసి చట్టం’
[ 05-05-2024]
బలవంతుడిదే రాజ్యం.. రౌడీయిజంతో దౌర్జన్యం చేసేవారికే భూమి అన్నట్టు వైకాపా ప్రభుత్వం వినాశకర చట్టాన్ని తెస్తోంది. అధికారం అండ ఉన్నవారి మాటే చెల్లుబాటయ్యేలా తనదైన విధ్వంసకర విధానాలను జనంపై రుద్దుతోంది. -
బూతులు.. గోతులు.. మనకొద్దు!
[ 05-05-2024]
జనసేనాని పవన్ కల్యాణ్ రాకతో ఎన్డీయే కూటమిలోనూతనోత్సాహం వచ్చింది. గుడివాడ, అవనిగడ్డల్లో శనివారం వారాహి విజయభేరి బహిరంగ సభల్లో పవన్ పాల్గొన్నారు. -
సూపర్-6లో సంక్షేమం కొత్త పుంతలు
[ 05-05-2024]
ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న మచిలీపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది నా అభిమతం. శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు రూ.2000 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. -
ఎత్తిపోయలే... ఒట్టి మాటలే...
[ 05-05-2024]
ఎన్నెస్పీ నీరు అందని చోట ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. వాటిలో చాలా మరమ్మతులకు గురయ్యాయి. ప్రతిపాదనలు పంపినా అయిదేళ్లలో పైసా విదల్చలేదు. -
అనువుగాని భూములే.. అపూర్వమా పేర్ని!
[ 05-05-2024]
వ్యవసాయ పరిశోధన స్థానానికి కేటాయించిన భూమి పరిశోధనలకు అనువుగా ఉండదు. అక్కడ భూసార పరీక్షలు కూడా చేశాం. చౌడు ఎక్కువగా ఉండడంతో పంటలు పండే అవకాశం ఉండదు. -
పోస్టల్ బ్యాలట్ వినియోగంలో సమాచార లోపం
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునే తేదీల విషయంలో సక్రమమైన సమాచారం ఇవ్వకపోవడంతో పలువురు ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. -
ఓటింగ్ ప్రక్రియ గందరగోళం.. పోస్టల్ బ్యాలట్లు మురిగే ప్రమాదం
[ 05-05-2024]
గుడివాడ పట్టణంలోని వీకేఆర్, వీఎన్బీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలట్్ ఫెసిలిటేషన్ సెంటర్లో శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సిన పోలింగ్ ఒక బూత్లో 9:50కి మరో బూత్లో 10:30 గంటలకు ప్రారంభం -
మ్యానిఫెస్టోలో పథకాలు అమలు చేస్తాం: కొల్లు
[ 05-05-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ పింఛన్లు అందజేయడంతోపాటు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.4వేలు అందిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి కొల్లు రవీంద్ర అన్నారు. -
స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్గా రామ గంగాధర్
[ 05-05-2024]
హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్రప్రదేశ్ నూతన కమిషనర్గా దోర్నాసుల రామ గంగాధర్ నియమితులయ్యారు. -
యార్లగడ్డ ప్రచారానికి అడ్డంకి.. ఆపై కత్తితో దాడి అని కేసు
[ 05-05-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొయ్యూరులో తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రచారం సందర్భంగా శుక్రవారం రాత్రి వైకాపాకు చెందిన కొందరు గలాటా సృష్టించారు. -
దివిసీమ విశిష్టత వివరించిన జనసేనాని
[ 05-05-2024]
అవనిగడ్డ సభలో జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ మాట్లాడుతూ దివిసీమ గొప్పతనం గురించి వివరిస్తూ ప్రజల్లో చైతన్యం నింపారు. -
వైకాపా నాయకుడి నోటి దురుసు
[ 05-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెదేపా మహిళా కార్యకర్తను వైకాపా నాయకుడు అసభ్య పదజాలంతో దూషించిన ఘటన రాణిగారితోటలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
-
జగన్ చేతిలో జనం బికారులు.. వైకాపా భక్షణ చట్టంపై జనాగ్రహం
-
లొంగుబాటుకు హెచ్డీ రేవణ్ణ ముహూర్తం.. ఇంట్లో తలుపు వేసుకుని..
-
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
-
అదనపు కట్నం వేధింపులు.. ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్య
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ