అర్హులకు దరిచేరని నేతన్న నేస్తం
వారం రోజులపాటు రెక్కలుముక్కలు చేసుకుని నేసిన చీరకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దీనికితోడు ప్రభుత్వం ముడిసరకుల ధరలు పెంచి చేనేతలపై మరింత భారం మోపింది. చేనేత వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న నేతన్నలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ప్ర
అనంతపురం(కమలానగర్), న్యూస్టుడే : వారం రోజులపాటు రెక్కలుముక్కలు చేసుకుని నేసిన చీరకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దీనికితోడు ప్రభుత్వం ముడిసరకుల ధరలు పెంచి చేనేతలపై మరింత భారం మోపింది. చేనేత వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న నేతన్నలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకం అందక చేనేత జీవనం భారంగా మారడంతో వృత్తిని వదిలి కూలీ పనులకుపోతున్నవారు కొందరైతే.. మరికొందరు సుదూర ప్రాంతాలకు వలసలు వెళుతున్నారు. నేతన్న నేస్తం పథకంలో ఇంకా 5 వేల మంది అర్హులకు న్యాయం జరగలేదు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో వ్యవసాయం తర్వాత చేనేత పరిశ్రమ ద్వితీయ స్థానంలో ఉంది. 70 వేలమంది చేనేత కార్మికులకు వృత్తిపై ఆధారపడ్డారు. ప్రభుత్వ అధికారుల అంచనా ప్రకారం 40 వేల చేనేత మగ్గాలు ఉన్నాయి. ధర్మవరం, హిందూపురం, మడకశిర, అనంత గ్రామీణం సిండికేట్నగర్, ఉరవకొండ, తాడిపత్రి, పెద్దవడుగూరు, యాడికి, శింగనమల ప్రాంతాల్లో అధిక శాతం చేనేత కుటుంబాలు ఉన్నాయి. ఏటా ప్రభుత్వం జులైలో నేతన్న నేస్తం పథకంలో అర్హులైన జాబితాను విడుదల చేసి, నిధులు అందిస్తుంది. ఆగష్టులో అర్హులైన చేనేతల ఖాతాల్లో నగదు జమవుతుంది. మరో 5 వేలమంది అర్హులున్నా ఈ పథకం వర్తించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చేనేత సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఫలితం లేకపోవడంతో చేసేదేమీ లేక కుటుంబ పోషణ భారంతో మేస్త్రీ పనులు, కూలీ పనులకు వెళుతున్నారు. ఇంటర్, డిగ్రీ వరకు చదువుకొన్న కొందరు యువకులు ఇప్పుడు మగ్గం వదిలి బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు వలస వెళ్లి ప్రైవేటు కంపెనీల్లో చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్నారు.
ఆశ వదులుకున్నాను
నా పేరు హరిప్రసాద్ మాది పెద్దపప్పూరు రామకోటికాలనీలో నివాసం ఉంటున్నాం. 2001 నుంచి మగ్గం నేస్తున్నాను. నెలనెలా రూ.1,000 వచ్చేది. 2019లో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకానికి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనేకసార్లు పథకానికి దరఖాస్తు చేసుకున్నా నేతన్న నేస్తం రాలేదు. కార్యాలయం చుట్టూ తిరిగి ఆశ వదులుకున్నాను. ఈ సారైనా వస్తుందో రాదో చూడాలి
కూలీ పనులకు వెళుతున్నాను
15 ఏళ్లుగా మగ్గం నేస్తున్నాను. మగ్గంపై ఆధారపడి కుటుంబ జీవనం సాగిస్తున్నాము. రెండుసార్లు నేతన్న నేస్తం నా ఖాతాలో జమైంది. మూడోసారి మగ్గం వేయలేదన్న కారణంతో నేతన్న నేస్తం పథకం నుంచి తొలగించారు. సచివాలయం, ఏడీ కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. స్పందనలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. మగ్గం నేస్తూ కూలీ పనులకు కూడా వెళుతున్నాను.
కచ్చితంగా అమలవుతుంది
ప్రభుత్వ నిబంధనల మేరకు మగ్గం నేస్తూ అన్నివిధాలా అర్హులుగా ఉంటే పథకం కచ్చితంగా అమలు అవుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సచివాలయ వెల్ఫేర్ అధికారి దరఖాస్తును, పరిసర ప్రాంతాలను పరిశీలించి అర్హులైతే పథకం అమలు అవుతుంది. కొన్ని పరిశీలనలో ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. - బసవరాజు, ఇన్ఛార్జి ఏడీ, చేనేత జౌళిశాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడి దమనకాండ
[ 10-05-2024]
అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు.. అన్యాయాన్ని నిలదీస్తే ఎదురుదాడులు.. అవినీతిపై ఫిర్యాదు చేస్తే ఇక అంతే సంగతులు. జగనన్న ఐదేళ్ల పాలన సాగిన తీరిది. ప్రశ్నించడం దేవుడెరుగు ప్రతిపక్ష పార్టీల సమావేశాలకు వెళ్లినా తలలు పగలగొట్టారు. -
తుస్సుమన్న జగన్ సభ
[ 10-05-2024]
కళ్యాణదుర్గంలో గురువారం జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రోడ్షో, బహిరంగ సభ తుస్సుమంది. -
గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు
[ 10-05-2024]
‘జిల్లాలో జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా, ప్రశాంతంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడా ఏ సమస్య తలెత్తకుండా వ్యూహాత్మక ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాం.నెక్కడైనా గొడవలు సృష్టిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తాం. -
ఎడారి నివారణ ఎండమావే
[ 10-05-2024]
జిల్లాలోని బొమ్మనహాళ్, కణేకల్లు, బెళగుప్ప మండలాల్లోని వేదవతి హగరి పరివాహక ప్రాంతాల్లో ఇసుక దిబ్బలు రాజస్థాన్లోని థార్ ఎడారిని తలపిస్తున్నాయి. మొత్తం 4,700 ఎకరాల్లో ఇసుక దిబ్బలు విస్తరించి ఉన్నాయి. -
షరతులు పెట్టి.. రాయితీ ఎగ్గొట్టి..
[ 10-05-2024]
జగనన్న మైకు పట్టుకుంటే నా ఎస్సీ, నా ఎస్టీలు అంటూ మాట్లాడతాడు. అవన్నీ నీటి మీద రాతలే. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపట్ల చిత్తశుద్ధి ఉందేమోనని అందరూ భావించారు. -
జానెడు రోడ్డేయలేని ఎమ్మెల్యే అవసరమా?: సునీత
[ 10-05-2024]
వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి పరాజయం తప్పదు. వైసీపీ నాయకులు తెదేపాలోకి కొనసాగుతున్న వలసలే ఓటమికి సంకేతమని మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. -
ఫెసిలిటేషన్ కేంద్రం మూసివేత
[ 10-05-2024]
పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగులంతా తెదేపాకే మొగ్గు చూపడంతో వైకాపా నాయకులు కుట్రలకు తెరలేపారని, గురువారం గడువు ఉన్నప్పటికీ ఫెసిలిటేషన్ కేంద్రం మూసేశారని అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైకాపాను ఓటుతో తరిమివేయాలి: కాలవ
[ 10-05-2024]
నవరత్నాల పేరుతో సామాన్య ప్రజలను నట్టేట ముంచి ఐదేళ్లపాటు నయవంచక పాలన సాగించిన జగన్ను ఓటుతో తరిమి వేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. -
చెరువు మట్టినే కాదు.. చేపలనూ వదలని నాయకులు
[ 10-05-2024]
దోచుకోవడానికి ఏదీ అనర్హం కాదన్నట్లుగా హిందూపురంలో అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. చెరువు మట్టిని లేఅవుట్లకు తోలుకొని సొమ్ము చేసుకున్న నాయకులు కొందరైతే, చెరువుల్లోని చేపలను అమ్ముకున్నది మరికొందరు. -
ఓటరు స్లిప్పుల మాటున నగదు పంపిణీ
[ 10-05-2024]
పట్టణంలోని 11వ వార్డులో ఓటరు స్లిప్పుల మాటున నగదు పంపిణీ చేస్తున్న వైకాపా కార్యకర్తలకు స్థానికుల నుంచి ఊహించని రీతిలో తిరుగుబాటు ఎదురైంది. -
వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు
[ 10-05-2024]
వేరే పార్టీకి ఓటు వేస్తే ఎలాంటి పథకాలు రావని ధర్మవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓటర్లను బెదిరించేలా మాట్లాడారు. -
తెదేపాతోనే మీ భూములకు రక్షణ: నారా రోహిత్
[ 10-05-2024]
తెదేపా అధికారంలోకి వచ్చి నారాచంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మీ భూములకు గ్యారంటీ లభిస్తుందని సినీ హీరో నారా రోహిత్ అన్నారు. గురువారం రొళ్లలో నిర్వహించిన తెదేపా ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. -
దోచుకొని.. దాచుకోవడానికే వచ్చిన వలస పక్షులు
[ 10-05-2024]
కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుంచి వైకాపా హిందూపురం ఎంపీ అభ్యర్థిగా శాంతమ్మ, బెంగళూరు/కళ్యాణదుర్గం నుంచి పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉషశ్రీచరణ్ అనే వలస పక్షులు ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి ఎలాగైనా గెలుపొంది ప్రకృతి వనరులను దోచుకొని.. -
డీఐజీగా షేముషి బాధ్యతల స్వీకరణ
[ 10-05-2024]
అనంతపురం రేంజ్ డీఐజీగా షేముషి బాజ్పేయి గురువారం అనంతపురం పోలీస్ హెడ్క్వార్టర్స్లోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. -
న్యూస్టుడే విలేకరి రమేష్పై దాడి హేయం
[ 10-05-2024]
ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో కళ్యాణదుర్గం బహిరంగసభలో న్యూస్టుడే విలేకరి రమేష్పై వైకాపా గూండాలు దాడి చేయడం అత్యంత బాధాకరమని... -
పెల్లుబుకిన ఆక్రోశం, అసంతృప్తి
[ 10-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనపై ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ఆక్రోశం పెల్లుబుకింది. జగన్ పాలనపై వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నీ పాలన ఇక చాలంటూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో వారిలో కసి.. కోపం ప్రస్ఫుటమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
గాయమా? వ్యూహమా? ధోనీ ‘9’లో రావడంపై ఫ్లెమింగ్ స్పందన ఇదీ!
-
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ