‘మహిళా ఉద్యోగులను వేధిస్తే తోలు తీస్తాం’
‘పై అధికారులను గౌరవిస్తాం. వారు చెప్పిన పనిచేస్తాం. అధికారుల ముసుగులో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని వేధిస్తే తోలు తీస్తాం’ అని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భీమిరెడ్డి అంజన్రెడ్డి హెచ్చరించారు.
మాట్లాడుతున్న సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజన్రెడ్డి
అనంత నగరపాలక, న్యూస్టుడే: ‘పై అధికారులను గౌరవిస్తాం. వారు చెప్పిన పనిచేస్తాం. అధికారుల ముసుగులో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని వేధిస్తే తోలు తీస్తాం’ అని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భీమిరెడ్డి అంజన్రెడ్డి హెచ్చరించారు. ఆదివారం అనంతపురంలోని పీవీకేకే కళాశాల సెమినార్ హాల్లో రైతుభరోసా కేంద్రాల సిబ్బంది సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రంలో ఒకే ఒక ఉద్యోగిని నియమించడంతో ఇబ్బందిగా ఉందని, ఒకే ఒక ఉద్యోగి ఇన్ని పనులు చేయడం ఏ రాష్ట్రంలో ఉండదన్నారు. రైతు భరోసా కేంద్ర వ్యవస్థలో పనిచేసే వారి సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. కనీసం మరో ఇద్దరిని నియమించాలని డిమాండు చేశారు. మరోసారి రైతు భరోసా కేంద్రాల సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. సమావేశంలో సచివాలయ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వీరనారాయణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు లావణ్య, శ్రీనివాస్, నరేష్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉక్కపోతకు ఉపశమనం
[ 08-05-2024]
ఉమ్మడి జిల్లాలో మంగళవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో ప్రజలకు కాస్తా ఉపశమనం కలిగింది. పలు మండలాల్లో సాయంత్రం నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. -
అనంత రైతులకు జగన్ నవమోసాలు
[ 08-05-2024]
రైతు పక్షపాతి..బాంధవుడినంటూ గొప్పలు చెప్పుకొనే సీఎం జగన్...అనంత అన్నదాతలకు చేసిందేమీ లేదు. 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేపట్టి.. కనపడిన వారందరికీ ముద్దులు పెట్టిన జగన్.. అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు గుప్పిస్తున్నారు. -
‘ఇచ్చట ఓట్లు అమ్మబడవు’
[ 08-05-2024]
గుత్తిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పర్యవేక్షకుడిగా పని చేస్తున్న ఇస్మాయిల్ ఓటర్లను చైతన్యం పరుస్తున్నారు. గుంతకల్లులోని భాగ్యనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. -
అధికార పార్టీ సేవలో దుర్గం పోలీసు అధికారి
[ 08-05-2024]
ఎన్నికల నియమావళి పాటించడం లేదని, అధికార వైకాపాకు మేలు చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని డీజీపీ, ఐజీ, ఎస్పీలపై ఎన్నికల కమిషన్ వేటు వేస్తున్నప్పటికీ కిందిస్థాయి అధికారులు, సిబ్బందిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. -
నాడు బాదుడే బాదుడన్నాడు.. నేడు పన్నులు దండుకున్నాడు
[ 08-05-2024]
చంద్రబాబు పాలనలో ప్రజలపై పన్నులు బాదుడే బాదుడు అంటూ.. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ నాటి తెదేపా ప్రభుత్వంపై ఎద్దేవా చేశారు. ఆయన అధికారంలోకొచ్చాక.. నిస్సిగ్గుగా ఏటా ఆస్తి పన్ను పెంచి ప్రజలపై భారం మోపాడు. -
అనంతపురం అర్బన్ డీఎస్పీ బాధ్యతల స్వీకరణ
[ 08-05-2024]
అనంతపురం అర్బన్ నూతన డీఎస్పీగా టీవీవీ ప్రతాప్కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న వీరరాఘవరెడ్డి ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసిన విషయం విధితమే. -
తెదేపాలో భారీగా చేరికలు
[ 08-05-2024]
నియోజకవర్గంలోని పలు కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. మంగళవారం స్థానిక ప్రజావేదిక వద్ద తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. -
కన్నుపడితే కబ్జానే
[ 08-05-2024]
రాయదుర్గంలో వైకాపా నాయకులు వంకలు, రిజర్వుడ్ స్థలాలను దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో తెలుసుకొని ఆక్రమించేస్తున్నారు. -
వీఆర్కు కానిస్టేబుల్
[ 08-05-2024]
కళ్యాణదుర్గంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి డబ్బులు పంచిన కానిస్టేబుల్ శివను పోలీసు అధికారులు వీఆర్కు పంపారు. -
నోట్లతో ఎర.. వినకుంటే బెదిరింపు
[ 08-05-2024]
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో వైకాపా నాయకుల ప్రలోభాల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. పుట్టపర్తి ప్రభుత్వ పాఠశాల వద్ద వైకాపా నాయకులు మోహరించి బేరసారాలు సాగించారు. మండుటెండల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోయినా ఉద్యోగులు ఓపిగ్గా నిరీక్షించి ఓటు వేశారు. -
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను
[ 08-05-2024]
‘రానున్న కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. కూటమి మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఎంతగానో మేలు చేస్తాయి.