గుట్టుగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించేలా నిర్ణయాలు తీసుకోబోం.. మాది రైతు ప్రభుత్వం అంటూ నిత్యం గొప్పలు చెప్పే జగన్ ప్రభుత్వం.. కర్షకులను మభ్యపెడుతూ కష్టాలలోకి నెడుతోంది.
రైతులు వ్యతిరేకిస్తున్నా ఏర్పాటు చేయిస్తున్న వైకాపా ప్రభుత్వం
తాడిమర్రిలో రైతు వెంకటేష్ తోటలో ఏర్పాటు చేసిన మీటర్లు
తాడిమర్రి, న్యూస్టుడే: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించేలా నిర్ణయాలు తీసుకోబోం.. మాది రైతు ప్రభుత్వం అంటూ నిత్యం గొప్పలు చెప్పే జగన్ ప్రభుత్వం.. కర్షకులను మభ్యపెడుతూ కష్టాలలోకి నెడుతోంది. వారం రోజులుగా తాడిమర్రి మండలంలోని పలు గ్రామాలలో వ్యయసాయ మోటార్లకు మీటర్లను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 7,800 వ్యవసాయ కనెక్షన్లు ఉండగా ఇప్పటికే 4000పైగా మీటర్లను బిగించడం గమనార్హం. ఎన్నికల సమయంలో ఎవరూ అభ్యంతరం చెప్పరు.. ప్రశ్నించరన్న ఉద్దేశంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. పొలాల్లో ఎవరూ లేనప్పుడు.. గుట్టుచప్పుడు కాకుండా బిగించేస్తున్నారని వారు వాపోతున్నారు. ప్రతి బోరుబావి వద్ద తప్పనిసరిగా మీటర్ ఏర్పాటు చేయాలని వైకాపా ప్రభుత్వం ఆదేశించడంతో స్థానిక విద్యుత్తు శాఖాధికారులు రంగంలోకి దిగారు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా.. గుత్తేదారు ద్వారా అధికారులు ఏర్పాటు చేయిస్తున్నారు. ఈక్రమంలో కొందరు రైతులు మీటర్లను వెనక్కి ఇచ్చేస్తున్నారు. మరికొందరు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై సామాజిక మాధ్యమాల ద్వారా తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. మీటర్లు ఏర్పాటు చేశాక విద్యుత్తు బిల్లులు చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలు వస్తాయన్న అనుమానాలను అన్నదాతలు వ్యక్తం చేస్తున్నారు. భూగర్భజలాలు తగ్గి... సాగు చేసిన పంటలకు నీరు అందుబాటులో లేక, కరవు పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు పడుతుంటే మీటర్లు బిగించడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. మూడు నెలల నుంచి వ్యవసాయానికి సక్రమంగా 9 గంటల కరెంటు ఇవ్వలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో పంటల దిగుబడి తగ్గి పూర్తిగా నష్టపోయినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇవేమీ పట్టనట్లుగా వైకాపా ప్రభుత్వం మీటర్లు ఏర్పాటు చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
నిరంకుశంగా వ్యవహరించడం తగదు
మీటర్లు ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తప్పవని రైతులు అభిప్రాయపడుతున్నారు. అన్నదాతలు ఆందోళన చెందుతున్నా బలవంతంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం. తోటలో మీటరు ఏర్పాటు చేస్తామంటే వద్దని.. అధికారులను వెనక్కి తీసుకెళ్లాలని సూచించాను.
- ఆదినారాయణచౌదరి, మేడిమాకులపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మైనింగ్ మాయగాళ్లు..
[ 29-04-2024]
గనులను వైకాపా నాయకులు కొల్లగొడుతున్నారు. దోపిడీకి చిరునామాగా మార్చేశారు. ప్రభుత్వ వ్యవస్థను సర్వనాశనం చేసి ప్రయివేటు వ్యక్తులకు ప్రకృతి సంపదను దాసోహం చేశారు. -
సీఎం రాగానే.. జనం జారుకున్నారు
[ 29-04-2024]
తాడిపత్రిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రసంగం తేలిపోయింది. ఐదేళ్లుగా బటన్లు నొక్కే కార్యక్రమాల్లో ఏం చెప్పారో.. ఇప్పుడూ అదే ప్రసంగాన్ని ఊదరగొట్టారు. -
జీబీసీపై కన్నెత్తి చూడని జగన్
[ 29-04-2024]
గుంతకల్లు బ్రాంచ్ కెనాల్(జీబీసీ)ను జగన్ సర్కారు ఈ ఐదేళ్లలో కన్నెత్తి చూడలేదు. ఉరవకొండ, విడపనకల్లు, గుంతకల్లు, కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంత రైతులకు జీబీసీ వరం లాంటిది. -
ఐదేళ్లు.. రూ.600 కోట్లు
[ 29-04-2024]
ప్రత్యేక సవరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను భారీగా వడ్డించింది. -
తెదేపా ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
[ 29-04-2024]
కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకలు రాళ్ల దాడికి తెగబడ్డాయి. -
ఐదేళ్లలో వక్కసారీ ఇటు చూడలేదే..
[ 29-04-2024]
వక్క సాగులో మడకశిర నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రసిద్ధి. కర్ణాటక సరిహద్దున ఉన్న ఈ ప్రాంతం సాగుకు అనుకూలంగా ఉండటంతో 150 ఏళ్లుగా పంట పండిస్తున్నారు. -
కర్ణాటకలో కళకళ.. జగన్ పాలనలో ఇలా..
[ 29-04-2024]
ఒక పరిశ్రమ ఏర్పాటైతే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రగతి సాక్షాత్కారమవుతుంది. జగన్ పాలనలో అలాంటిదేం ఉండదు. -
ఎమ్మెల్యే సోదరుడిని జిల్లా బహిష్కరణ చేయాలి
[ 29-04-2024]
ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి దౌర్జన్యకాండకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని, అతడిని జిల్లా బహిష్కరణ చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత డిమాండ్ చేశారు. -
తెదేపా సూపర్ సిక్స్ ముందు.. వైకాపా గ్రాఫ్ పడిపోయింది: కేశవ్
[ 29-04-2024]
వైకాపా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోతో ఆ పార్టీ శ్రేణులే తీవ్ర నిరాశ నిస్పృహల్లో కనిపిస్తున్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
చిట్టడివి కాదు.. జగనన్న కాలనీనే
[ 29-04-2024]
జగనన్న కాలనీల్లో తమ ప్రభుత్వం పేదలకు స్థలాలు ఇవ్వడమే కాదు.. ఊళ్లనే నిర్మిస్తోందని సీఎం జగన్, వైకాపా నాయకులు సభలు, సమావేశాల్లో ఊదరగొట్టారు. -
శిథిల భవనంలోనే వైద్య సేవలు
[ 29-04-2024]
విడపనకల్లులో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల భవనం శిథిలమైంది. -
రథోత్సవానికి ఆహ్వానించలేదని వాగ్వాదం
[ 29-04-2024]
వజ్రకరూరులో రథోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచి, ఆలయ పాలక మండలి సభ్యులను అధికారిక లాంచనాలతో ఆహ్వానించలేదని ఉపతహసీల్దార్ చంద్రశేఖర్, ఈవో కృష్ణయ్యతో స్థానిక వైకాపా నాయకులు వాగ్వాదానికి దిగారు. -
మట్టి దారిలో అవస్థల ప్రయాణం
[ 29-04-2024]
మండలంలోని ఎనుములదొడ్డి నుంచి శెట్టూరు మండలం యరబోరేపల్లికి ఏడు కిలోమీటర్ల మేర మట్టి దారి గుంతలు తేలి ప్రయాణానికి ఏమాత్రం అనుకూలంగా లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. -
బోరు తవ్వకం అడ్డగింత
[ 29-04-2024]
పట్టణంలోని కోటవీధిలో ప్రజలు చందాలు వేసుకుని బోరు తవ్వకం చేపట్టగా వైకాపా నాయకులు అడ్డుకున్నారు. -
టెండరులోనే తిరకాసు.. అద్దె ఎగ్గొట్టినందుకు తాఖీదు
[ 29-04-2024]
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి చెందిన వాణిజ్య సముదాయంలోని అద్దె గదులు, క్యాంటీన్ లీజుదారులు వర్సిటీకి అద్దె చెల్లించకుండా బకాయిలు పడ్డారు. -
పెళ్లి లారీ బోల్తా
[ 29-04-2024]
వివాహ వేడుకలు ముగించుకుని సొంతూళ్లకు పయనమవుతున్న వారికి దారి మధ్యలో సంభవించిన అనుకోని ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
[ 29-04-2024]
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా