వైద్యమో.. జగనన్నా
మండలంలోని శ్రీరంగాపురం గ్రామ సమీపంలో ఏడేళ్ల కిందట ఆరు పడకలతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించారు
24 గంటల ఆసుపత్రుల్లో దయనీయం
కుర్చీలు విరిగి.. బెడ్లు చిరిగి
విరిగిపోయిన కుర్చీలు
శ్రీరంగాపురం(బెళుగుప్ప): మండలంలోని శ్రీరంగాపురం గ్రామ సమీపంలో ఏడేళ్ల కిందట ఆరు పడకలతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించారు. ఇక్కడ ప్రస్తుతం ఇద్దరు వైద్యులు, స్టాఫ్ నర్సులు ముగ్గురు, ఒక ఫార్మాసిస్ట్తో పాటు మరో ఇద్దరు విధులు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి అపరిశుభ్రతకు నిలయంగా మారింది. జనరల్ వార్డులో ఉపయోగించిన దూది, సిరంజీలను మంచాల కింద పడేస్తున్నారు. బండలపై దుమ్మును శుభ్రం చేయడం లేదు. కుర్చీలు విరిగిపోయాయి. మూత్రశాలలు, శౌచాలయాలు ఉన్నప్పటికి నిర్వహణ లోపించి అధ్వానంగా మారాయి. నీటి వసతి లేదు.మందులను వరండాలో నిల్వ చేశారు. ఆపరేషన్ గదిలో బెడ్ దెబ్బతింది. ప్రజలు వైద్యచికిత్స కోసం కళ్యాణదుర్గం, కణేకల్లు ఆసుపత్రులకు వెళుతున్నారు.
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. 24 గంటల ఆసుపత్రుల్లో కనీస వసతులు లేక.. వైద్యం అందక రోగులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో అసౌకర్యాలపై కథనం.
సరిపడా వైద్యులు లేక ఇక్కట్లు
కంబదూరు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యాధికారులు ఉన్నారు. వారిలో ఒకరు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 104 వాహనంలో గ్రామాలకు వెళ్తున్నారు. ఒక్కరే ఓపీ చూడాల్సి వస్తుంది. కంబదూరు మండలంలోని 42 గ్రామాలకు ఇదే పెద్ద ఆసుపత్రి. రోజుకు 200 నుంచి 250 మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సిన దయనీయమిది.
శిథిల భవనంలో బిక్కుబిక్కుమంటూ..
కణేకల్లు: మండలంలోని యర్రగుంట పీహెచ్సీ భవనం పైకప్పు పెచ్చులూడి శిథిలావస్థకు చేరుకుంది. ఇరుకు ఓపీ గదిలోనే ల్యాబ్ నిర్వహించాల్సిన దుస్థితి. కంప్యూటర్, టీకాల నిల్వ, సిబ్బంది గదుల పైకప్పు పెచ్చులూడుతున్నాయి. శిథిల భవనంలో బిక్కుబిక్కుమంటూ వైద్యం అందించాల్సిన పరిస్థితి. నాడు నేడు కింద రూ.1.75కోట్లతో నూతన భవనం రూపుదిద్దుకున్నా.. బిల్లులు చెల్లించక పోవడంతో గుత్తేదారుడు భవనం స్వాధీనం చేయలేదు.
సేవలు నామమాత్రం
శెట్టూరు: స్థానిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ జబ్బులకు మాత్రమే ఇక్కడ వైద్యం చేస్తారని, ఎక్కువ మందిని కళ్యాణదుర్గం, ఇతర ప్రాంతాలకు సిఫారసు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. క్యాంపుల పేరుతో డాక్టర్లు పీహెచ్సీకి రారని, ఎప్పుడూ కిందిస్థాయి సిబ్బందే వైద్యం చేస్తారని రోగులు ఆరోపిస్తున్నారు. నాడు-నేడు కింద రూ.35లక్షలు మంజూరైనా ఆసుపత్రిలో పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పనులు పూర్తి కాకపోయినా రంగులు మాత్రం కొట్టించారు. అభివృద్ధి పనుల కోసం గోతులు తీయడంతో పాములు వస్తున్నాయని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛను చేతికిస్తారా ప్రాణాలు తీస్తారా?
[ 30-04-2024]
సామాజిక పింఛను సొమ్ముపై ఆధారపడి జీవిస్తున్న పండుటాకులకు చెడు జరిగితేనే ఎన్నికల్లో తన పార్టీకి మంచి జరుగుతుందని జగన్ భావిస్తున్నారు. -
గ్రామంలో ఎలా తిరుగుతావో చూస్తా..
[ 30-04-2024]
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి సోదరులు చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులకు అంతులేకుండా పోతోంది. -
తుది పోరుకు సై
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. సోమవారం నామపత్రాల ఉపసంహరణ ప్రక్రియ గడువు పూర్తి అయింది. -
శవాగారాల్లోనూ దోపిడీ
[ 30-04-2024]
అనంత సర్వజనాసుపత్రిలో అనాథ, గుర్తుతెలియని మృతదేహాలను నిలవ చేయడం గగనంగా మారుతోంది. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో పైసా ఇవ్వని పరిస్థితుల్లో ఈ దుస్థితి దాపురించింది. -
కొండలు, గుట్టల దోపిడీ.. జగనెరిగిన సత్యం
[ 30-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. నాయకులకు ప్రకృతి వనరులు ఆదాయ మార్గాలుగా మారాయి. నాడు కొండలను చూస్తే వామ్మో కొండలు అనేవారు -
ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయం
[ 30-04-2024]
పార్టీలకు కార్యకర్తలు, నాయకులే బలం. వారు లేకపోతే పార్టీనే లేదు. ఏ రోజైనా మీ పార్టీ నాయకులను గౌరవించారా? గౌరవించి ఉంటే వైకాపాను వీడాల్సిన పనిలేదు. ప్రజలతోపాటు సొంత పార్టీ నాయకులను కూడా వేధిస్తున్నారు. -
అధికార పార్టీకి ఓటుతో బుద్ధి చెబుదాం
[ 30-04-2024]
అన్ని రంగాల్లో అభివృద్ధిని మరిచిన వైకాపా ప్రభుత్వానికి ఓట్లతో బుద్ధి చెప్పాలని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పిలుపునిచ్చారు. -
వాలంటీరుకు దేహశుద్ధి
[ 30-04-2024]
మండలంలోని ఓ గ్రామంలో మాజీ మహిళా వాలంటీరును సెల్ఫోన్లో వేధించిన మరో వాలంటీరుకు సోమవారం బంధువులు, గ్రామస్థులు దేహశుద్ధి చేశారు -
అమృత్ను అటకెక్కించారు
[ 30-04-2024]
పెనకచర్ల డ్యామ్ నుంచి పామిడి మండలానికి నీరు రప్పించడం ద్వారా తాగునీటి అవసరాలు తీర్చవచ్చన్న ఆలోచనతో అమృత్ పథకం కింద తెదేపా హయాంలో చేపట్టిన పనులు అటకెక్కాయి. -
వైకాపాలో బీసీలకు అన్యాయం.. కూటమికే మద్దతిస్తాం
[ 30-04-2024]
జనాభా ప్రాతిపదికన బీసీ ఓటర్లే అత్యధికంగా ఉన్నాం. బీసీ ఓటర్లతోనే జగన్మోహన్రెడ్డి గద్దెనెక్కారు. నమ్మిన బీసీలకు తీరని అన్యాయం చేశారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం తెలుగుదేశం పార్టీ
[ 30-04-2024]
మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం గుణేమోరుబాగుల్, మోరుబాగుల్ తాళికేర, ముతుకూరు, సీసీగిరి గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బి.కె.పార్థసారథి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి ఎం.ఎస్.రాజు, గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ ఇంతవరకు అభివృద్ధి జరిగింది -
కళ్లు మూసుకున్న పాలకులకు కల్వర్టు కష్టాలేం తెలుస్తాయ్..
[ 30-04-2024]
వర్షాలకు కొట్టుకుపోయిన వంతెన బాగుచేస్తే వందలాది మందికి ప్రయోజనం. అయినా వైకాపా ప్రభుత్వానికి కనీస పట్టింపులేదు. -
వైకాపా ఎమ్మెల్యే సోదరుడికి చేదు అనుభవం
[ 30-04-2024]
బుక్కపట్నం మండలంలోని బుచ్చయ్యగారిపల్లి గ్రామానికి చెందిన రామాంజినమ్మకు మూడేళ్ల కిందట జగనన్న గృహం మంజూరైంది. మంజూరు పత్రం సైతం అందించారు.