లీజు పేరుతో ట్రాక్టర్లు మాయం ఘరానా ముఠా అరెస్టు
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో లీజు పేరిట ట్రాక్టర్లు తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఘరానా ముఠా కేసును ఛేదించి కీలక సభ్యులను అరెస్టు చేసినట్లు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు.
57 వాహనాల స్వాధీనం
స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, పోలీసు అధికారులు
తాడిమర్రి, న్యూస్టుడే : ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో లీజు పేరిట ట్రాక్టర్లు తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఘరానా ముఠా కేసును ఛేదించి కీలక సభ్యులను అరెస్టు చేసినట్లు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. బుధవారం తాడిమర్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ, డీఎస్పీ శ్రీనివాసులు వివరించారు. నల్లచెరువు మండలం బొమ్మిరెడ్డిపల్లెకు చెందిన నల్లజంగరి రవికుమార్, ఎన్పీకుంట మండలం వంకమద్దికి చెందిన సాకే రామ్మోహన్, ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా పులివెందులకు చెందిన బయారెడ్డి, సింహాద్రిపురం మండలం లోమడ వాసి కాకర్ల హాజీపీరా, బ్రహ్మంగారి మఠం మండలం కందిమల్లయ్యపల్లికు చెందిన బోగిరెడ్డి చంద్ర ఓబుళరెడ్డి, మద్దిరెడ్డిపల్లికి చెందిన పెసల నాగమల్లారెడ్డి, యాలురుకు చెందిన సుదర్శన్రెడ్డి, నంద్యాల జిల్లా గోస్పాడు మండలం శ్రీనివాసపురం చెందిన తలారి రామలింగేశ్వరరావు, అవుకు మండలం చెన్నంపల్లికి చెందిన పాణ్యం మల్లికార్జునరెడ్డి, కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా చాకవేలు గ్రామ వాసి జయచంద్రారెడ్డి, తీగలపల్లి వాసి మధుసూదన్రెడ్డి ముఠాగా ఏర్పడ్డారు. ఏడాదిగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాలకు వెళ్లి పులివెందుల, కడప ప్రాంతాల్లో వివిధ పనుల నిమిత్తం ట్రాక్టర్లు లీజు కావాలని వాహనాల యజమానులను సంప్రదించారు. ప్రతి నెలా రూ.25,000 ఖాతాలోకి జమ చేస్తామని, నకిలీ అగ్రిమెంట్ పత్రాలపై సంతకాల చేయించి అందజేశారు. రెండు నెలలపాటు కొందరికి నగదును జమచేశారు. ఆ తరువాత పత్తా లేకుండా పోయారు. ట్రాక్టర్ల యజమానులు చరవాణిలో సంప్రదించినా అందుబాటులోకి రాలేదు. దీంతో కొందరు తాడిమర్రి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తక్కువ ధరకే విక్రయించిన కేటుగాళ్లు
లీజుకు అని చెప్పి తీసుకెళ్లిన వందలాది ట్రాక్టర్లను కేటుగాళ్లు ఉమ్మడి శ్రీపొట్టిశ్రీరామలు నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూలు, నంద్యాల, గుంటూరు జిల్లాలో తక్కువ ధరకే ఇష్టారీతిన విక్రయించేశారు. అలా వచ్చిన నగదును ముఠాలోని సభ్యులు భాగాలుగా పంచుకునేవారు. ఈ ట్రాక్టర్లు కొనుగోలు చేసిన వ్యక్తులను కూడా వీరు మోసం చేశారు. తక్కువ ధరకు రిజిస్టర్ చేయిస్తామని నగదు తీసుకుని ఉడాయించేవారు.
ట్రాక్టర్ల విలువ రూ.5 కోట్లకు పైగానే..
ముఠాలోని కీలక సభ్యులైన రవికుమార్, బయారెడ్డి, హాజీపీరాలను అరెస్టు చేసినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. వీరి ఇచ్చిన సమాచారం మేరకు 57 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారుగా రూ.5 కోట్లకు పైగానే ఉంటుందన్నారు. ఇంకా వాహనాలు రికవరీ చేయాలని, ముఠాలోని మిగతా సభ్యులను పట్టుకుని వాటిని స్వాధీనం చేసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ కృష్ణంరాజునాయక్, క్రైం బ్రాంచ్ సీఐ హేమంత్కుమార్, ఎస్ఐ నాగస్వామి తదితరులు పాల్గొన్నారు.
గత నెల 14న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంతో ఘరానా ముఠాను వెలుగులోకి తెచ్చింది
‘ఈనాడు’ కథనంతో కదిలిన పోలీసులు
ఈ వ్యవహారంపై గత నెల 14న ‘లీజు పేరుతో ఘరానా మోసం’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎస్పీ మాధవరెడ్డి పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు. దీనిపై డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేసి.. ఇతర జిల్లాలో మకాం వేసి నిందితులను అరెస్టు చేశారు. ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవ్వాతాతల పింఛన్లపై జగన్నాటకం
[ 01-05-2024]
ఏ బిడ్డ కన్నవారిని కష్టపెట్టాలనుకోడు. ఏ మనవడు అవ్వతాతల్ని మండుటెండలో నిల్చోబెట్టి మాడ్చాలని కోరుకోడు. ఏ సోదరుడు అక్కాచెల్లెమ్మలను ఇబ్బంది పెట్టాలని తలంచడు.నోరు తెరిస్తే మీ బిడ్డనంటూ దీర్ఘాలు తీసే సీఎం జగన్ మాత్రం అవ్వాతాతలు, -
జగన్ పాలనలో 108 కుయ్యో.. మొర్రో
[ 01-05-2024]
108కి ఫోన్ చేసి సమాచారం ఇస్తే అర్బన్ ప్రాంతంలో 15 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాలు, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లోపు అంబులెన్స్ బాధితులు ఇచ్చిన అడ్రస్కు చేరుకోవాల్సి ఉంది. -
దుర్గంలో ఎర్రమట్టి దోపిడీ
[ 01-05-2024]
రాయదుర్గంలో అధికారం అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పట్టణం సరిహద్దున ఉన్న చెరువులు, కొండల్లో మట్టిని యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారు. ఐదేళ్లుగా దందా సాగిస్తూ రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేడు. -
వంతెన హామీకి రెండున్నరేళ్లు
[ 01-05-2024]
అనంతపురం-అమరావతి జాతీయ రహదారిలోని బుక్కరాయసముద్రం వద్ద వంకపై వంతెన నిర్మాణానికి వైకాపా ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతి హామీ ఇచ్చి రెండున్నరేళ్లయింది. -
జాలిలేని జగన్ మామ..
[ 01-05-2024]
మారుమూల మడకశిర ప్రాంతంలో నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్యను అందించాలనే సదుద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి రెండు బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు మంజూరు చేయించారు. -
పల్లెల ప్రగతిపై ప్రభుత్వం నిర్లక్ష్యం
[ 01-05-2024]
వైకాపా ఐదేళ్ల పాలనలో పల్లెల్లో అభివృద్ధి జాడ లేకుండా పోయింది. కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉరవకొండ మండలంలోని రాకెట్ల, ఆమిద్యాల, మోపిడి గ్రామాలు పెద్దవి. -
బలిజలకు జగన్ వెన్నుపోటు పొడిచారు
[ 01-05-2024]
గత తెదేపా హయాంలో బలిజలను వెన్నుతట్టి ప్రోత్సహించారని, వైకాపా ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్ వెన్నుపోటు పొడిచి బలిజలను సర్వం నాశనం చేశారని కాపు సంఘం రాష్ట్ర ఐకాస నాయకుడు వాసిరెడ్డి ఏసుదాసు ఆరోపించారు. -
అరాచక పాలనకు అంతం పలుకుదాం
[ 01-05-2024]
అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న వైకాపాకు అంతం పలుకుదామని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం పలు గ్రామాల్లో మంగళవారం పరిటాల సునీత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
బరిలో పెరిగిన పోటీదారులు
[ 01-05-2024]
జనాలకు రాజకీయాల పట్ల ఆసక్తి నానాటికి పెరుగుతోంది. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. -
‘ఆశీర్వదించండి.. 114 చెరువులను నింపుతా’
[ 01-05-2024]
ప్రజలు తనను ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపిస్తే రెండున్నరేళ్లలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులను నింపుతానని, రహదారులను బాగు చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. -
వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం
[ 01-05-2024]
వైకాపా అరాచక పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు కూటమి వైపు చూస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
భారీగా నగదు పట్టివేత
[ 01-05-2024]
అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అనంత అర్బన్ డీఎస్పీ వీర రాఘవరెడ్డి మంగళవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. -
రానున్న మూడ్రోజుల్లో తీవ్ర వడగాలులు
[ 01-05-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న మూడు రోజుల్లో తీవ్రమైన వడ గాలులు వీస్తాయని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. -
‘ఉమ్మడి మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం’
[ 01-05-2024]
ఎన్డీఏ కూటమి మంగళవారం విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలో అన్ని వర్గాలవారికి సమ ప్రాధాన్యం కల్పించారని తెదేపా జిల్లా అధ్యక్షుడు వడ్డె అంజినప్ప పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యంగ్గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
-
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
-
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
-
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!