నారీ యుక్తి.. పాడికి శక్తి
ఏటా పలకరించే కరవు.. పెరిగిన పెట్టుబడులతో సాగు భారంగా మారిన దుర్భిక్ష పరిస్థితులతో కుదేలైన గ్రామాల్లో ఊపిరిలూదారు అక్కడి నారీమణులు.
కరవు గ్రామాల్లో క్షీర విప్లవం
పుత్తూరు మండలం తిమ్మాపురంలో పాలు పోస్తున్న మహిళ(పాత చిత్రం)
ఏటా పలకరించే కరవు.. పెరిగిన పెట్టుబడులతో సాగు భారంగా మారిన దుర్భిక్ష పరిస్థితులతో కుదేలైన గ్రామాల్లో ఊపిరిలూదారు అక్కడి నారీమణులు. సాగును పక్కన పెట్టి పాడికి పట్టం కట్టారు.. ఒకరి తర్వాత మరొకరు చైతన్యాన్ని అందిపుచ్చుకున్నారు.. నేడు తూర్పు మండలాల్లో క్షీర పరవళ్లు సృష్టించారు.
న్యూస్టుడే, పుత్తూరు: తూర్పు మండలాల్లో ఏటా పంటలు సాగు చేసి నష్టాలు చవిచూస్తున్నారు. ఓ పక్క పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. కూలీలు దొరకడం కష్టంగా మారింది. వరి, వేరుసెనగ, చెరకు తదితర పంటలు సాగు చేసినా ఆశించిన ధర దక్కడం లేదు. అప్పులే మిగులుతున్నాయి. పిల్లల చదువులకు ఇబ్బందులే. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ బాధ్యతను మహిళలే తీసుకున్నారు.
పుత్తూరు మండలంలోని తొరూరు, తిమ్మాపురం, గోపాలకృష్ణాపురం, అమరంకండ్రిగ, పరమేశ్వరమంగళం, నగరిలోని ఎం.కొత్తూరు తదితర ప్రాంతాల్లో మహిళా రైతులు పాడిపై దృష్టి సారించారు. ఒక్కో ఆవును రూ.40 నుంచి 50వేలకు కొనుగోలు చేసి మంచి పాల దిగుబడి సాధించారు. ఇది క్రమంగా అన్ని గ్రామాల్లోనూ విస్తరిస్తోంది. నేడు ఒక్క తూర్పు మండలాల్లోనే 50వేల కుటుంబాలకు పైగా పాడితో జీవనోపాధి పొందుతున్నారు. నగరి మండలంలోని ఎం.కొత్తూరు గ్రామంలో ప్రతి రోజు 500 లీటర్లుకు పైగా పాల ఉత్పత్తి జరుగుతోంది. నెలకు ఆ ఒక్క గ్రామంలో రూ.10లక్షల వరకు పాడి ద్వారా అక్కడి రైతులు ఆర్జిస్తుండటం గమనార్హం. చంద్రగిరి మండలం శానంబట్ల పంచాయతీలో 750 పాడి ఆవులు ఉన్నాయి. ఇక్కడ 630 కుటుంబాలు పాడిపై ఆధారపడ్డాయి. రోజూ రెండు వేల లీటర్ల పాలు కేంద్రాలకు పోస్తారు.
వారిదే కీలక భూమిక..
గత కొన్నేళ్లుగా మహిళా రైతులు క్రియాశీలకంగా ఉంటూ పాడిపరిశ్రమను ముందుండి నడుపుతున్నారు. పొలంలో గ్రాసం వేయడం మొదలు, ఇంటికి తీసుకురావడం, ఆవులకు వేయడం, షెడ్లు శుభ్రం చేయడం ఇలా ఆయా పనుల్లో మహిళలదే కీలక భూమిక పోషిస్తున్నారు. భర్త సాయంతో పాడిని లాభదాయకంగా మార్చారు. పొలాలు లేని వారు బోరు బావుల కింద 50సెంట్లు భూమి ఉన్న రైతులు కూడా పోషకాలు కలిగిన గ్రాసం పెంచుతున్నారు. రోజావారీ 15-20 లీటర్లకు పైబడి పాల ఉత్పత్తి సాధిస్తున్నారు. నాణ్యమైన పాలు అందించడం ద్వారా లీటరుకు రూ.40 నుంచి రూ.60 వరకు పొందుతున్నారు. ఇలా రోజుకు దాదాపు రూ.వెయ్యి నుంచి రెండు వేలు సంపాదిస్తున్నారు.
తూర్పు మండలాల్లో 2 లక్షల లీటర్లకు పైగా
పుత్తూరు, నగరి, నారాయణవనం, సత్యవేడు, శ్రీకాళహస్తి, వరదయ్యపాళెం ప్రాంతాల్లో పాల దిగుబడి పెరగడంతో దాదాపు 50కు పైగా డెయిరీలు ఏర్పాటయ్యాయి. నిత్యం ఈ ప్రాంతం నుంచి రెండు లక్షల లీటర్లు వరకు పాల దిగుబడి ఉంది. ఇక్కడి గ్రామ సీమల్లో మహిళలు సమైక్యంగా సాధించిన విజయమని డెయిరీల నిర్వాహకులు చెబుతున్నారు.
నెలకు రూ.20వేలు సంపాదిస్తున్నా..
మాకు ఆరు పశువులు ఉన్నాయి వాటిలో నాలుగు పాలు ఇస్తున్నాయి. నెలకు రూ.20వేల వరకు పాడి పోషణపై ఆర్జిస్తున్నాం. గ్రామంలో చాలామంది మహిళలు పాడిద్వారా ఆర్థికంగా స్థిరపడ్డారు.
లక్ష్మి, ఎం.కొత్తూరు, నగరి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డబుల్ ఇంజిన్లా దూసుకెళ్తాం
[ 08-05-2024]
‘కూటమి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో కళకళలాడుతోంది.. జగన్ మేనిఫెస్టో ఎత్తిపోయింది.. ఆ పార్టీకి డిపాజిట్లు రావు.. కేంద్రంలో మోదీ గ్యారెంటీ ఉంది.. ఇక్కడ ప్రజాగళం మేనిఫెస్టో, సూపర్-6లకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. -
హలో పుంగనూరు.. బైబై పాపాల పెద్దిరెడ్డి
[ 08-05-2024]
‘పుంగనూరు ప్రజలకు ఈరోజే స్వాతంత్య్రం వచ్చింది. రేపటి నుంచి అంతా మంచి రోజులే. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిడిసిపడుతున్నారు. నియోజకవర్గంలో శివశక్తి డెయిరీ కాకుండా వేరే డెయిరీ పోతుందా? అదే మా ఊళ్లో (నారావారిపల్లె)లో అన్ని డెయిరీలు పోతున్నాయి. -
వైకాపా దోచుకుంది.. తెదేపాకు మద్దతివ్వండి
[ 08-05-2024]
వైకాపా ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటు అనే ఆయుధంతో రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడానికి ప్రజలందరూ ముందుకు రావాలని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. -
దమనకాండ.. జగన్ అండదండ
[ 08-05-2024]
ఏమున్నది గర్వకారణం.. వైకాపా పాలన సమస్తం.. పరపీడన పరాయణత్వం అన్నట్లు సాగింది ఈ ఐదేళ్లు. జిల్లాలో లెక్కలేనన్ని అరాచకాలకు తెగబడ్డారు. ప్రతిపక్షాలు, సామాన్యులపై దమనకాండకు పాల్పడ్డారు. ప్రశ్నిస్తే దాడులు, కేసులు, అరెస్టులు చేయించారు. -
అమాత్యుడి అండ.. అవినీతి దందా..!
[ 08-05-2024]
కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతికి అడ్డూ.. అదుపూ లేకుండా పోతోంది. స్థానికంగా అధికార పార్టీ నాయకుడి అండ దండలు పుష్కలంగా ఉండటంతో.. కొందరు అధికారులు, సిబ్బందికి ఆడిందే ఆటగా మారింది. -
ధరణి.. కాజేసే ధోరణి
[ 08-05-2024]
చిత్తూరు నగరం తేనెబండ రెవెన్యూలో తిరుపతి- చిత్తూరు జాతీయ రహదారి పక్కన ఉన్న ఎకరా భూమి విలువ రూ.3 కోట్లు ఉంది. ఇది తనదంటూ ఒకరు నకిలీ రికార్డులు సృష్టించారు. -
జలంకారప్రాయం
[ 08-05-2024]
కుప్పాన్ని పులివెందులలా చూస్తామని జగన్ వల్లెవేసిన మాటలు.. ఐదేళ్ల పాలనలో ఉద్దరించేశామని స్థానిక నేతల సుద్ధులు, మాటలకు.. చేతలకు పొంతన లేదని.. కుప్పంపై కక్ష సాధిస్తున్నారని ప్రస్ఫుటమవుతోంది. -
‘ఎర్ర చందనం స్మగ్లర్ పేదవాడంట’
[ 08-05-2024]
ఎర్రచందనం స్మగ్లర్, వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డి తాను పేదవాడినని చొక్కా విప్పి ఆందోళన చేయడం హాస్యాస్పదంగా ఉందని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ధ్వజమెత్తారు. -
కవ్వించి.. దాడిచేసి
[ 08-05-2024]
మండల కేంద్రమైన ఐరాలలో మంగళవారం మధ్యాహ్నం వైకాపా, తెదేపా నాయకులు మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. -
పెద్దిరెడ్డి 142 ఆస్తుల వివరాలు వెల్లడించలేదు
[ 08-05-2024]
ఎన్నికల అఫిడవిట్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలు బహిర్గతం చేయలేదని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్ర యాదవ్ ఆరోపించారు. -
జడ్పీ పూర్వ ఉన్నతాధికారిపై కలెక్టర్ ఆగ్రహం
[ 08-05-2024]
ఎన్నికల విధుల్లోని ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించే కేంద్రంలో జడ్పీ పూర్వ ఉన్నతాధికారి ఉండటంపై తెదేపా శ్రేణులు కలెక్టర్ షన్మోహన్కు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
ఓటేసేందుకు వెళ్లారని సచివాలయ సిబ్బందికి వేధింపులు
[ 08-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు వెళ్లిన ఏడుగురు సచివాలయ సిబ్బందిని మండల పరిషత్ అధికారులను వేధింపులకు గురిచేశారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకోగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి నేడు ఆఖరు
[ 08-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, అత్యవసర సేవల్లోని ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునేందుకు బుధవారం ఆఖరు గడువు. -
యువకుడిపై బాలుడు కత్తితో దాడి
[ 08-05-2024]
మండల పరిధి బ్రాహ్మణపల్లెకి చెందిన ఓబాలుడు(14) తల్లితో పాటు తిరుపతిలో ఉంటూ జులాయిగా తిరిగేవాడు. స్థానిక ఎస్సీకాలనీకి చెందిన విజయకుమార్(24) డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటున్నాడు.