రూ.2.58 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
ఎన్నికల తనిఖీల్లో భాగంగా కడియం పోలీసులు రూ.2.58 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీ చేస్తున్న తహసీల్దార్ రమాదేవి, సీఐ తులసీధర్
కడియం, న్యూస్టుడే: ఎన్నికల తనిఖీల్లో భాగంగా కడియం పోలీసులు రూ.2.58 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ తులసీధర్, తహసీల్దార్ రమాదేవిల కథనం మేరకు.. పొట్టిలంక చెక్పోస్ట్ వద్ద మంగళవారం సాయంత్రం బంగారం, వెండి ఆభరణాలను రవాణా చేస్తున్న వాహనాన్ని నిలుపుదల చేశారు. వారి వద్ద కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన రవాణా అనుమతులు లేనట్లు గుర్తించారు. దాంతో వాహనంలోని ఆభరణాలను జీఎస్టీ, ఆదాయ తదితర ఉన్నతాధికారుల పర్యవేక్షణలో నిశితంగా పరిశీలించారు. వాహనంతోపాటు సుమారు 4.5 కేజీల బంగారం, 1.2 కేజీల వెండి వస్తువులను ఎఫ్ఎస్టీ బృందానికి అప్పగించారు. వాటి విలువ సుమారు రూ.2.58 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. వీటిని విజయవాడ నుంచి భీమవరం, రాజమహేంద్రవరంలోని పలు నగల దుకాణాలకు తరలించేందుకు తీసుకెళ్తున్నట్లు వాహన చోదకుడు తెలిపారు.
కల్వర్టు గోతిలో పడి యువకుడి దుర్మరణం
సీతానగరం, న్యూస్టుడే: రాజమహేంద్రవరం, సీతానగరం నాలుగు వరుసల రహదారి విస్తరణలో నిరక్ష్యపు పనులకు మరో యువకుడు బలి అయ్యాడు. మరో అయిదు నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంటాడనగా అతని పాణాలు గాల్లో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళ్లితే.. కోరుకొండకు చెందిన మత్స్యకార కుటుంబికులు దోమ సతీష్(24) తన ఇద్దరు స్నేహితులు శేఖర్, గిరిష్తో కలిసి బైక్పై రఘుదేవపురంలో జరుగుతున్న చింతాలమ్మ సిరి ఉత్సవాలకు మంగళవారం రాత్రి వస్తున్నారు. రాపాక వద్దకు వచ్చేసరికి కల్వర్టు వద్ద చీకట్లో గొయ్యి కనిపించకపోవడంతో అందులో పడిపోయారు. దీంతో వారు గట్టిగా అరవడంతో పరిసర వాసులొచ్చి బయటకు తీశారు. అప్పటికే సతీష్ కొన ఊపిరితో ఉండగా మిగతా ఇద్దరికి స్వల్పగాయలయ్యాయి. 108 అంబులెన్సు అందుబాటులో లేకపోవడంతో సంఘటనా స్థలానికి చేరిన సీతానగరం ఎస్సై రామకృష్ణ తన జీపులో బాధితుడిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సతీష్ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆ కల్వర్టు దాటితే అయిదు నిమిషాల్లో బంధువుల ఇంటికి చేరి ఉత్సవాలను చూసేవారని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా ఈ కల్వర్టుల వద్ద అవసరమైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో పలువురు క్షతగాత్రులవుతున్నారని ‘వంతెనలు శిథిలం.. రైతన్నకు భారం’ శీర్షికన ‘ఈనాడు’ ముందుగానే హెచ్చరించడం గమనార్హం. దీనిపై అధికారులు స్పందించి ఉంటే ఓ నిండు ప్రాణం పోకుండా ఉండేది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భవిష్యత్తు మనదే
[ 06-05-2024]
‘ఎన్నికలకు సరిగ్గా వారం ఉంది. మా ప్రసంగాలు వినండి. కూటమి మ్యానిఫెస్టో చదవండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి’ అని పవన్కల్యాణ్ కోరారు. కాకినాడ జిల్లా తునిలోని గొల్ల అప్పారావు కూడలిలో వారాహి విజయభేరి బహిరంగ సభలో ఆదివారం సాయంత్రం ఆయన ప్రసంగించారు. -
అధర్మకర్తల మండలి
[ 06-05-2024]
జగనన్న పాలనలో పాలకవర్గాల(ధర్మకర్తల మండలి) సభ్యులు దేవస్థానం శ్రేయస్సు, భక్తుల సౌకర్యాలు కల్పించేలా పనిచేసింది అంతంతమాత్రమే. ఆలయ పాలకవర్గాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. -
ప్రజాగళం.. సర్వం సన్నద్ధం
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం తుది దశకు చేరుతోంది. సోమవారం అగ్రనేతల సభతో రాజమహేంద్రవరం కళకళలాడనుంది. కడియం మండలం వేమగిరిలో జరిగే ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ, -
ఇక్కడైనా గందరగోళం లేకుండా చూస్తారా?
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది, అత్యవసర సేవలు అందించే ఉద్యోగులకు సోమవారం నుంచి మూడు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ నిర్వహించనున్నారు. -
నూతన భూహక్కు చట్టంపై జగన్ సర్కారునే ప్రశ్నించాలి
[ 06-05-2024]
ఏపీ నూతన భూహక్కు చట్టం అమలుపై జగన్మోహన్రెడ్డి సర్కారును ప్రశ్నించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి ఫురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ నీతిఆయోగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కేవలం సూచించిందన్నారు. -
పవన్ కల్యాణ్ను అసెంబ్లీకి పంపిద్దాం
[ 06-05-2024]
జనసేన అధినేత పవన్కల్యాణ్పై తన తండ్రి ముద్రగడ పద్మనాభం విమర్శలు చేయడాన్ని ఖండించిన ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి తాజాగా మరో వీడియో సందేశం విడుదల చేశారు. -
పోస్టల్ బ్యాలెట్లపై కాకినాడలో గందరగోళం
[ 06-05-2024]
కాకినాడలోని పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ వినియోగ కేంద్రం వద్ద ఆదివారం గందరగోళం నెలకొంది. పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసినా జాబితాలో పేర్లు లేకపోవడంతో ఎన్నికల విధుల్లో ఉన్న చాలామంది ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
ఓటేశాక.. వృద్ధులను వదిలేశారు..
[ 06-05-2024]
ఎన్నికల ముందు ప్రతిపక్షనేత హోదాలో పాదయాత్ర చేసిన జగన్ ఎన్నో హామీలు గుప్పించారు. అన్ని వర్గాలను మాటలతో మెప్పించి.. అనంతరం నిండా ముంచారు. -
మొదటి రోజు ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికలు-2024 ప్రక్రియలో భాగంగా ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులకు నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ మొదటి రోజు ఆదివారం చిన్నపాటి సంఘటన మినహా ప్రశాంతంగా జరిగింది. -
అగ్నిసాక్షిగా.. పరిహారానికి ఎగనామం..!
[ 06-05-2024]
అనుకోకుండా అగ్ని ప్రమాదాలతో రోడ్డునపడుతున్న కుటుంబాలకు వైకాపా ప్రభుత్వం మొండిచేయే చూపుతోంది. బహిరంగ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు పేదలపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారు. -
జీవితాలు మార్చేవారికీ జీతాల్లేవ్..!
[ 06-05-2024]
వైకాపా పాలనలో ప్రభుత్వ ఉద్యోగులేకాదు.. ఒప్పంద, పొరుగు సేవల్లో విధులు నిర్వహిస్తున్న చిరుద్యోగులు కూడా వేతనాలు సకాలంలో అందక, కుటుంబ పోషణ జరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
జగన్ జమానాలో.. అంపశయ్యపై ఆరోగ్యశ్రీ
[ 06-05-2024]
క్షేత్రస్థాయిలో ఆరోగ్యశ్రీ పథకం పరిస్థితి దయనీయంగా ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం లేదు. రూ.కోట్లల్లో బకాయిలు నెలల తరబడి ఇవ్వకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. -
విపత్కర పాలనను సాగనంపడానికే కూటమి: పురందేశ్వరి
[ 06-05-2024]
రాష్ట్రంలోని విపత్కర పాలనను విచ్ఛిన్నం చేయడానికి కూటమి ఆవిర్భవించిందని కూటమి రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
జగన్ తెచ్చిన నల్లచట్టంపై తిరుగుబాటు చేయాలి: ముప్పాళ్ల
[ 06-05-2024]
రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలు తిరుగుబాటు చేయాలని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు, ఐఏఎల్ రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు పిలుపునిచ్చారు. -
మీడియా ప్రతినిధులకూ పోస్టల్ బ్యాలట్ అవకాశం
[ 06-05-2024]
జిల్లాలో పనిచేస్తున్న మీడియా ప్రతినిధులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలట్ ద్వారా వినియోగించుకునే వెసులుబాటును రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీలత ఆదివారం