రోగుల భద్రత మరిచావా పాలకా!
ఒకప్పుడు నిత్యం ప్రయాణికులతో కళకళలాడే గోదావరి రైల్వేస్టేషన్ పలు సమస్యలతో కునారిల్లుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పాలు, కూరగాయలు తీసుకొచ్చే చిరు వ్యాపారులు.. చదువుల నిమిత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు.. ఉద్యోగులు ఇక్కడి నుంచే పాసింజర్లలో రాకపోకలు సాగించేవారు.
మూతపడిన భూగర్భ నడక మార్గం
న్యూస్టుడే, వి.ఎల్.పురం: రాజమహేంద్రవరం నగర నడిబొడ్డున ఉన్న గోదావరి రైల్వేస్టేషన్ ఈ అయిదేళ్లలో అభివృద్ధికి నోచుకోలేదు. అధికార వైకాపాకు చెందిన ఎంపీ నగరవాసే అయినప్పటికీ అభివృద్ధికి ఎటువంటి కృషి చేయలేకపోయారు. ఈ స్టేషన్ గోడును కేంద్రంలోని పెద్దలకు వినిపించలేకపోయారు. రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించడంలోనూ విఫలమయ్యారు. మరోవైపు నిర్వహణ విషయంలో రైల్వేశాఖ నిర్లక్ష్యం చేసింది.
ఒకప్పుడు నిత్యం ప్రయాణికులతో కళకళలాడే గోదావరి రైల్వేస్టేషన్ పలు సమస్యలతో కునారిల్లుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పాలు, కూరగాయలు తీసుకొచ్చే చిరు వ్యాపారులు.. చదువుల నిమిత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు.. ఉద్యోగులు ఇక్కడి నుంచే పాసింజర్లలో రాకపోకలు సాగించేవారు. దీంతో ఉదయం.. సాయంత్రం రద్దీ ఉండేది. కొవిడ్ తర్వాత నిర్వహణ పూర్తిగా విస్మరించారు. నగరం నుంచి ఇటు విశాఖపట్నం వైపు అటు విజయవాడ వైపు ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యమైన కొన్ని రైళ్ల హాల్టు లేకపోవడం.. ఇక్కడాగేవి సమయానుకూలంగా లేకపోవడం వల్ల వ్యయప్రయాసల కోర్చి నగర శివారున ఉన్న ప్రధాన స్టేషన్కు వెళ్లాల్సి వస్తోంది.
విజయవాడ వైపునకు మూడే..
గతంలో ఎక్స్ప్రెస్, పాసింజర్లు కలిపి మొత్తం 15 రైళ్లు హాల్టు ఉండగా ఇప్పుడు 12 మాత్రమే ఆగుతున్నాయి. ఎక్స్ప్రెస్ ఛార్జీలతో నడుస్తున్న ఇవి కూడా అనుకూల సమయాల్లో అందుబాటులో లేవు. కాకినాడ, రాజమహేంద్రవరం వైపు నుంచి ఈ స్టేషన్ మీదుగా విజయవాడ వైపు నడిచేవి రోజూ మూడు మాత్రమే ఇక్కడ ఆగుతున్నాయి. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ జంక్షన్ వెళ్లే విజయవాడ మెము ప్రత్యేక రైలు అర్ధ¢రాత్రి దాటిన తర్వాత 3.19 గంటలకు వస్తుంది. కాకినాడ పోర్టు నుంచి విజయవాడ వెళ్లే ఫాస్ట్ మెము ఎక్స్ప్రెస్ తెల్లవారుజాము 5.34 గంటలకు, రాజమహేంద్రవరం నుంచి విజయవాడ జంక్షన్కు వెళ్లే విజయవాడ మెము ఎక్స్ప్రెస్ రాత్రి 6.52 గంటలకు వస్తుంది. ఈ మధ్యలో విజయవాడ వైపు వెళ్లేవి అందుబాటులో లేవు. విజయవాడ వైపు నుంచి వచ్చి విశాఖపట్నం, కాకినాడ వైపు వెళ్లేవి తొమ్మిది రైళ్లు ఆగుతున్నప్పటికీ రాత్రి 9.29 నుంచి 11.29 గంటల మధ్య, 10.28 గంటల మధ్య అయిదు రైళ్లు, రాత్రి 9.09 నుంచి 10.28 మధ్య మూడు, అర్ధరాత్రి 1.45 గంటలకు ఒకరైలు మాత్రమే అగుతుంది.
సమస్యలెన్నో...
- భిక్షగాళ్లు ప్లాట్ఫామ్లపై, కాలిబాట వంతెనపై తిష్ఠవేస్తూ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారు. ః రాత్రివేళలో అసాంఘిక శక్తులు, బ్లేడ్బ్యాచ్లు, రౌడీమూకలు చొరపడుతున్నారు.
- ప్లాట్ఫామ్లపై నిఘా కెమెరాలకు గతంలో ప్రతిపాదనలు పెట్టినా ఇప్పటివరకు సమకూరలేదు. ఒకటో నంబరు ఫ్లాట్ఫామ్పై మాత్రం ఫ్యాన్లు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో లేవు.
- వృద్ధుల రాకపోకలకు అనుకూలంగా ఉండే భూగర్భ కాలిబాట వంతెన పూర్తిగా మూసివేశారు. కాలిబాట వంతెన ఉన్నప్పటికీ రాత్రివేళలో మందు బాబులు తిష్ఠ వేస్తుండటంతో అదికూడా అపరిశుభ్రంగా దర్శనమిస్తుంది. ః ప్లాట్ఫామ్ల నిర్వహణకు నెలకు కేవలం రూ.8,500 మాత్రమే కేటాయిస్తుండటంతో ఒక సిబ్బందితోనే ప్లాట్ఫామ్లు శుభ్రం చేయించాల్సిన పరిస్థితి. మరుగుదొడ్ల నిర్వహణ లేక దుర్గంధం వెదజల్లుతోంది. ః తాగునీటి సదు పాయం అంతంతమాత్రంగానే ఉంది. కొన్ని ట్యాప్లు పనిచేయడం లేదు. బయట నుంచి వచ్చే కొన్నింటికి డమ్మీలు వేసేశారు.
నిర్లక్ష్యంగా వదిలేశారు
ఈ స్టేషన్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఎటువంటి అభివృద్ధికి నోచుకోక ఇబ్బంది పడాల్సి వస్తోంది. గతంలో ఇక్కడ చాలారైళ్లు ఆగేవి. ఇటు విజయవాడ, అటు విశాఖపట్నం, కాకినాడ వైపు వెళ్లే పాసింజర్లు చిరువ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులకు ఉపయోగపడేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. పాసింజర్ల్లను ఎక్స్ప్రెస్లుగా చేసి హాల్టు తగ్గించేశారు. దీంతో ప్రధాన స్టేషన్కు వెళ్లాల్సి వస్తోంది. - రాము, ప్రయాణికుడు
హాల్టులు పెంచకపోవడంతో ఇబ్బంది
కొవిడ్కు ముందు వరకు రైళ్లు ఎక్కువగా ఆగేవి. ప్రస్తుతం హాల్టు తగ్గించేయడంతో ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. నగర శివారులో ఉన్న ప్రధాన స్టేషన్కు వెళ్లాల్సి వస్తోంది. విజయవాడ వైపు వెళ్లే రైళ్లు గోదావరి రైల్వేస్టేషన్లో మూడు మాత్రమే ఇక్కడ ఆగుతున్నాయి. అవికూడా అనువైన సమయాల్లో లేవు. ఇక్కడ సౌకర్యాలు మెరుగుపరిచి హాల్టు పెంచితే బాగుంటుంది.
- మోసే, ప్రయాణికుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధాన్యపు రాశులకు నిప్పు పెట్టిన దుండగులు
[ 06-05-2024]
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవలలో అర్ధరాత్రి ఏడు ఎకరాల్లో ఆరబెట్టిన ధాన్యపు రాశులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. -
రానున్న ఎన్నికల్లో కూటమిదే విజయం
[ 06-05-2024]
రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి కూటమిగా ఏర్పాడ్డాయని, -
భవిష్యత్తు మనదే
[ 06-05-2024]
‘ఎన్నికలకు సరిగ్గా వారం ఉంది. మా ప్రసంగాలు వినండి. కూటమి మ్యానిఫెస్టో చదవండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి’ అని పవన్కల్యాణ్ కోరారు. కాకినాడ జిల్లా తునిలోని గొల్ల అప్పారావు కూడలిలో వారాహి విజయభేరి బహిరంగ సభలో ఆదివారం సాయంత్రం ఆయన ప్రసంగించారు. -
అధర్మకర్తల మండలి
[ 06-05-2024]
జగనన్న పాలనలో పాలకవర్గాల(ధర్మకర్తల మండలి) సభ్యులు దేవస్థానం శ్రేయస్సు, భక్తుల సౌకర్యాలు కల్పించేలా పనిచేసింది అంతంతమాత్రమే. ఆలయ పాలకవర్గాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. -
ప్రజాగళం.. సర్వం సన్నద్ధం
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం తుది దశకు చేరుతోంది. సోమవారం అగ్రనేతల సభతో రాజమహేంద్రవరం కళకళలాడనుంది. కడియం మండలం వేమగిరిలో జరిగే ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ, -
ఇక్కడైనా గందరగోళం లేకుండా చూస్తారా?
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది, అత్యవసర సేవలు అందించే ఉద్యోగులకు సోమవారం నుంచి మూడు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ నిర్వహించనున్నారు. -
నూతన భూహక్కు చట్టంపై జగన్ సర్కారునే ప్రశ్నించాలి
[ 06-05-2024]
ఏపీ నూతన భూహక్కు చట్టం అమలుపై జగన్మోహన్రెడ్డి సర్కారును ప్రశ్నించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి ఫురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ నీతిఆయోగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కేవలం సూచించిందన్నారు. -
పవన్ కల్యాణ్ను అసెంబ్లీకి పంపిద్దాం
[ 06-05-2024]
జనసేన అధినేత పవన్కల్యాణ్పై తన తండ్రి ముద్రగడ పద్మనాభం విమర్శలు చేయడాన్ని ఖండించిన ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి తాజాగా మరో వీడియో సందేశం విడుదల చేశారు. -
పోస్టల్ బ్యాలెట్లపై కాకినాడలో గందరగోళం
[ 06-05-2024]
కాకినాడలోని పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ వినియోగ కేంద్రం వద్ద ఆదివారం గందరగోళం నెలకొంది. పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసినా జాబితాలో పేర్లు లేకపోవడంతో ఎన్నికల విధుల్లో ఉన్న చాలామంది ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
ఓటేశాక.. వృద్ధులను వదిలేశారు..
[ 06-05-2024]
ఎన్నికల ముందు ప్రతిపక్షనేత హోదాలో పాదయాత్ర చేసిన జగన్ ఎన్నో హామీలు గుప్పించారు. అన్ని వర్గాలను మాటలతో మెప్పించి.. అనంతరం నిండా ముంచారు. -
మొదటి రోజు ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికలు-2024 ప్రక్రియలో భాగంగా ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులకు నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ మొదటి రోజు ఆదివారం చిన్నపాటి సంఘటన మినహా ప్రశాంతంగా జరిగింది. -
అగ్నిసాక్షిగా.. పరిహారానికి ఎగనామం..!
[ 06-05-2024]
అనుకోకుండా అగ్ని ప్రమాదాలతో రోడ్డునపడుతున్న కుటుంబాలకు వైకాపా ప్రభుత్వం మొండిచేయే చూపుతోంది. బహిరంగ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు పేదలపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారు. -
జీవితాలు మార్చేవారికీ జీతాల్లేవ్..!
[ 06-05-2024]
వైకాపా పాలనలో ప్రభుత్వ ఉద్యోగులేకాదు.. ఒప్పంద, పొరుగు సేవల్లో విధులు నిర్వహిస్తున్న చిరుద్యోగులు కూడా వేతనాలు సకాలంలో అందక, కుటుంబ పోషణ జరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
జగన్ జమానాలో.. అంపశయ్యపై ఆరోగ్యశ్రీ
[ 06-05-2024]
క్షేత్రస్థాయిలో ఆరోగ్యశ్రీ పథకం పరిస్థితి దయనీయంగా ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం లేదు. రూ.కోట్లల్లో బకాయిలు నెలల తరబడి ఇవ్వకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. -
విపత్కర పాలనను సాగనంపడానికే కూటమి: పురందేశ్వరి
[ 06-05-2024]
రాష్ట్రంలోని విపత్కర పాలనను విచ్ఛిన్నం చేయడానికి కూటమి ఆవిర్భవించిందని కూటమి రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
జగన్ తెచ్చిన నల్లచట్టంపై తిరుగుబాటు చేయాలి: ముప్పాళ్ల
[ 06-05-2024]
రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలు తిరుగుబాటు చేయాలని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు, ఐఏఎల్ రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు పిలుపునిచ్చారు. -
మీడియా ప్రతినిధులకూ పోస్టల్ బ్యాలట్ అవకాశం
[ 06-05-2024]
జిల్లాలో పనిచేస్తున్న మీడియా ప్రతినిధులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలట్ ద్వారా వినియోగించుకునే వెసులుబాటును రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీలత ఆదివారం
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు