నిఘా ఏదీ?
పల్నాడులో వరుస ఘటనలు వైకాపా-తెదేపా వర్గీయుల మధ్య నిప్పురాజేస్తున్నాయి. ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటూ, పోటాపోటీ ధర్నాలకు దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతిభద్రతల సమస్యకు దారి తీశాయి. పోలీసులకు తెలియకుండానే ఆ
దత్తత గ్రామాల్లో ప్రజలతో మమేకమైతే ఒట్టు
పల్నాడులో వరుస ఘటనలతో బెంబేలు
గ్రామాల్లో చీమ చిటుక్కుమన్నా తెలిసేలా నెట్వర్క్ ఉంది.. ఒక్కో గ్రామాన్ని ఒక్కో కానిస్టేబుల్కు దత్తత ఇచ్చి శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నాం.. పోలీసు ఉన్నతాధికారులు చెప్పేవి ఉత్తి మాటలేనని తేలిపోయింది. తాజాగా జిల్లాలో చోటుచేసుకున్న వరుస ఉదంతాలే అందుకు నిదర్శనం. ఈనెల 13న వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తెదేపా గ్రామ నాయకుడు తోట చంద్రయ్య హత్య, నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించి పట్టుకుపోవడం వంటివి పోలీసుల నిఘా వైఫల్యాన్ని చాటుతున్నాయి.
ఈనాడు, గుంటూరు పల్నాడులో వరుస ఘటనలు వైకాపా-తెదేపా వర్గీయుల మధ్య నిప్పురాజేస్తున్నాయి. ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటూ, పోటాపోటీ ధర్నాలకు దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతిభద్రతల సమస్యకు దారి తీశాయి. పోలీసులకు తెలియకుండానే ఆ ఘటనలు చోటుచేసుకున్నాయంటే వారి నిఘా ఎలా ఉందో ఊహించుకోవచ్చు. జనం అంతా చూస్తుండగానే నడిరోడ్డుపై చంద్రయ్యను తల, కాళ్లు పట్టుకుని అత్యంత దారుణంగా హతమార్చారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అది రాజకీయ హత్యకాదని పోలీసు, అధికార వైకాపా నేతలు బుకాయిస్తున్నారు. వారు చెబుతున్నట్లే రాజకీయ హత్య కాకపోయినా రెండువర్గాల మధ్య పాతకక్షల నేపథ్యంలో చోటుచేసుకున్న ప్రతీకార హత్యే అయినా అది జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులిది కాక మరెవరిదో గుర్తెరగాలి. గుంటూరు రూరల్, అర్బన్ జిల్లా పోలీసుల పరిధిలో ఎక్కడా కూడా దత్తత గ్రామాలు, వార్డులు, డివిజన్ల కాన్సెప్టు విధానం పకడ్బందీగా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి.
పట్టు కోల్పోతున్నా పోలీసులు
పోలీసులకు స్టేషన్ పరిధిలోని గ్రామాలు, పట్టణాలపై ఏ మాత్రం పట్టు ఉన్నా హత్యలు, కొట్లాటలకు ఉదంతాలకు తావుండదని అది లోపించడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని విశ్రాంత పోలీసులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని బాకాలు ఊదుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. జరగాల్సిన నష్టం జరిగాక ఎన్ని దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినా ఆ నష్టాన్ని పూడ్చలేమని అంటున్నారు. అసలు స్టేషన్ పరిధిలో ఏం జరుగుతోంది? ఏ గ్రామంలో ఎలాంటి వాతావరణం ఉందో కనీసం పోలీసులకు సమాచారం లేదంటే అతిశయోక్తి కాదేమో! చంద్రయ్య హత్యగావింపబడిన గుండ్లపాడు, విగ్రహాలు మాయమైన జొన్నలగడ్డ గ్రామాలు రెండూ కూడా స్టేషన్కు ఐదారు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. స్టేషన్కు అత్యంత సమీపంగా ఉన్న గ్రామాల్లోనే ఇంత దారుణాలకు తెగబడుతున్నారంటే వాటి సూత్ర, పాత్రధారులకు ఏ మాత్రం పోలీసులు అంటే భయం లేదనేది స్పష్టమవుతుంది.
సమస్యలు వినేవారేరీ?
విధి నిర్వహణలో భాగంగా పోలీసులు దత్తత గ్రామాలను తరచూ సందర్శిస్తూ అక్కడ ప్రజలతో మమేకమవుతూ ఉంటే ఆ గ్రామంలో జరిగిన, జరగబోయే అనేక విషయాలు అక్కడి ప్రజలే చెబుతారని కానీ ఈ రకమైన పరిశీలన పోలీసులకు లోపించడంతో గ్రామాల్లో ఏం జరిగినా, జరగబోతున్నా ఎవరికీ చెప్పాలో తెలియక మిన్నకుండిపోతున్నారనే అభిప్రాయం లేకపోలేదు. గ్రామాల్లో పోలీసులు నిరంతరం పర్యటిస్తుంటే వారికి ఏదైనా చెప్పాలనిపిస్తుందని, అడపాదడపా వచ్చిపోతుంటే వారి గురించి తమకు తెలియక తాము వారితో ఏం చెప్పుకో లేకుండా ఉన్నామని ఇటీవల గుండ్లపాడులో చోటుచేసుకున్న హత్యోదంతంపై ఆ గ్రామానికి చెందిన ఒకరు వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళే కాదు.. ఎప్పుడైనా మా గ్రామంలో వైరివర్గాల హడావుడి ఉంటుందని అయినా పోలీసుల పర్యటనలు అంతంత మాత్రమేనని ఆయన వివరించారు. పోలీసులకు గ్రామ రాజకీయాలు, పాతకక్షలు, గ్రూపులపై పట్టు ఉంటే చంద్రయ్య హత్య ముందస్తుగా నివారించదగ్గదేనన్న అభిప్రాయం ఆయా వర్గాల నుంచి వ్యక్తమైంది.
హత్య సంఘటన జరిగిన అనంతరం గుండ్లపాడులో పర్యటిస్తున్న పోలీసు అధికారులు (పాత చిత్రం)
విగ్రహం దొరకలేదాయే
నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో ఈనెల 13న వైఎస్సార్ విగ్రహం మాయమైంది. ఇది రాజకీయంగా బాగా వివాదస్పదమైంది. వైకాపా, తెదేపా పోటాపోటీ ధర్నాలతో మూడు రోజులు జొన్నలగడ్డ, నరసరావుపేట పట్టణంలో రణరంగాన్ని తలపించాయి. అసలు ఆ గ్రామంలో విగ్రహాలు మాయమయ్యే పరిస్థితి ఉన్నా.. ఒక పథకం ప్రకారం దాన్ని పట్టుకుపోయినా అందుకు కారకులెవరో పోలీసులకు గ్రామ రాజకీయాలపై ఒక అవగాహన ఉంటే కొంతవరకు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చి ఉండేవారు. ఆ కోణంలో విచారణ జరిపి ఉంటే కేసును చేధించేవారు. ఘటన జరిగిన నాలుగు రోజులైనా ఇప్పటికీ విగ్రహం లభ్యం కాలేదంటే పోలీసుల పనితీరు, వారి నిఘా ఎంత తీసికట్టుగా ఉందో ఇట్టే అర్థమవుతోంది.
పర్యవేక్షణ మాటేమిటీ..
స్టేషన్ పరిధిలో ఏం జరుగుతున్నా స్టేషన్ పోలీసులే కాదు.. స్పెషల్ బ్రాంచి, ఇంటెలిజెన్సీ పోలీసులకు తెలియాలని అనేక దశల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పరచుకొని శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. కానీ ఇవేం వారి దృష్టికి రాలేదంటే అది నిఘా వైఫల్యమా? ఇంకేమైనా కారణాలా అనేది ఉన్నతాధికారులే గుర్తెరిగి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది. సచివాలయాల వ్యవస్థ వచ్చాక గ్రామానికో మహిళా పోలీసు ఉన్నారు. వారికేం తెలియకుండా ఈ ఘటనలు చోటుచేసుకున్నాయంటే నమ్మశక్యం కావడం లేదు. ఇప్పటికైనా దత్తత గ్రామాల్లో విస్తృతంగా పర్యటించడం, స్టేషన్ పరిధిలో చోటుచేసుకునే సంఘటనలపై ఎప్పటికప్పుడు సమాచారం వచ్చేలా నిఘాను బలోపేతం చేసుకుంటూ విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ ఉదంతాలు చాటుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం జగన్ను ఓడించాలి
[ 08-05-2024]
సీఎం జగన్ను ఓడించి తెదేపా అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకుందాం అని మాజీ అమ్మెల్యే నంబూరు సుభాని కోరారు. -
పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి
[ 08-05-2024]
హోం ఓటింగ్ విషయంలో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. -
సూపర్6 తో సమగ్ర ప్రగతి
[ 08-05-2024]
‘రైతులకు ఆదాయం, గౌరవం పెంచేలా సాగును లాభసాటిగా తీర్చిదిద్దుతాం. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులతో వారి జీవన ప్రమాణాలు పెంచుతాం. రాజధాని అమరావతి నిర్మాణంతో ఈ ప్రాంత ప్రగతికి అవకాశాలు విస్తృతమవుతాయి. -
నైపుణ్యం చిదిమేశావు.. నైరాశ్యం నింపేశావు!
[ 08-05-2024]
ప్రపంచం మెచ్చే ప్రతిభా, పాటవాలు కలిగిన యువతను వైకాపా ఆధ్వర్యంలోని జగన్ ప్రభుత్వం గుర్తించలేదు. వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలు తెలుసుకోలేదు. వారికి సరైన ఉద్యోగావకాశాలు కల్పించకుండా ఐదేళ్ల పాలనలో యువశక్తిని నిర్వీర్యం చేసిందనే అపవాదును జగన్ సర్కారు మూటగట్టుకుంది. -
జనం భూములపై జగన్ కుతంత్రం
[ 08-05-2024]
ఏపీ భూ హక్కు చట్టంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సామాన్యుల ఆస్తులు దర్జాగా లాక్కునేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారని, అందుకు మార్గంగా భూ హక్కు చట్టాన్ని ఎంచుకున్నారని గగ్గోలు పెడుతున్నారు. అధికారికంగానే ప్రజల భూములను ఆక్రమించేందుకు జగన్ ఈ చట్టాన్ని తీసుకొచ్చారంటున్నారు. -
మా పోస్టల్ బ్యాలట్ ఎక్కడ..?
[ 08-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్్ బ్యాలట్ నిర్వహణ తీరు గందరగోళంగా మారింది. పీవో, ఏపీవోలు బ్యాలట్ వినియోగంలోనూ స్పష్టత లేదు. -
ఖద్దరు అరాచకం.. ఖాకీల సలాం..
[ 08-05-2024]
చట్టం చేసే వారు.. దాన్ని అమలు చేయాల్సిన వారు ఒక్కటై.. వికృత క్రీడ ఆడితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో గత అయిదేళ్లలో రాష్ట్రంలో పరిస్థితులు అద్దం పట్టాయి. అధికార పక్షానికి కొమ్ముకాస్తూ ప్రతిపక్షాలను అణిచివేయడమే ధ్యేయంగా కొందరు పోలీసులు పనిచేసి అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు. -
ఇసుకాసురులు
[ 08-05-2024]
వైకాపా నేతలు బరితెగించి కృష్ణా తీరంలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జీసీకేసీ కంపెనీకి కొన్ని రీచ్లలో ఇసుక తవ్వకాలకు అనుమతులను సాకుగా చూసి అడ్డగోలుగా తవ్వి తరలిస్తున్నారు. -
కొలువుల కల్పన.. వట్టి మాటలేనా.. గట్టిమేలు ఏదీ జగన్?
[ 08-05-2024]
జగన్ ఐదేళ్ల పాలన తలుచుకుని జిల్లాలోని యువత కోపంతో రగిలిపోతోంది. ఐదేళ్లలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ఉద్యోగాలు, స్వయం ఉపాధిపై కోటి ఆశలతో చదువులు పూర్తిచేసి విద్యాలయాల నుంచి బయటకు రావటమే తప్ప కొలువులు దక్కించుకున్నవారు బహు అరుదనే చెప్పాలి. -
తెదేపా నేత కారుకు నిప్పు
[ 08-05-2024]
ఈపూరు మండలం ముప్పాళ్ల మాజీ సర్పంచి, తెదేపా నేత మోదుగుల నరసింహారావు కారును గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం వేకువన తగులబెట్టారు. గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం నరసరావుపేట వెళ్లి వచ్చి ఖాళీ ప్రదేశంలో కారు నిలిపి ఇంట్లో నిద్రపోయారు. -
ఎన్నికల సామగ్రికి పంచాయతీ నిధులు
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించడం ఎప్పటి నుంచో వస్తుంది. ఈసారి జగన్ సర్కారు గతంలో ఎన్నడూలేని విధంగా స్థానిక సంస్థలపై ఎన్నికల నిర్వహణ భారం వేస్తోంది. -
సజావుగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
[ 08-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ మూడో రోజు సజావుగా సాగింది. ఏడు నియోజకవర్గాల పరిధిలో మంగళవారం పోలింగ్ కేంద్రాల్లో 2516 ఓట్లు పోలయ్యాయి. -
మంగళగిరి అభివృద్ధికి లోకేశ్కు ఓటేయండి
[ 08-05-2024]
పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గ సాధన కోసం నారా లోకేశ్కు ఓటు వేయాలని ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి గాలి గోపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. -
‘దళితులంతా లోకేశ్ విజయానికి కృషి చేయాలి’
[ 08-05-2024]
మంగళగిరి తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ విజయానికి దళితులంతా కలసి పనిచేయాలని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు పిలుపునిచ్చారు. -
పరిశీలకులకు ఎన్నికల వ్యయం అభ్యర్థనలు, ఫిర్యాదులు
[ 08-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు వ్యయ పరిశీలకులను జిల్లాకు కేటాయించిందని కలెక్టరు ఎం.వేణుగోపాల్రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
‘మేం ఓట్లు అమ్ముకోం.. మా ఇంటికి రావొద్దు’
[ 08-05-2024]
మరో వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో నిగమ్నమయ్యాయి. -
‘రాక్షస పాలనకు ఓటుతో అంతం పలుకుదాం’
[ 08-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్లుగా సాగుతున్న రాక్షస పాలనకు ప్రజలు ఓటుతో అంతం పలకాలని సినీ నటుడు నారా రోహిత్ పిలుపునిచ్చారు. చెరుకుపల్లి మండలం బలుసులపాలెం, ఆరుంబాక గ్రామాల్లో తెదేపా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మంగళవారం మాట్లాడారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు
[ 08-05-2024]
ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఎన్నికల్లో ఓటేయాలని కలెక్టర్ రంజిత్బాషా సూచించారు. రేపల్లె మండలం పేటేరు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను మంగళవారం సందర్శించారు. -
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం
[ 08-05-2024]
ఈనెల 13న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని స్వీప్(పీడబ్యూడీ) జిల్లా నోడల్ అధికారి గుణశీల అన్నారు. -
దివ్యాంగులు.. వృద్ధులకు వాహన సౌకర్యం
[ 08-05-2024]
దివ్యాంగులు, వృద్ధ ఓటర్ల కోసం ఈసీ ప్రత్యేకంగా సక్షం యాప్ను ప్రవేశపెట్టిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రంజిత్బాషా తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ దివ్యాంగులు, వృద్ధులు ఓట్లు వేయటానికి తమ ఫోన్లలో సక్షం యాప్ను డౌన్లోడ్ చేసుకుని పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM