సిలిండరు రవాణా ఛార్జీల పేరుతో దోపిడీ
వేటపాలెం బాపయ్య నగర్లో గ్యాస్ గోదాం కార్యాలయం ఉంది. ఇక్కడ నుంచి నాయునిపల్లికి కేవలం కిలోమీటరు దూరం ఉంటుంది.
* వేటపాలెం బాపయ్య నగర్లో గ్యాస్ గోదాం కార్యాలయం ఉంది. ఇక్కడ నుంచి నాయునిపల్లికి కేవలం కిలోమీటరు దూరం ఉంటుంది. ఇక్కడ నివసించే సుబ్బారావు గ్యాస్ బండ కోసం తన చరవాణి ద్వారా నమోదు చేసుకున్నారు. నాలుగు రోజుల తరువాత సిలిండరు ఇంటికి వచ్చింది. బిల్లుపై ఉన్న మొత్తాన్ని అతడు బాయ్కి ఇవ్వగా మరో రూ.30 ఇవ్వాలని అడిగాడు. కంపెనీ దగ్గరగానే ఉంది కదా... రూ.10 తీసుకోమన్నాడు. దీంతో బాయ్ గ్యాస్ కార్యాలయానికి వచ్చి తీసుకోవాలని చెప్పడంతో చేసేది లేక అతడికి డబ్బులు ఇచ్చేశాడు.
* వైకుంఠపురానికి చెందిన శ్రీనివాసరావు తన పేరుపై గ్యాస్ బుక్ చేసుకున్నాడు. అతను చిరు ఉద్యోగి కావడంతో బైటకు వెళుతూ భార్యకు సిలిండరు ఈ రోజు వస్తోంది... బిల్లుకి సరిపడా డబ్బులు టీవి స్టాండ్పై పెట్టానని చెప్పి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాయ్ సిలిండరు తీసుకురాగా, ఆమె గ్యాస్ డబ్బులు ఇచ్చింది. అదేమిటమ్మా... బిల్లుమీద ఉన్న డబ్బు ఇస్తే తెచ్చినందుకు కూలీ ఇవ్వరా అని అడిగాడు. మావారు అంతే ఇచ్చారని చెప్పడంతో.. లేదమ్మా... మాకు కంపెనీలో జీతం ఇవ్వరు.. మీరు ఇచ్చినదే మాకు వస్తోందని చెప్పడంతో చేసేది లేక ఆమె అదనంగా మరో రూ.30 ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
చీరాల అర్బన్, న్యూస్టుడే
‘గ్యాస్ సిలిండరు ఇంటికి సరఫరా పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారు... ఈ అనధికారిక వసూళ్ల పర్వం నిరంతరం కొనసాగుతోంది... అదనపు డబ్బులు ఇవ్వడానికి ఎవరైనా నిరాకరిస్తే ఏకంగా బండను తిరిగి వెనక్కి తీసుకెళుతున్నారు... తప్పని పరిస్థితుల్లో రవాణా ఛార్జీల పేరుతో డబ్బులు చెల్లించాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... అధికారులు మాత్రం బిల్లుపై ఉన్నదానికన్నా ఒక్క రూపాయి చెల్లించొద్దని చెబుతున్నా అది ఆచరణలో సాధ్యం కావడంలేదు.
జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీల సిబ్బంది ఇంటింటికీ సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. దీనికోసం ఒక్కొక్కదానికి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. అదే గ్రామీణ ప్రాంతమైతే రెట్టింపు చెల్లించాల్సిందే. అదేమని వారిని అడిగితే మాకు జీతాలు ఇవ్వరు సారూ.. మీరిచ్చేదే మిగులుతోందని సిబ్బంది చెబుతున్నారు. రసీదుపై ఒక్కపైసా ఎక్కువ ఇచ్చేది లేదని ఎవరైనా ఖరాఖండిగా చెబితే వెంటనే సిలిండరు ఇవ్వకుండా కొంతమంది డెలివరీ బాయ్లు వెనక్కి తీసుకెళుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. బాపట్ల జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఐవోసీ, హెచ్పీ, బీపీసీ కంపెనీలకు చెందిన 31 ఏజెన్సీలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 4.63 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో కనీసం నెలకు 80శాతం వరకు పంపిణీ అవుతున్నాయి. అంటే సరాసరి నెలకు 3.70 లక్షల వరకు సిలిండర్లు వినియోగదారులకు అందజేస్తున్నారు. వీటి నుంచి ఒక్కొక్కదానికి రూ.30 వంతున రవాణా ఛార్జీల పేరుతో నెలకు రూ.కోటిపైనే దండుకుంటున్నారు. అదే ఏడాదికి రూ.12 కోట్లుపైనే ఉంటోంది.
మన ఫోన్లోనే ఫిర్యాదు చేయవచ్చు
ఎల్పీజీ సిలిండరు రసీదుపై ఉన్న దానికన్నా అదనంగా ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని ఓవైపు అధికారులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వసూలు చేస్తే మన ఫోన్లోనే 1967 కాల్ సెంటర్కి ఫిర్యాదు చేయవచ్చు. ఏజెన్సీ ఉన్న ప్రాంతం నుంచి 5 కిలోమీటర్లలోపు అయితే వినియోగదారుడు సిలిండరు ఇంటికి తెచ్చినందుకు అదనంగా చెల్లించాల్సిన అవసరంలేదని జిల్లా పౌరసరఫరాల అధికారి వి.బి.విలియమ్స్ తెలిపారు. దీనిపై ఎవరైనా నేరుగా తనకు గాని, మా కార్యాలయంలోనైనా ఫిర్యాదు చేస్తే తప్పక సంబంధిత ఏజెన్సీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 5 కిలోమీటర్ల నుంచి 15 లోపు రూ.20, ఆపైన దూరం ఉంటే రూ.30 వరకు ఒక్కొక్క సిలిండరుకు అదనంగా ఇవ్వాల్సి ఉందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి
[ 08-05-2024]
హోం ఓటింగ్ విషయంలో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. -
సూపర్6 తో సమగ్ర ప్రగతి
[ 08-05-2024]
‘రైతులకు ఆదాయం, గౌరవం పెంచేలా సాగును లాభసాటిగా తీర్చిదిద్దుతాం. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులతో వారి జీవన ప్రమాణాలు పెంచుతాం. రాజధాని అమరావతి నిర్మాణంతో ఈ ప్రాంత ప్రగతికి అవకాశాలు విస్తృతమవుతాయి. -
నైపుణ్యం చిదిమేశావు.. నైరాశ్యం నింపేశావు!
[ 08-05-2024]
ప్రపంచం మెచ్చే ప్రతిభా, పాటవాలు కలిగిన యువతను వైకాపా ఆధ్వర్యంలోని జగన్ ప్రభుత్వం గుర్తించలేదు. వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలు తెలుసుకోలేదు. వారికి సరైన ఉద్యోగావకాశాలు కల్పించకుండా ఐదేళ్ల పాలనలో యువశక్తిని నిర్వీర్యం చేసిందనే అపవాదును జగన్ సర్కారు మూటగట్టుకుంది. -
జనం భూములపై జగన్ కుతంత్రం
[ 08-05-2024]
ఏపీ భూ హక్కు చట్టంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సామాన్యుల ఆస్తులు దర్జాగా లాక్కునేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారని, అందుకు మార్గంగా భూ హక్కు చట్టాన్ని ఎంచుకున్నారని గగ్గోలు పెడుతున్నారు. అధికారికంగానే ప్రజల భూములను ఆక్రమించేందుకు జగన్ ఈ చట్టాన్ని తీసుకొచ్చారంటున్నారు. -
మా పోస్టల్ బ్యాలట్ ఎక్కడ..?
[ 08-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్్ బ్యాలట్ నిర్వహణ తీరు గందరగోళంగా మారింది. పీవో, ఏపీవోలు బ్యాలట్ వినియోగంలోనూ స్పష్టత లేదు. -
ఖద్దరు అరాచకం.. ఖాకీల సలాం..
[ 08-05-2024]
చట్టం చేసే వారు.. దాన్ని అమలు చేయాల్సిన వారు ఒక్కటై.. వికృత క్రీడ ఆడితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో గత అయిదేళ్లలో రాష్ట్రంలో పరిస్థితులు అద్దం పట్టాయి. అధికార పక్షానికి కొమ్ముకాస్తూ ప్రతిపక్షాలను అణిచివేయడమే ధ్యేయంగా కొందరు పోలీసులు పనిచేసి అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు. -
ఇసుకాసురులు
[ 08-05-2024]
వైకాపా నేతలు బరితెగించి కృష్ణా తీరంలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జీసీకేసీ కంపెనీకి కొన్ని రీచ్లలో ఇసుక తవ్వకాలకు అనుమతులను సాకుగా చూసి అడ్డగోలుగా తవ్వి తరలిస్తున్నారు. -
కొలువుల కల్పన.. వట్టి మాటలేనా.. గట్టిమేలు ఏదీ జగన్?
[ 08-05-2024]
జగన్ ఐదేళ్ల పాలన తలుచుకుని జిల్లాలోని యువత కోపంతో రగిలిపోతోంది. ఐదేళ్లలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ఉద్యోగాలు, స్వయం ఉపాధిపై కోటి ఆశలతో చదువులు పూర్తిచేసి విద్యాలయాల నుంచి బయటకు రావటమే తప్ప కొలువులు దక్కించుకున్నవారు బహు అరుదనే చెప్పాలి. -
తెదేపా నేత కారుకు నిప్పు
[ 08-05-2024]
ఈపూరు మండలం ముప్పాళ్ల మాజీ సర్పంచి, తెదేపా నేత మోదుగుల నరసింహారావు కారును గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం వేకువన తగులబెట్టారు. గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం నరసరావుపేట వెళ్లి వచ్చి ఖాళీ ప్రదేశంలో కారు నిలిపి ఇంట్లో నిద్రపోయారు. -
ఎన్నికల సామగ్రికి పంచాయతీ నిధులు
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించడం ఎప్పటి నుంచో వస్తుంది. ఈసారి జగన్ సర్కారు గతంలో ఎన్నడూలేని విధంగా స్థానిక సంస్థలపై ఎన్నికల నిర్వహణ భారం వేస్తోంది. -
సజావుగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
[ 08-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ మూడో రోజు సజావుగా సాగింది. ఏడు నియోజకవర్గాల పరిధిలో మంగళవారం పోలింగ్ కేంద్రాల్లో 2516 ఓట్లు పోలయ్యాయి. -
మంగళగిరి అభివృద్ధికి లోకేశ్కు ఓటేయండి
[ 08-05-2024]
పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గ సాధన కోసం నారా లోకేశ్కు ఓటు వేయాలని ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి గాలి గోపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. -
‘దళితులంతా లోకేశ్ విజయానికి కృషి చేయాలి’
[ 08-05-2024]
మంగళగిరి తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ విజయానికి దళితులంతా కలసి పనిచేయాలని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు పిలుపునిచ్చారు. -
పరిశీలకులకు ఎన్నికల వ్యయం అభ్యర్థనలు, ఫిర్యాదులు
[ 08-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు వ్యయ పరిశీలకులను జిల్లాకు కేటాయించిందని కలెక్టరు ఎం.వేణుగోపాల్రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
‘మేం ఓట్లు అమ్ముకోం.. మా ఇంటికి రావొద్దు’
[ 08-05-2024]
మరో వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో నిగమ్నమయ్యాయి. -
‘రాక్షస పాలనకు ఓటుతో అంతం పలుకుదాం’
[ 08-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్లుగా సాగుతున్న రాక్షస పాలనకు ప్రజలు ఓటుతో అంతం పలకాలని సినీ నటుడు నారా రోహిత్ పిలుపునిచ్చారు. చెరుకుపల్లి మండలం బలుసులపాలెం, ఆరుంబాక గ్రామాల్లో తెదేపా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మంగళవారం మాట్లాడారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు
[ 08-05-2024]
ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఎన్నికల్లో ఓటేయాలని కలెక్టర్ రంజిత్బాషా సూచించారు. రేపల్లె మండలం పేటేరు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను మంగళవారం సందర్శించారు. -
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం
[ 08-05-2024]
ఈనెల 13న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని స్వీప్(పీడబ్యూడీ) జిల్లా నోడల్ అధికారి గుణశీల అన్నారు. -
దివ్యాంగులు.. వృద్ధులకు వాహన సౌకర్యం
[ 08-05-2024]
దివ్యాంగులు, వృద్ధ ఓటర్ల కోసం ఈసీ ప్రత్యేకంగా సక్షం యాప్ను ప్రవేశపెట్టిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రంజిత్బాషా తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ దివ్యాంగులు, వృద్ధులు ఓట్లు వేయటానికి తమ ఫోన్లలో సక్షం యాప్ను డౌన్లోడ్ చేసుకుని పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
-
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం