Palnadu: ప్రేమించకుంటే.. చంపేస్తా.. వైకాపా ఉపసర్పంచి కుమారుడి నిర్వాకం
సత్తెనపల్లి మండలంలో ప్రేమించాలని ఇంటర్ విద్యార్థినికి వేధింపులు తీవ్రమయ్యాయి.. ఇంట్లో వాళ్లకి చెప్పి స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. కారణం వైకాపా నేత కుమారుడి కావడమే.. ఆ బాలిక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
అధికార ఉన్మాదం
వేధింపులు తట్టుకోలేక మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సత్తెనపల్లి మండలంలో ప్రేమించాలని ఇంటర్ విద్యార్థినికి వేధింపులు తీవ్రమయ్యాయి.. ఇంట్లో వాళ్లకి చెప్పి స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. కారణం వైకాపా నేత కుమారుడి కావడమే.. ఆ బాలిక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఇప్పటికీ కూడా పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని బాలిక తల్లిదండ్రులు వాపోతున్నారు. మరోవైపు వినుకొండ మండలంలో వాలంటీరు కుటుంబ సభ్యులు ఓ వివాహితను అందరూ చూస్తుండగా పరుగెత్తించి దాడి చేశారు. కళ్ల ముందు అంత జరుగుతున్నా, ఆ వాలంటీరు చూస్తూ ఉన్నాడే తప్ప ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.
ఈనాడు డిజిటల్-నరసరావుపేట, సత్తెనపల్లి గ్రామీణ-న్యూస్టుడే: జిల్లాలో యువతులపై వైకాపా నాయకుల వేధింపుల పర్వం ఆగడం లేదు. ఇటీవల నరసరావుపేట మండలంలో వాలంటీరు వేధింపులతో ఓ బాలిక ఆత్మహత్యాయత్నం ఘటన మరువక ముందే సత్తెనపల్లి మండలంలో వైకాపాకు చెందిన ఉప సర్పంచి కుమారుడి వేధింపులతో మరో బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమించాలని వెంటపడుతుండటంతో పరీక్షల సమయంలోనే ఆత్మహత్యాయత్నం చేసింది. బాధితురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం.. సత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామ ఉప సర్పంచి, వైకాపా నాయకుడు తవిటి ఆంజనేయులు కుమారుడు, వారి సమీప బంధువు కుమార్తె సత్తెనపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఆమెను ప్రేమిస్తున్నాంటూ మూడు నెలలుగా ఉప సర్పంచి కుమారుడు వెంట పడుతున్నాడు. ప్రేమించకపోతే చంపుతానని బెదిరించసాగాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. బాలుడిని మందలించాలని వారి తల్లిదండ్రులకు బాలిక అమ్మానాన్న చెప్పినా అతడిలో మార్పులేదు. తనపై ఇంట్లో ఫిర్యాదు చేస్తావా.. అంటూ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఇద్దరిదీ ఒకే పరీక్ష కేంద్రం కావడంతో పరీక్ష రాయడానికి వెళుతున్న సమయంలో మరోసారి తీవ్రస్థాయిలో బెదిరించాడు. ఓ పక్క పరీక్షలు.. మరోవైపు వేధింపులు.. ఒత్తిడిని తట్టుకోలేక బాలిక ఈనెల 12న ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. హుటాహుటీన ఆమెను సత్తెనపల్లిలోని ప్రైవేటు వైద్యశాలకు తల్లిదండ్రులు తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఆమె ఆరోగ్య పర్యవేక్షణకు ఒక నర్సు, రక్షణగా పోలీసును పరీక్ష కేంద్రానికి పంపారు. శుక్రవారం ఆఖరి పరీక్ష రాసిన తర్వాత బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. యువకుడిపై ఫిర్యాదు చేసి మూడురోజులైనా చర్యలు లేవని మీడియా ఎదుట వాపోయారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వాపసు తీసుకోవాలని వైకాపా నాయకులు ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన చెందారు. లేనిపక్షంలో మున్ముందు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. తన రెండో కుమార్తె హైస్కూలులో చదువుతోందని, ఆమె వెంట కూడా యువకుడు పడుతున్నట్లు తల్లి ఆవేదనతో చెప్పింది. తన పెద్దకూతురు చావుబతుకుల్లో ఉందని, తమకు న్యాయం జరగాలని కోరారు. ఈ ఘటనపై గ్రామీణ సీఐ రాజేష్కుమార్ మాట్లాడుతూ ఫిర్యాదు అందిన రోజే బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశామన్నారు.
వాలంటీరు సమక్షంలో కుటుంబసభ్యుల దాడి
అవమాన భారం తట్టుకోలేక ఎలుకల మందు తాగిన వివాహిత
వినుకొండ రూరల్, న్యూస్టుడే: ఆమె మధ్యతరగతి కుటుంబానికి చెందిన గృహిణి. ప్రభుత్వ పథకాలు అందించడానికి వాలంటీరు ఆమె ఇంటికి వస్తూ పోతుంటాడు. ఇదే ఆమె పాలిటశాపమైంది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం అంటగడుతూ వాలంటీరు తల్లి, భార్య నాలుగేళ్లుగా ఆమెను వేధిస్తున్నారు. వేధింపులు తీవ్రమవడంతో అవమానం భరించలేక శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన వినుకొండ మండలం జాలలపాలెంలో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. జాలలపాలేనికి చెందిన ఓ మహిళ భర్త వినుకొండలోని కూరగాయల దుకాణంలో పని చేస్తుంటాడు. వీరికి ఓ పాప ఉంది. గ్రామంలో వాలంటీరుగా పని చేస్తున్న గుడిపాటి బాచి ప్రభుత్వ పథకాలకు సంబంధించి అప్పుడప్పుడు వారి ఇంటికి వస్తుండేవాడు. ఈ నేపథ్యంలో సదరు మహిళకు వాలంటీరుతో వివాహేతర సంబంధం అంటగడుతూ నాలుగేళ్ల నుంచి అతని భార్య నాగజ్యోతి, తల్లి పున్నమ్మలు వేధిస్తున్నారు. అసభ్యపదజాలంతో దూషిస్తూ ఇప్పటి వరకు నాలుగుసార్లు ఆమెపై దాడికి పాల్పడ్డారు. శుక్రవారం బాధితురాలి భర్త వినుకొండలోని కూరగాయల దుకాణానికి వెళ్లగా వీరిద్దరూ మరోసారి మహిళ ఇంటికి వచ్చి దూషించి దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాధితురాలు పరుగు తీసినా వెంటపడి మరీ కొట్టారు. అంత జరుగుతున్నా అక్కడే ఉన్న సదరు వాలంటీరు తన భార్య, తల్లిని ఆపే ప్రయత్నం చేయలేదు. అవమానం భరించలేక బాధితురాలు ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. సమాచారం తెలిసి ఆమె భర్త, ఇరుగుపొరుగు వచ్చి వినుకొండలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఘటనలపై వాలంటీరుతోపాటు అతని భార్య, తల్లిపై పోలీసులకు బాధితురాలి భర్త ఫిర్యాదు చేశారు. వాలంటీరు కుటుంబం నుంచి ఇబ్బందులు లేకుండా చూడాలని, తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నట్లు బాధితురాలు పేర్కొన్నారు. అధికార పార్టీకి చెందిన వారని, వాలంటీరుగా పని చేస్తుండడంతో ఇంతకాలం పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయామన్నారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ గ్రామస్థులను విచారించిన తర్వాత కేసు నమోదు చేస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం జగన్ను ఓడించాలి
[ 08-05-2024]
సీఎం జగన్ను ఓడించి తెదేపా అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకుందాం అని మాజీ అమ్మెల్యే నంబూరు సుభాని కోరారు. -
పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి
[ 08-05-2024]
హోం ఓటింగ్ విషయంలో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. -
సూపర్6 తో సమగ్ర ప్రగతి
[ 08-05-2024]
‘రైతులకు ఆదాయం, గౌరవం పెంచేలా సాగును లాభసాటిగా తీర్చిదిద్దుతాం. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులతో వారి జీవన ప్రమాణాలు పెంచుతాం. రాజధాని అమరావతి నిర్మాణంతో ఈ ప్రాంత ప్రగతికి అవకాశాలు విస్తృతమవుతాయి. -
నైపుణ్యం చిదిమేశావు.. నైరాశ్యం నింపేశావు!
[ 08-05-2024]
ప్రపంచం మెచ్చే ప్రతిభా, పాటవాలు కలిగిన యువతను వైకాపా ఆధ్వర్యంలోని జగన్ ప్రభుత్వం గుర్తించలేదు. వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలు తెలుసుకోలేదు. వారికి సరైన ఉద్యోగావకాశాలు కల్పించకుండా ఐదేళ్ల పాలనలో యువశక్తిని నిర్వీర్యం చేసిందనే అపవాదును జగన్ సర్కారు మూటగట్టుకుంది. -
జనం భూములపై జగన్ కుతంత్రం
[ 08-05-2024]
ఏపీ భూ హక్కు చట్టంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సామాన్యుల ఆస్తులు దర్జాగా లాక్కునేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారని, అందుకు మార్గంగా భూ హక్కు చట్టాన్ని ఎంచుకున్నారని గగ్గోలు పెడుతున్నారు. అధికారికంగానే ప్రజల భూములను ఆక్రమించేందుకు జగన్ ఈ చట్టాన్ని తీసుకొచ్చారంటున్నారు. -
మా పోస్టల్ బ్యాలట్ ఎక్కడ..?
[ 08-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్్ బ్యాలట్ నిర్వహణ తీరు గందరగోళంగా మారింది. పీవో, ఏపీవోలు బ్యాలట్ వినియోగంలోనూ స్పష్టత లేదు. -
ఖద్దరు అరాచకం.. ఖాకీల సలాం..
[ 08-05-2024]
చట్టం చేసే వారు.. దాన్ని అమలు చేయాల్సిన వారు ఒక్కటై.. వికృత క్రీడ ఆడితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో గత అయిదేళ్లలో రాష్ట్రంలో పరిస్థితులు అద్దం పట్టాయి. అధికార పక్షానికి కొమ్ముకాస్తూ ప్రతిపక్షాలను అణిచివేయడమే ధ్యేయంగా కొందరు పోలీసులు పనిచేసి అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు. -
ఇసుకాసురులు
[ 08-05-2024]
వైకాపా నేతలు బరితెగించి కృష్ణా తీరంలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జీసీకేసీ కంపెనీకి కొన్ని రీచ్లలో ఇసుక తవ్వకాలకు అనుమతులను సాకుగా చూసి అడ్డగోలుగా తవ్వి తరలిస్తున్నారు. -
కొలువుల కల్పన.. వట్టి మాటలేనా.. గట్టిమేలు ఏదీ జగన్?
[ 08-05-2024]
జగన్ ఐదేళ్ల పాలన తలుచుకుని జిల్లాలోని యువత కోపంతో రగిలిపోతోంది. ఐదేళ్లలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ఉద్యోగాలు, స్వయం ఉపాధిపై కోటి ఆశలతో చదువులు పూర్తిచేసి విద్యాలయాల నుంచి బయటకు రావటమే తప్ప కొలువులు దక్కించుకున్నవారు బహు అరుదనే చెప్పాలి. -
తెదేపా నేత కారుకు నిప్పు
[ 08-05-2024]
ఈపూరు మండలం ముప్పాళ్ల మాజీ సర్పంచి, తెదేపా నేత మోదుగుల నరసింహారావు కారును గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం వేకువన తగులబెట్టారు. గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం నరసరావుపేట వెళ్లి వచ్చి ఖాళీ ప్రదేశంలో కారు నిలిపి ఇంట్లో నిద్రపోయారు. -
ఎన్నికల సామగ్రికి పంచాయతీ నిధులు
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించడం ఎప్పటి నుంచో వస్తుంది. ఈసారి జగన్ సర్కారు గతంలో ఎన్నడూలేని విధంగా స్థానిక సంస్థలపై ఎన్నికల నిర్వహణ భారం వేస్తోంది. -
సజావుగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
[ 08-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ మూడో రోజు సజావుగా సాగింది. ఏడు నియోజకవర్గాల పరిధిలో మంగళవారం పోలింగ్ కేంద్రాల్లో 2516 ఓట్లు పోలయ్యాయి. -
మంగళగిరి అభివృద్ధికి లోకేశ్కు ఓటేయండి
[ 08-05-2024]
పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గ సాధన కోసం నారా లోకేశ్కు ఓటు వేయాలని ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి గాలి గోపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. -
‘దళితులంతా లోకేశ్ విజయానికి కృషి చేయాలి’
[ 08-05-2024]
మంగళగిరి తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ విజయానికి దళితులంతా కలసి పనిచేయాలని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు పిలుపునిచ్చారు. -
పరిశీలకులకు ఎన్నికల వ్యయం అభ్యర్థనలు, ఫిర్యాదులు
[ 08-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు వ్యయ పరిశీలకులను జిల్లాకు కేటాయించిందని కలెక్టరు ఎం.వేణుగోపాల్రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
‘మేం ఓట్లు అమ్ముకోం.. మా ఇంటికి రావొద్దు’
[ 08-05-2024]
మరో వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో నిగమ్నమయ్యాయి. -
‘రాక్షస పాలనకు ఓటుతో అంతం పలుకుదాం’
[ 08-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్లుగా సాగుతున్న రాక్షస పాలనకు ప్రజలు ఓటుతో అంతం పలకాలని సినీ నటుడు నారా రోహిత్ పిలుపునిచ్చారు. చెరుకుపల్లి మండలం బలుసులపాలెం, ఆరుంబాక గ్రామాల్లో తెదేపా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మంగళవారం మాట్లాడారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు
[ 08-05-2024]
ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఎన్నికల్లో ఓటేయాలని కలెక్టర్ రంజిత్బాషా సూచించారు. రేపల్లె మండలం పేటేరు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను మంగళవారం సందర్శించారు. -
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం
[ 08-05-2024]
ఈనెల 13న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని స్వీప్(పీడబ్యూడీ) జిల్లా నోడల్ అధికారి గుణశీల అన్నారు. -
దివ్యాంగులు.. వృద్ధులకు వాహన సౌకర్యం
[ 08-05-2024]
దివ్యాంగులు, వృద్ధ ఓటర్ల కోసం ఈసీ ప్రత్యేకంగా సక్షం యాప్ను ప్రవేశపెట్టిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రంజిత్బాషా తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ దివ్యాంగులు, వృద్ధులు ఓట్లు వేయటానికి తమ ఫోన్లలో సక్షం యాప్ను డౌన్లోడ్ చేసుకుని పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM