కంచు మోతలే.. సరైన వసతులేవి మామ!
‘నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఊదరగొట్టే సీఎం జగన్ వారి సంక్షేమం కోసం ఎవరూ చేయనంతగా చేస్తున్నానని గొప్పలు చెబుతుంటారు.
హాస్టళ్లలో విద్యార్థులకు తప్పని తిప్పలు
పల్నాడు జిల్లాలో ఇదీ పరిస్థితి
ఈనాడు డిజిటల్, నరసరావుపేట: ‘నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఊదరగొట్టే సీఎం జగన్ వారి సంక్షేమం కోసం ఎవరూ చేయనంతగా చేస్తున్నానని గొప్పలు చెబుతుంటారు. పేదవర్గాల వసతి గృహాలు చూస్తే ఆయన గొప్పలు మాటల్లోనే అన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. చెప్పేవన్నీ కల్లబొల్లి కబుర్లేనని తెలుస్తుంది. పల్నాడు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల వసతి గృహాల నిర్వహణ తీసికట్టుగా మారింది. ఈ ఐదేళ్లలో ఒక్కపని చేస్తే ఒట్టు. దీంతో ఈ వసతిగృహాల్లో చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. జిల్లాలో బీసీ, ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో ప్రీమెట్రిక్, పోస్టు మెట్రిక్ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలలు మొత్తం 86 ఉన్నాయి. ఇందులో అయిదు వేలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాలో 34 బీసీ వసతి గృహాల్లో 21చోట్ల వార్డెన్లు లేరు. ఇన్ఛార్జి వార్డెన్లతో నెట్టుకొస్తున్నారు. సరిపడా విద్యార్థులు లేక ఓ మూడు వసతి గృహాలు మూతపడ్డాయి. జిల్లాలో ఏకైక మైనార్టీ వసతి గృహం తెదేపా హయాంలో నరసరావుపేట సమీపంలో ములకలూరు వద్ద నిర్మించి ప్రారంభించారు. వైకాపా వచ్చాక అడ్మిషన్లు తీసుకోకపోవడంతో మూతపడింది.
తరగతి గదిలోనే నిద్ర
చిలకలూరిపేట పట్టణం: చిలకలూరిపేట పురుషోత్తపట్నం ఎస్టీ గురుకుల పాఠశాలలో అసౌకర్యాల మధ్య విద్య అభ్యసిస్తున్నారు. ఇక్కడ మొత్తం 84 మంది విద్యార్థులు ఉన్నారు. గురుకుల పాఠశాలలో 8 గదులు ఉన్నాయి. దీనిలో వంటగది, ప్రిన్సిపల్ రూమ్, స్టాఫ్రూమ్, స్టోర్ రూములకు నాలుగు గదులు ఉపయోగిస్తున్నారు. మిగిలిన నాలుగు చిన్న చిన్న గదులు మాత్రమే ఉన్నాయి. ఆ గదుల్లో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యాబోధన చేస్తున్నారు. విద్యార్థులకు సంబంధించి పుస్తకాలు, పెట్టెలు కూడా ఆ గదుల్లోనే ఉంచుతున్నారు. రాత్రికి తరగతి గదిలోనే నిద్రపోతుంటారు. గదులు ఇరుకుగా ఉండటంతో విద్యార్థులకు పూర్తి అసౌకర్యంగా మారింది. కిటికీలకు ఏర్పాటు చేసిన నెట్లు చిరిగిపోయాయి.
దోమలతో సహవాసం..
గురజాల గ్రామీణ: దాచేపల్లిలోని బీసీ గురుకుల వసతి గృహంలో 156 మంది విద్యార్థులు ఉన్నారు. 20 మందికి ఒకటి చొప్పున 8 గదులున్నాయి. దుప్పట్లు అరకొరగా ఇచ్చారు. గ్లాసులు, ప్లేట్లు ఇవ్వలేదు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. కొన్నింటికీ తలుపులు లేవు. మరుగుదొడ్లలో ట్యాప్లు లేవు. నీరు సరిగా రాక దుర్వాసన వెదజల్లుతోంది. కిటికీలకు తలుపులు లేవు. మెస్ అమర్చక పోవడంతో దోమకాటుతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
2018 నాటి మెస్ బిల్లులే
వసతిగృహాల్లో విద్యార్థుల మెస్ బిల్లులు 2018 తర్వాత పెంచనే లేదు. వసతిగృహాల్లో వసతులు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులను పంపించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపని పరిస్థితి. వసతిగృహాల్లో చేరికలకు తక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వం ఇస్తున్న మెస్ ఛార్జీలు చాలకపోవడంతో పాటు పెరిగిన ధరలకు నాణ్యమైన భోజనం పెట్టేందుకు వీలు కావడం లేదని వసతిగృహాల వార్డెన్లు చెబుతున్నారు.
పైకప్పు పెచ్చులూడి..
వినుకొండ: పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ ప్రీమెట్రిక్ వసతి గృహంలో 100 మంది విద్యార్థులున్నారు. 1982లో ప్రారంభించిన వసతి గృహం భవనం శిథిలావస్థకు చేరి పైకప్పు పెచ్చులూడి పడుతోంది. కిటికీలకు తలుపులు ఊడిపోతున్నాయి. గత్యంతరం లేక విద్యార్థులు అందులోనే ఉంటున్నారు. అందరికీ కలిపి మూడు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. అవీ సక్రమంగా లేవు. కామన్ గదిలోనే స్నానాలు చేస్తున్నారు. ప్లేట్లు కడుక్కునేందుకు ట్యాప్లు లేవు. అంట్లు తోమే ట్యాప్ వద్దనే శుభ్రం చేసుకుంటున్నారు. ఈ భవనం నివాస యోగ్యం కాదని గతంలోనే ఇంజినీర్లు నిర్ణయించినా అందులోనే కొనసాగిస్తున్నారు. కొత్త భవనం నిర్మించే వరకు అద్దె భవనంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని గతంలో అధికారులు చెప్పారు. ఇంతవరకు మార్చలేదు. విద్యార్థులు అందులోనే ఉండాల్సిన దుస్థితి.
ఆరుబయటే స్నానం..
నరసరావుపేట లింగంగుంట్లలోని ఎస్సీ వసతి గృహంలో స్నానపు గదులే లేవు. విద్యార్థులంతా ఆరుబయటే స్నానం చేయాల్సిన దుస్థితి. మరుగుదొడ్లు, కొళాయిలకు ట్యాప్లు లేవు. మోటార్ ఆన్ చేసి డైరెక్టుగా నీరు పట్టుకోవాల్సిన పరిస్థితి. బకెట్లు లేవు. స్నానం చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్యాప్లు బిగిస్తామని చెప్పి నెలలు అవుతున్నా ఇంతవరకు బిగించలేదు. విద్యాసంవత్సరం కూడా ముగుస్తోంది. పల్నాడురోడ్డులోని మరో ఎస్సీ వసతిగృహం దారుణంగా ఉంది. శుభ్రత లోపించింది. అన్ని గదులూ శిథిలావస్థకు చేరుకున్నాయి. స్నానాల గదులను శుభ్రపరచడం లేదు. కిటికీల తలుపులు ఊడిపోయాయి. అంతేకాకుండా శ్లాబు పెచ్చులూడిపోయాయి. కిటికీల వద్ద గోడలు ధ్వంసమయ్యాయి. రెండు వసతిగృహాల్లో కలిపి వందకుపైగా విద్యార్థులు అవస్థల మధ్యే చదువుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కాల్చి పడేస్తా.. ఎవడొస్తాడో రమ్మను’
[ 30-04-2024]
కాల్చి పడేస్తా ఎవరు వస్తారో రమ్మనురా అంటూ సస్పెండైన ఎస్సై వీరంగం సృష్టించిన ఘటన సోమవారం వెలుగు చూసింది. భార్య భర్తల కేసు న్యాయస్థానంలో ఉండగా సస్పెన్స్లో ఉన్న ఓ ఎస్సై.. -
ఎండలో మాడ్చొద్దు.. ఉసురు తీయొద్దు
[ 30-04-2024]
సామాజిక పింఛన్ల మొత్తాన్ని బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయం వారిని మరింత ఇబ్బంది పెట్టేలా ఉంది. -
ఓట్ల వేటలో జగన్నాటకమే
[ 30-04-2024]
పండుటాకులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మొన్న పింఛన్ల కోసం సచివాలయాల చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురిచేసింది. అది సరిపోలేదని ఈసారి ఏకంగా కిలోమీటర్ల దూరం వెళ్లి బ్యాంకుల నుంచి పింఛను తెచ్చుకునేలా చేస్తోంది. -
మత్తులో ముంచారు.. మొత్తంగా దోచారు!
[ 30-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక మద్యం దుకాణాల వద్ద సిబ్బందిగా ఉపాధ్యాయులను నియమించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని కొత్తకొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న మద్యం బ్రాండ్లను పూర్తిగా ఆపేశారు. -
అయిదేళ్ల వేదన.. అరణ్య రోదన
[ 30-04-2024]
సీఎం జగన్ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారు. మాట ఇవ్వడం.. మడమ తిప్పడం అనే పదానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా మారారు. ఈ అయిదేళ్లలో ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. -
పొన్నూరు అభివృద్ధిపై నోరువిప్పని జగన్
[ 30-04-2024]
పట్టణంలోని రేపల్లె బస్టాండ్ వద్ద నిర్వహించిన సభలో సీఎం జగన్ పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై స్పందించకపోవడంపై ప్రజలు నిరాశ చెందారు. -
పోరు.. ఖరారు!
[ 30-04-2024]
గుంటూరు పార్లమెంటు స్థానానికి 30 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఇక్కడ పోటీకి ఆసక్తి చూపడం గమనార్హం. -
పోరులో నిలిచింది 122 మంది
[ 30-04-2024]
నామినేషన్ల తుది ఘట్టం ముగిసింది. ఉపసంహరణల అనంతరం ఎంపీ, అసెంబ్లీ స్థానాలకు మొత్తం 122 మంది బరిలో నిలిచారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల నుంచి ఒక్కరు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. -
వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యం
[ 30-04-2024]
వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా పని చేస్తానని పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. -
జిల్లాలో 12,91,716 ఓటర్లు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు తుది ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్బాషా సోమవారం ప్రకటించారు. జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 12,91,716 మంది ఓటర్లు ఉన్నారు. -
ఎన్నికల బరిలో 104 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో బాపట్ల లోక్సభ నియోజకవర్గం, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 104 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలు తుది గడువుగా ఉంది. -
రెండ్రోజులకోసారి డ్రమ్ము నీరు సరిపోతుందా?
[ 30-04-2024]
రేపల్లె శివారు ప్రాంతమైన 28వ వార్డు ప్రజలకు తాగునీరు అందడం లేదని ఆరోపిస్తూ వారు ప్రధాన రహదారిపై సోమవారం ఆందోళనకు దిగారు. ట్యాంకరుతో రెండ్రోజులకోసారి సరఫరా చేస్తున్న నీరు అందరికీ సరిపోవడంలేదని మండిపడ్డారు. -
లోకేశ్తో చిరువ్యాపారులకు మంచి రోజులు
[ 30-04-2024]
నారా లోకేశ్ ఎమ్మెల్యే అయితే మంగళగిరిలో చిరు వ్యాపారులకు మంచి రోజులొస్తాయని, సైకిల్ గుర్తుపై ఓటేసి ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. -
వసూళ్లలో ఎగుమతి, దిగుమతి సంఘాల నేతలు
[ 30-04-2024]
వ్యాపారుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన మిర్చి ఎగుమతి, దిగుమతి సంఘాల నాయకులు అధికార పార్టీ నేతల సేవలో మునిగి తేలుతున్నారు.