మేము దాచుకుంది.. నీ నవరత్నాల కోసం కాదు
ప్రతి ఉద్యోగి తన సర్వీసులో ఎంతో కొంత పొదుపు చేసి విశ్రాంత జీవితం సాఫీగా సాగిద్దామనుకుంటారు. సరెండర్ లీవ్, డీఏ, జీపీఎఫ్.. ఇలా పలు రకాల అవకాశాలను పొదుపునకు పెట్టుబడిగా మలచుకుంటారు.
ఉద్యోగుల సొమ్ము ఇవ్వకుండా ప్రభుత్వం గారడీ
పెండింగ్లోనే సరెండర్ లీవ్లు, డీఏలు
పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఉపాధ్యాయ సంఘ నాయకుల ధర్నా (పాత చిత్రం)
కలెక్టరేట్(గుంటూరు), జిల్లాపరిషత్తు, న్యూస్టుడే: ప్రతి ఉద్యోగి తన సర్వీసులో ఎంతో కొంత పొదుపు చేసి విశ్రాంత జీవితం సాఫీగా సాగిద్దామనుకుంటారు. సరెండర్ లీవ్, డీఏ, జీపీఎఫ్.. ఇలా పలు రకాల అవకాశాలను పొదుపునకు పెట్టుబడిగా మలచుకుంటారు. ఇందుకోసం ప్రతి నెలా ఎంతో కొంత జమ చేసుకుంటారు. పిల్లల చదువుల కోసమని, పెళ్లికని, సొంత ఇంటి నిర్మాణానికి.. ఇలా అనేక రకాల ప్రణాళికలతో ఉద్యోగులు సొమ్ము దాచుకున్నా.. మళ్లీ నగదు తీసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. అవసరం కోసం పొదుపులో కొంత నగదును తీసుకోవడానికి దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం చెల్లించని పరిస్థితి. చివరకు ఆందోళన బాట పట్టి రోడ్డెక్కితే.. అప్పటికి ఓ గడువు నిర్ణయించి బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చి చేతులు దులిపేసుకుంటోంది. నెలులు గుస్తున్నా రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రభుత్వ సొమ్ముతో సహా, ఉద్యోగులు దాచుకున్న వాటిని కూడా నవరత్నాలకు ఖర్చు చేసి ఇబ్బందులు పెడుతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ పోషణకు పాట్లు
రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కనీసం సిబ్బంది ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. ప్రతి నెలలో ఒకటో తేదీన జీతాలు చెల్లించడం లేదు. మూడు నెలలకోసారి విడుదల చేస్తుండటంతో కుటుంబ పోషణకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. పిల్లల ఫీజులు చెల్లించేందుకు, అనారోగ్యాలకు గురై ఆస్పత్రుల్లో చేరినప్పుడు చేతిలో డబ్బులు లేక అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఉద్యోగులకు పదోన్నతులు కల్పించకపోవడంతో ఒకే క్యాడర్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేస్తున్నారని రాష్ట్ర సంఘం నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు.
- నాలుగో తరగతి సిబ్బంది జీతాల మీదనే ఆధార పడి కుటుంబాలను పోషించుకుంటున్నారు. జీపీఎఫ్, సరెండర్ లీవులు నెలలుగా విడుదల చేయకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లడంతో గత ఫిబ్రవరిలో జీపీఎఫ్ విడుదల చేసింది. కుటుంబాల అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద తీసుకున్న అప్పులు, వడ్డీలు తీర్చేందుకు ఉపయోగపడటం మినహా ఉద్యోగులకు ఉపయోగపడలేదని రాష్ట్ర సంఘం నాయకుడు పేర్కొన్నారు.
ఎన్నిసార్లు అడిగినా.. :
ఘంటసాల శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు
గడచిన మూడేళ్లుగా సరెండర్ లీవు డబ్బులను ప్రభుత్వం చెల్లించడం లేదు. అడిగితే వాయిదాలు వేస్తూ వస్తోంది. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కటంటే ఒక్క డీఏ ఇచ్చిన సందర్భం లేదు. ఉద్యోగులు ఎన్నో ఆశలతో దాచుకున్న సొమ్మును ప్రభుత్వం వారికిష్టమొచ్చినట్లుగా ఉపయోగించుకుంటోంది. ఉద్యోగులకు సంబంధించిన సొమ్మును వారికి సకాలంలో చెల్లించాల్సిన అవసరం ఉంది.
ఆప్షన్ మాత్రం లేదు :
శెట్టిపల్లి సతీష్కుమార్, ఏపీఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి
ఏప్రిల్, జూన్లో డీఏలు ఇస్తామని ప్రభుత్వం చెప్పి జీవోలు ఇచ్చింది. అయితే ఈ నెలలో రావాల్సి ఉన్నా.. ఇంత వరకు రాలేదు. ఆన్లైన్లో డీఏకు సంబంధించిన వివరాలు ఏవీ కనిపించడం లేదు. నమోదు చేసుకుందామంటే ఎక్కడా ఆప్షన్ కనిపించడం లేదు.
మూడేళ్లుగా మొండిచేయి...
సరెండర్ లీవ్ల నగదు కోసం ఉద్యోగులు ఏడాదికి ఒకసారి దరఖాస్తు పెట్టుకుంటారు. అదే పోలీసు శాఖలో ఉద్యోగులకు రెండుసార్లు పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. గత ప్రభుత్వంలో ఏటా ఉద్యోగులు దరఖాస్తు చేసుకుంటే డబ్బులను సదరు ఉద్యోగి ఖాతాలో జమ చేసేవారు. వైకాపా సర్కారులో గడిచిన మూడేళ్లుగా సరెండర్ లీవు డబ్బులను ఉద్యోగులకు జమ చేయడం లేదు. వేలాది మంది ఉద్యోగులు డబ్బులు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఉద్యోగులతో చర్చలు జరిపిన ప్రతిసారీ ఒక తేదీ ప్రకటించడం, అప్పటి వరకు చూసి డబ్బులు జమ కాలేదని రోడ్డెక్కితే.. మరో తేదీ ప్రకటిస్తూ సర్కారు మొండిచేయి చూపుతోంది. ఏదొక అవసరానికి ఉపయుక్తంగా ఉంటుందనుకుంటే.. ఆ డబ్బులు రాక బయట అప్పులు తెచ్చుకుని అత్యవసరాలకు వినియోగించుకోవాల్సిన దుస్థితి నెలకొందని గగ్గోలు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎండలో మాడ్చొద్దు.. ఉసురు తీయొద్దు
[ 30-04-2024]
సామాజిక పింఛన్ల మొత్తాన్ని బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయం వారిని మరింత ఇబ్బంది పెట్టేలా ఉంది. -
ఓట్ల వేటలో జగన్నాటకమే
[ 30-04-2024]
పండుటాకులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మొన్న పింఛన్ల కోసం సచివాలయాల చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురిచేసింది. అది సరిపోలేదని ఈసారి ఏకంగా కిలోమీటర్ల దూరం వెళ్లి బ్యాంకుల నుంచి పింఛను తెచ్చుకునేలా చేస్తోంది. -
మత్తులో ముంచారు.. మొత్తంగా దోచారు!
[ 30-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక మద్యం దుకాణాల వద్ద సిబ్బందిగా ఉపాధ్యాయులను నియమించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని కొత్తకొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న మద్యం బ్రాండ్లను పూర్తిగా ఆపేశారు. -
అయిదేళ్ల వేదన.. అరణ్య రోదన
[ 30-04-2024]
సీఎం జగన్ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారు. మాట ఇవ్వడం.. మడమ తిప్పడం అనే పదానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా మారారు. ఈ అయిదేళ్లలో ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. -
పొన్నూరు అభివృద్ధిపై నోరువిప్పని జగన్
[ 30-04-2024]
పట్టణంలోని రేపల్లె బస్టాండ్ వద్ద నిర్వహించిన సభలో సీఎం జగన్ పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై స్పందించకపోవడంపై ప్రజలు నిరాశ చెందారు. -
పోరు.. ఖరారు!
[ 30-04-2024]
గుంటూరు పార్లమెంటు స్థానానికి 30 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఇక్కడ పోటీకి ఆసక్తి చూపడం గమనార్హం. -
పోరులో నిలిచింది 122 మంది
[ 30-04-2024]
నామినేషన్ల తుది ఘట్టం ముగిసింది. ఉపసంహరణల అనంతరం ఎంపీ, అసెంబ్లీ స్థానాలకు మొత్తం 122 మంది బరిలో నిలిచారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల నుంచి ఒక్కరు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. -
వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యం
[ 30-04-2024]
వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా పని చేస్తానని పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. -
జిల్లాలో 12,91,716 ఓటర్లు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు తుది ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్బాషా సోమవారం ప్రకటించారు. జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 12,91,716 మంది ఓటర్లు ఉన్నారు. -
ఎన్నికల బరిలో 104 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో బాపట్ల లోక్సభ నియోజకవర్గం, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 104 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలు తుది గడువుగా ఉంది. -
రెండ్రోజులకోసారి డ్రమ్ము నీరు సరిపోతుందా?
[ 30-04-2024]
రేపల్లె శివారు ప్రాంతమైన 28వ వార్డు ప్రజలకు తాగునీరు అందడం లేదని ఆరోపిస్తూ వారు ప్రధాన రహదారిపై సోమవారం ఆందోళనకు దిగారు. ట్యాంకరుతో రెండ్రోజులకోసారి సరఫరా చేస్తున్న నీరు అందరికీ సరిపోవడంలేదని మండిపడ్డారు. -
‘కాల్చి పడేస్తా.. ఎవడొస్తాడో రమ్మను’
[ 30-04-2024]
కాల్చి పడేస్తా ఎవరు వస్తారో రమ్మనురా అంటూ సస్పెండైన ఎస్సై వీరంగం సృష్టించిన ఘటన సోమవారం వెలుగు చూసింది. భార్య భర్తల కేసు న్యాయస్థానంలో ఉండగా సస్పెన్స్లో ఉన్న ఓ ఎస్సై.. -
లోకేశ్తో చిరువ్యాపారులకు మంచి రోజులు
[ 30-04-2024]
నారా లోకేశ్ ఎమ్మెల్యే అయితే మంగళగిరిలో చిరు వ్యాపారులకు మంచి రోజులొస్తాయని, సైకిల్ గుర్తుపై ఓటేసి ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. -
వసూళ్లలో ఎగుమతి, దిగుమతి సంఘాల నేతలు
[ 30-04-2024]
వ్యాపారుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన మిర్చి ఎగుమతి, దిగుమతి సంఘాల నాయకులు అధికార పార్టీ నేతల సేవలో మునిగి తేలుతున్నారు.