కోన రఘుపతి.. ఓ భూబకాసురుడు
దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
కర్లపాలెం సభలో నిప్పులు చెరిగిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
ఎంపీ అభ్యర్థి జేడీ శీలంను పరిచయం చేస్తున్న షర్మిల, చిత్రంలో బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థి గంటా అంజిబాబు
బాపట్ల, కర్లపాలెం, న్యూస్టుడే : దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కర్లపాలెంలో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ న్యాయయాత్ర సభలో షర్మిల సీఎం వైఎస్ జగన్, వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైకాపా ఐదేళ్ల పాలన అంతా దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యమని షర్మిల ధ్వజమెత్తారు. తెదేపా వాళ్లు కిటికీలు మాత్రమే దోచారన్నారు. వైకాపా నేతలు మాత్రం ఏకంగా గడపలనే దోచేశారని మండిపడ్డారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఇసుక మాఫియా డాన్, భూబకాసురుడని ఆరోపించారు. జగనన్న కాలనీలకు భూసేకరణలో తన బినామీలతో తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి అధిక ధరకు విక్రయించి రూ.కోట్లు దోచుకుతిన్నాడన్నారు. ఇలాంటి దొంగ కోన రఘుపతికి మరలా వైఎస్ జగన్ బాపట్ల అసెంబ్లీ సీటు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. బాపట్లను పూర్తిగా దోచుకోవడానికే రఘుపతికి వైకాపా టిక్కెట్ ఇచ్చి పోటీలో నిలిపారన్నారు. ప్రజలు బాగా ఆలోచించి ఎన్నికల్లో విజ్ఞతతో ఓటు వేసి వైకాపా ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్, ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతిని చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు. బాపట్ల ఎంపీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, ఎమ్మెల్యే అభ్యర్థి గంటా అంజిబాబుకు ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జేడీ శీలం మాట్లాడుతూ గత ఎన్నికల్లో గెలిపించిన వైకాపా ఎంపీ నందిగం సురేష్ ఐదేళ్లలో గ్రామాల్లోకి వచ్చి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేపట్టారా అని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో బాపట్ల అలాగే ఉందని, ఎమ్మెల్యే కోన రఘుపతి మాత్రం ఆర్థికంగా ఎక్కువగా అభివృద్ధి చెందారని ఎద్దేవా చేశారు.
బారికేడ్లు తొలగించకపోవడంపై ఆగ్రహం
కర్లపాలెం సభకు వచ్చిన షర్మిల తొలుత స్థానిక ప్రజలు, కార్యకర్తలతో కరచాలనం చేశారు. న్యాయయాత్ర బస్సు పక్క, వెనుక భాగంగా ప్రజలు రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ బారికేడ్లు తొలగించి జనాన్ని ముందుకు పంపించాలని పోలీసులను ఆమె పదే పదే మైకులో కోరారు. అయినా పోలీసులు స్పందించకపోవటంతో షర్మిల అసంతృప్తికి లోనయ్యారు. సభను అడ్డుకోవటానికి పెట్టారా.. అని ఓ దశలో పోలీసులపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లమడ వాగు ఏటా పొంగి లక్షల ఎకరాల్లో పంటలు మునిగి దెబ్బతిని రైతులు రూ.వందల కోట్లు నష్టపోతున్నారని షర్మిల ప్రసంగంలో ఉటంకించారు. రైతులపై నిజమైన ప్రేమ ఉంటే వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో నల్లమడ వాగు ఆధునికీకరణ పనులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మిగ్జాం తుపానుకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నేటికి సాయం అందకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచక నేతలను ఓటుతో తరిమికొట్టండి
[ 06-05-2024]
‘ఇది మహనీయుల గడ్డ. ఎన్జీరంగా పుట్టిన ఈ నేలకు నమస్కరిస్తున్నా. చేనేత పితామహుడు ప్రగడకోటయ్య పుట్టిన ప్రదేశమిది. -
జనం ఆస్తులపై.. జగన్!
[ 06-05-2024]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్) ఆదివాసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాలకు శాపంగా మారింది. -
పోస్టల్ బ్యాలట్ గందరగోళం
[ 06-05-2024]
జిల్లాలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆదివారం పీవో, ఏపీవోలకు ఉదయం శిక్షణ ఇచ్చి మధ్యాహ్నం నుంచి అక్కడే పోస్టల్ బ్యాలట్ ఓటు వేసుకునే వెసులుబాటు కల్పించారు. -
మా ఆస్తులపై.. నీ పెత్తనం ఏంటీ జగన్!
[ 06-05-2024]
ప్రస్తుతం రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చర్చ తీవ్రమవడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
సీపీఎస్ రద్దని నమ్మించి ఉద్యోగులను మోసం చేసి..
[ 06-05-2024]
2019 ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన జగన్ ఉద్యోగులతో ఊరూరా దండలు వేయించుకుని వారికి ముద్దులుపెట్టి తాను అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి పాత పింఛను స్కీంను (ఓపీఎస్) తీసుకొస్తానని హామీ ఇచ్చారు. -
ఐదేళ్లూ.. దారిద్య్రమే!
[ 06-05-2024]
రహదారులు.. ప్రగతికి చిహ్నాలు. వైకాపా అయిదేళ్ల పాలనలో పూర్తిగా వీటిని నిర్లక్ష్యం చేశారు. అడుగుకో గుంత చొప్పున రోడ్డంతా చిల్లులు పడినా వైకాపా ప్రజాప్రతినిధులు, మంత్రులు పట్టనట్లు వదిలేశారు. -
8 వరకు పోస్టల్ బ్యాలట్కు అవకాశం
[ 06-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఈ నెల 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కలెక్టర్, ఎన్నికల అధికారి వేణుగోపాల్రెడ్డి అన్నారు. -
అక్రమ వసూళ్లలో రజిని ఆల్టైం రికార్డు
[ 06-05-2024]
అయిదేళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైకాపా నేతలందరూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
పోలింగ్ బూత్ల వద్ద ఉద్యోగుల కష్టాలు
[ 06-05-2024]
తొలిరోజు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడంలో ఉద్యోగులు అవస్థలు పడ్డారు. -
ఓటు హక్కు వినియోగం!
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో విధులు నిర్వహించే ఉద్యోగులు ఆదివారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
మాటల్లోనే సురక్షితం.. గ్రామాలకు అందని జలం
[ 06-05-2024]
రొంపిచర్ల మండలంలోని మునమాకలో నాలుగేళ్ల నుంచి రక్షిత మంచి నీటి పథకం నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోయింది. -
తెదేపా కార్యకర్తలపై వైకాపా రాళ్ల దాడి
[ 06-05-2024]
మాచర్లలో వైకాపా మూక మరోసారి రెచ్చిపోయింది. తెదేపా కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు దిగింది. -
బ్యాలెట్ ఓట్లకు బేరసారాలు
[ 06-05-2024]
ఒకటి కాదు.. రెండు కాదు.. పది ముఠాలు పోలింగ్ కేంద్రానికి సమీపంలో కాచుక్కున్నాయ్... ఓటేసేందుకు వచ్చిన ఉద్యోగితో బేరసారాలాడటం..
తాజా వార్తలు (Latest News)
-
లేని సీట్లను అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఆస్ట్రేలియా ఎయిర్లైన్స్ నిర్వాకం!
-
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు