logo

విద్యుదాఘాతంతో మహిళా కూలీ దుర్మరణం

విద్యుదాఘాతంతో మహిళా కూలీ దుర్మరణం పాలైన సంఘటన శుక్రవారం జరిగింది. తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. పట్టణంలోని సాయిపూరు ప్రాంతానికి చెందిన

Published : 15 Jan 2022 00:52 IST

తాండూరు టౌన్‌: విద్యుదాఘాతంతో మహిళా కూలీ దుర్మరణం పాలైన సంఘటన శుక్రవారం జరిగింది. తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. పట్టణంలోని సాయిపూరు ప్రాంతానికి చెందిన కుర్వ శారదమ్మ(42) రోజు కూలీ పనులు చేస్తూ జీవనం గడిపేది. ఇందులో భాగంగానే పట్టణంలోని గ్రీన్‌సిటీలో ఇంటి నిర్మాణ పనులకు వెళ్లింది. బండలు కడిగేందుకు విద్యుత్తు మోటారు వేసే క్రమంలో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందింది. తోటి పనివారు జిల్లా ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. బాధితురాలి కూతురు అంబిక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని