నకిలీ పట్టాలు... విదేశాల్లో కొలువులు
అమెరికాలో ఎంఎస్ చేయాలా?.. లండన్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించాలా?.. సాఫ్ట్వేర్ కంపెనీల్లో కొలువులు కావాలా?. ఇచ్చేస్తామంటూ కొందరు అక్రమార్కులు విద్యార్థులు.. ఉద్యోగార్థులను నమ్మించి రూ.లక్షల్లో తీసుకుని విదేశాలకు పంపుతున్నారు..
ప్రముఖ వర్సిటీల ఇంజినీరింగ్, డిగ్రీ సర్టిఫికేట్లు
రూ.75 వేలకే ఇస్తున్న కన్సల్టెన్సీలు
ఈనాడు, హైదరాబాద్
నవీద్
అమెరికాలో ఎంఎస్ చేయాలా?.. లండన్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించాలా?.. సాఫ్ట్వేర్ కంపెనీల్లో కొలువులు కావాలా?. ఇచ్చేస్తామంటూ కొందరు అక్రమార్కులు విద్యార్థులు.. ఉద్యోగార్థులను నమ్మించి రూ.లక్షల్లో తీసుకుని విదేశాలకు పంపుతున్నారు.. విదేశీ యూనివర్సిటీలు, కార్పొరేటు సంస్థలకు అనుమానాలు రాకుండా ప్రముఖ వర్సిటీల్లో చదివినట్టు... తక్కువమార్కులు వచ్చినవారికి ఎక్కువ మార్కులు వచ్చినట్టు నకిలీ పట్టాలు, మార్కుల జాబితాలు తయారు చేస్తున్నారు. ఆశావాహులు నగదు ముట్టజెప్పిన అనంతరం వారికి నకిలీ పట్టాలుఇస్తున్నారు. విదేశాలకు పంపుతున్నారు. ఇలా కొద్దినెలల్లోనే 500 మందికిపైగా ఉద్యోగార్థులు నకిలీ పత్రాలతో పలు దేశాలకు వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు కొద్దిరోజుల క్రితం క్యూబెజ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో దాడులు నిర్వహించగా.. ఇంజినీరింగ్, డిగ్రీ నకిలీ పట్టాలు కనిపించాయి. వరంగల్ పోలీసులు వారం రోజుల క్రితం మరో ముఠాను పట్టుకున్నారు..
హైదరాబాద్, వరంగల్ కేంద్రాలుగా.. నకిలీపట్టాలు తయారు చేస్తున్న ముఠాలు హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో పదుల సంఖ్యలో ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అర్హతలు లేకున్నా విదేశాలకు పంపుతున్నారన్న సమాచారంతో హైదరాబాద్, వరంగల్ పోలీసులు గతనెలలో వేర్వేరుగా కన్సల్టెన్సీలపై దాడులు నిర్వహించారు. హైదరాబాద్ పోలీసులు రెండు కన్సల్టెన్సీలు, వరంగల్ పోలీసులు 21 కన్సల్టెన్సీల్లో తనిఖీలు చేశారు. ఆయా కన్సల్టెన్సీల్లో ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, ఆంధ్రా, ఆచార్య నాగార్జున, జేఎన్టీయూ హైదరాబాద్, మగధ, బుందేల్ఖండ్, కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీ, మహరాష్ట్ర ఎస్ఎస్సీబోర్డు, చెన్నైలోని సత్యభామ, అన్నా యూనివర్సిటీ, జాతీయ ఓపెన్ స్కూల్కు చెందిన నకిలీ పట్టాలు స్వాధీనం చేసుకున్నారు. బషీర్బాగ్లో క్యూబెజ్ కన్సల్టెన్సీ యజమాని సయ్యద్ నవీద్ను విచారించగా. తనకు అమెరికా, బ్రిటన్, స్కాట్లాండ్లలోని విదేశీ వర్సిటీలతో ఒప్పందాలున్నాయన్నాడు. ఒక్కో పట్టాకు రూ.75వేల నుంచి రూ.లక్ష తీసుకుంటున్నానని వివరించాడు. వరంగల్లో రెండు ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు.
హాలోగ్రామ్ మాయ.. ఆన్లైన్లో ధ్రువీకరణ..
విదేశీ వర్సిటీలు, కంపెనీల్లో కొలువులు ఇప్పిస్తామంటూ అక్రమాలు చేస్తున్న కన్సల్టెన్సీలు అక్కడి విశ్వవిద్యాలయాలు, కార్పొరేటు కంపెనీలను మాయచేసేందుకు నకిలీ సర్టిఫికేట్లను అసలైన పట్టాల్లా తయారు చేస్తున్నారు. వీసా సేవల కన్సల్టెన్సీలతో అక్రమార్కులు సత్సంబంధాలు నిర్వహిస్తుండడంతో ఎక్కడా అనుమానాలు రావడం లేదు. ః పట్టాలను తయారు చేసేటప్పుడు అప్పట్లో ఉన్న ఉపకులపతుల పేర్లు తెలుసుకుని సంతకాలు పెడుతున్నారు. హాలో గ్రాములూ తయారు చేస్తున్నారు.
* ఎలాంటి అర్హతలు లేకుండా విదేశాల్లో చదివేందుకు వెళ్లేవారికి ఒక ధర, ఇంజినీరింగ్, డిగ్రీల్లో తక్కువ మార్కులు వచ్చినవారి మార్కుల జాబితాల్లో ఎక్కువ వేసి మరో ధర వసూలు చేస్తున్నారు.
* క్యూబెజ్ కన్సల్టెన్సీ యజమాని నవీద్ యూకేలోని టీసైడ్, బ్లాక్పూల్, అమెరికాలోని షిల్లర్, కంకోర్డియా విశ్వవిద్యాలయాల్లో చదివేందుకు వీలుగా విద్యార్థులకు నకిలీ పట్టాలను తయారుచేసి పంపాడు. వరంగల్లోని వేర్వేరు కన్సల్టెన్సీలు నిర్వహిస్తున్న రవి అవినాశ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఎక్కువగా ఐరోపాలోని వేర్వేరు దేశాలకు విద్యార్థుల్ని పంపించారు.
* హైదరాబాద్, వరంగల్ నుంచి నకిలీ పట్టాలతో వెళ్లిన విద్యార్థులు ఇంకా చదువుకుంటుండగా... సుమారు 500మంది వేర్వేరు సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనులు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. వారి వివరాలను సేకరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
[ 26-04-2024]
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!