logo

జేబులో సెల్‌ఫోన్‌ పేలి వ్యక్తికి గాయాలు

ప్యాంటు జేబులో పెట్టుకున్న సెల్‌ఫోన్‌ పేలడంతో ఓ వ్యక్తి కాలికి తీవ్ర గాయమైంది. మొయినాబాద్‌కు చెందిన రాఘురాం(27) భవన నిర్మాణ కూలీ. మంగళవారం ఉదయం రఘురాం లాంకోహిల్స్‌ వద్ద పనిచేస్తుండగా

Published : 25 May 2022 04:20 IST

గోల్కొండ, న్యూస్‌టుడే: ప్యాంటు జేబులో పెట్టుకున్న సెల్‌ఫోన్‌ పేలడంతో ఓ వ్యక్తి కాలికి తీవ్ర గాయమైంది. మొయినాబాద్‌కు చెందిన రాఘురాం(27) భవన నిర్మాణ కూలీ. మంగళవారం ఉదయం రఘురాం లాంకోహిల్స్‌ వద్ద పనిచేస్తుండగా ప్యాంటు జేబులోని సెల్‌ఫోన్‌ పేలింది. దీంతో తొడభాగంలో తీవ్రగాయమైంది. దీంతో వెంటనే నార్సింగ్‌ పీహెచ్‌సీకు వెళ్లగా.. వారు గోల్కొండ ప్రాంతీయ ఆసుపత్రికి పంపారు. అక్కడ వైద్యులు అతనికి చికిత్స చేసి పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని