logo

మేడ పైనుంచి దూకి మతిస్థిమితం లేని మహిళ..

కొంపల్లి మున్సిపాలిటీ పరిధి బొబ్బిలి అపార్టుమెంట్‌కు చెందిన రినితారెడ్డి(33)కి మతిస్థిమితం లేకపోవటంతో ఆరు నెలలుగా తల్లి అరుణ ఇంటి వద్ద ఉంటోంది. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో...

Published : 11 Aug 2022 03:22 IST


రినితారెడ్డి

పేట్‌బషీరాబాద్‌: కొంపల్లి మున్సిపాలిటీ పరిధి బొబ్బిలి అపార్టుమెంట్‌కు చెందిన రినితారెడ్డి(33)కి మతిస్థిమితం లేకపోవటంతో ఆరు నెలలుగా తల్లి అరుణ ఇంటి వద్ద ఉంటోంది. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో అపార్టుమెంట్‌ ఐదో అంతస్తు పైనుంచి కిందకు దూకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు, కుటుంబసభ్యులు 100కు ఫోను చేయడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు ఆరు సంవత్సరాల కుమార్తె ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని