దొంగల ముఠా గుట్టు విప్పిన తెల్లచొక్కా
సంచలనం సృష్టించిన నాగోల్ కాల్పుల కేసులో దోపిడీ దొంగల గుట్టు ఒక్క తెల్లచొక్కాతో రట్టయింది.
నాగోల్ కాల్పుల కేసు ఛేదించిన పోలీసులు
ఆరుగురి అరెస్టు.. పరారీలో నలుగురు
నిందితులు దోపిడీకి పాల్పడుతున్న దృశ్యాలను చూపిస్తున్న కమిషనర్
ఈనాడు- హైదరాబాద్, నాగోల్, న్యూస్టుడే: సంచలనం సృష్టించిన నాగోల్ కాల్పుల కేసులో దోపిడీ దొంగల గుట్టు ఒక్క తెల్లచొక్కాతో రట్టయింది. రూ.1.36 కోట్ల విలువైన బంగారం కొట్టేసిన వ్యవహారంలో ఆరుగుర్ని అరెస్టు చేయగా ప్రధాన సూత్రధారి సహా నలుగురు పరారీలో ఉన్నారు. 2.7 కిలోల బంగారం, రూ.65,500, మూడు దేశవాళీ పిస్టళ్లు, 25 రౌండ్ల బుల్లెట్లు, ఒక ఎయిర్పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ బుధవారం ఎల్బీనగర్లో విలేకరులకు వెల్లడించారు.
గతంలో పనిచేసిన పావు: రాజస్థాన్కు చెందిన మహేంద్ర కుమార్ చౌదరి(35) గజ్వేల్లో ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నాడు. భారీగా డబ్బు సంపాదించేందుకు దోపిడీకి ప్రణాళిక వేశాడు. సికింద్రాబాద్లోని పాట్ మార్కెట్ నుంచి బంగారు ఆభరణాలు కొని దుకాణాలకు విక్రయించే స్థానిక వ్యాపారి రాజ్కుమార్ సురానాను లక్ష్యంగా చేసుకున్నాడు. గతంలో రాజ్కుమార్ దుకాణంలో పనిచేసిన రామాయంపేటకు చెందిన బన్సీరామ్(23) సహకారాన్ని కోరాడు. దీంతోపాటు మహేంద్ర తన భార్య గుడియా జాట్, బావమరిది సుమేర్ చౌదరి, ఆభరణాల దుకాణంలో పనిచేసే మనీశ్ వైష్ణవ్(31), పాలకుర్తిలో గతంలో తన దుకాణంలో పనిచేసిన రాజస్థాన్కు చెందిన రితేశ్వైష్ణవ్(32), గజ్వేల్కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ మహ్మద్ ఫిరోజ్(31), రాజస్థాన్, హరియాణాకు చెందిన దోపిడీ దొంగలు సుమిత్ దగర్, మనీశ్, మన్యా సాయం తీసుకున్నాడు. ప్రణాళిక ప్రకారం బన్సీరామ్ అక్టోబరు తొలివారంలో రాజ్కుమార్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో రెక్కీ చేశాడు.
అనుసరించి.. తుపాకీ ఎక్కుపెట్టి: డిసెంబరు 1న మధ్యాహ్నం 2 గంటల సమయంలో 3 కిలోల బంగారు ఆభరణాలతో వ్యాపారి రాజ్కుమార్, తన సహాయకుడు సుఖరామ్తో కలిసి సికింద్రాబాద్ పాటు మార్కెట్ నుంచి బయల్దేరాడు. మన్యా, బన్సీరామ్, సుమిత్ దగర్, మనీశ్ ద్విచక్రవాహనాలపై వారిని అనుసరించారు. రాత్రి 8 గంటల సమయంలో నాగోల్ స్నేహపురి కాలనీలోని జ్యుయెలరీకి చేరుకున్నారు. దుకాణం యజమాని కళ్యాణ్ చౌదరికి వారు ఆభరణాలు చూపిస్తుండగా సుమిత్ దగర్, మనీష్ దుకాణంలోకి చొరబడ్డారు. సుమిత్ తుపాకీతో కాల్చగా కళ్యాణ్ చౌదరి, సుఖరామ్కు గాయాలయ్యాయి. 2.74 కిలోల బంగారం, రూ.2.63లక్షలతో ఉన్న సంచిని లాక్కొని పారిపోయారు. ప్రధాన సూత్రధారి మహేంద్ర, ఫిరోజ్తో కలిసి ఉప్పల్లోని ఓ బార్లో ఉంటూ దోపిడీనంతా అంతా పర్యవేక్షించాడు. సుమిత్, మనీశ్, మన్యాతో మహేంద్ర నిర్మల్ మీదుగా కారులో పారిపోయాడు.
చలానాతో దొరికిపోయి : దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సీసీపుటేజీల్లో బన్సీరామ్ తెల్లచొక్కా ధరించి కనిపించాడు. దోపిడీకి ముందు రాజ్కుమార్ ఎక్కడెక్కడ తిరిగాడో శోధించగా.. వారి వెంట యాక్టివాపై బన్సీలాల్ అనుసరించాడు. సరిగ్గా దోపిడీకి మూడు గంటల ముందు వాహనం నంబరు ప్లేటు తీసేశాడు. దీని ఆధారంగా కొన్ని గంటల కిందటి ఫుటేజీలు తీయగా వాహనం నంబరు దొరికింది. దానిపై చలానాలు ఉన్నాయోమేనని చూడగా.. రామాయంపేట దగ్గర తెల్లచొక్కాతో బన్సీరామ్ ట్రాఫిక్ కెమెరాకు చిక్కాడు. ఈ వివరాల ఆధారంగా తొలుత బన్సీరామ్ను అదుపులోకి తీసుకోగా మొత్తం గుట్టుబయటపడింది. మహేంద్ర, సుమిత్, మనీశ్, మన్యా రాజస్థాన్, హరియాణా వెళ్లినట్లు భావిస్తున్న పోలీసులు.. వారి కోసం 15 బృందాలతో వేెటాడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
[ 26-04-2024]
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్ హెర్బల్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
[ 26-04-2024]
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
[ 26-04-2024]
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
[ 26-04-2024]
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక