logo

ఎంఐఎం రాజేంద్రనగర్‌ అభ్యర్థిగా బి.రవియాదవ్‌

రాజేంద్రనగర్‌ నియోజకవర్గం మజ్లిస్‌ అభ్యర్థిగా లంగర్‌హౌస్‌ మాజీ కార్పొరేటర్‌ బీ.రవియాదవ్‌ను ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సోమవారం రాత్రి ప్రకటించారు.

Updated : 07 Nov 2023 06:32 IST

అబిడ్స్‌, న్యూస్‌టుడే: రాజేంద్రనగర్‌ నియోజకవర్గం మజ్లిస్‌ అభ్యర్థిగా లంగర్‌హౌస్‌ మాజీ కార్పొరేటర్‌ బీ.రవియాదవ్‌ను ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సోమవారం రాత్రి ప్రకటించారు. కార్వాన్‌ నియోజకవర్గం లంగర్‌హౌస్‌కు చెందిన రవియాదవ్‌ 2000 సంవత్సరం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. 2009లో లంగర్‌హౌస్‌ కార్పొరేటర్‌గా గెలిచి 2011-2012 సంవత్సరంలో స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా పని చేశారు. ఎగ్జిబిషన్‌ సొసైటీలో పబ్లిసిటీ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న రవియాదవ్‌కు ఎంఐఎంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. సోమవారం రాత్రి నాంపల్లి నియోజకవర్గంలో జరిగిన ఎంఐఎం బహిరంగ సభలో పార్టీ అధినేత రవియాదవ్‌ పేరును ప్రకటించారు. ఎంఐఎం తరఫున తొలిసారి రాజేంద్రనగర్‌ నుంచి ఒక హిందూ అభ్యర్థికి టిక్కెట్‌ను కేటాయించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని