పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
బాబాగూడ(శామీర్పేట), న్యూస్టుడే: భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది. కొడుకును బీ.టెక్ వరకు చదివించింది..ఆ యువకుడు ఓప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నా.. రెండు నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులతో ఆ కుటుంబం కలత చెందింది. ఆర్థికంగా సతమతమయ్యింది..చివరికి తల్లీ చెల్లిని పోషించలేక పోతున్నానని గురువారం సాయంత్రం ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..శామీర్పేట మండలం బాబాగూడ గ్రామానికి చెందిన కాసాల సంపత్గౌడ్(23) హైటెక్ సిటీలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. అతనికి చెల్లి శ్రీలతతో తల్లి,తాత ఉంటారు. ఇటీవల తాత మృతితో విధులకు వెళ్లకపోవటం, చేసిన పనికి రెండు నెలలుగా జీతాలు రాకపోవటంతో ఇంట్లో సరకులు తెచ్చుకోలేకపోయారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో తల్లితో చెప్పుకోలేక పోయాడు. బయటకు వెళ్తున్నట్లు చెల్లికి చెప్పి తన ద్విచక్రవాహనంపై వెళ్లిపోయాడు. ఫోన్ చేస్తే ఇప్పుడే వస్తున్నానంటూ తల్లిలో మాట్లాడిన సంపత్.. శామీర్పేటలోని సెయింట్ పాల్ పాఠశాల సమీపంలో ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. తల్లీ చెల్లి సాయంత్రం ఎన్నిసార్లు ఫోన్ చేసిన సమాధానం రాకపోవటంతో ఆందోళనకు గురయ్యారు. ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారంతో వెళ్లిన కుటుంబ సభ్యులు బోరున విలపించడం స్థానికులను కలిచి వేసింది.
ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి
నవాజ్ , అయాన్
షాపూర్నగర్, న్యూస్టుడే: క్వారీ గుంతలో ఈత నేర్చుకోవడానికి వెళ్లిన ఇద్దరు బాలురు మృతి చెందిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ క్రాంతికుమార్ వివరాల ప్రకారం...ఎల్లమ్మబండ పరిధి ఎన్టీఆర్నగర్కు చెందిన షేక్గౌస్ కుమారుడు అయాన్(15), షేక్సయ్యద్ కొడుకు నవాజ్(16) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. అయాన్ బైక్ సర్వీస్ సెంటర్ కూడా నిర్వహిస్తుంటాడు. గురువారం మధ్యాహ్నం మరో స్నేహితుడు హైదర్తో కలిసి వారు మిథులానగర్ సమీపంలోని క్వారీ గుంతలో ఈతకు వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు అయాన్, నవాజ్ నీటిలో మునిగి గల్లంతయ్యారు. వెంటనే హైదర్ మిథులానగర్ వెళ్లి స్థానికులకు సమాచారం ఇవ్వడంతోపాటు ఎన్టీఆర్నగర్ వెళ్లి వారి కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. సాయంత్రం 6 గంటలకు స్థానికులు నీటిలోంచి వారిని బయటకు తీశారు. బాచుపల్లి ఎస్సై మహేష్ సీపీఆర్ చేసినా ఫలితం లేదు.
కుక్కల దాడిలో జింక మృత్యువాత
పరిశీలిస్తున్న పోలీసులు
కొత్తూరు: కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన కొత్తూరు మండలం మక్తగూడలో గురువారం జరిగింది. మక్తగూడలోకి తెల్లవారుజామున శంషాబాద్ శివారు నుంచి ఓ జింక వచ్చింది. దాన్ని చూసిన కుక్కలు వెంటాడి తీవ్రంగా గాయపరిచాయి. సమాచారమందుకున్న పోలీసులు జింకను పరిశీలించగా అప్పటికే మృతిచెందింది. శంషాబాద్ అటవీశాఖ అధికారులకు సమాచారమందించి జింక కళేబరం అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
ఎండకు తాళలేక నెమలి..
చనిపోయిన నెమలిని స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు
ఖైరతాబాద్, న్యూస్టుడే: భానుడి భగభగలతో పక్షులు అల్లాడుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ నెమలి ప్రాణాలు విడిచింది. ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ ప్రాంతంలో కొన్నాళ్లుగా నాలుగైదు నెమళ్లు సంచరిస్తున్నాయి. తరచూ ఆహారం, నీటి కోసం సమీప ఓల్డ్సీఐబీ క్వార్టర్స్ కాలనీలోకి వెళ్తుంటాయి. గురువారం ఉదయం ఒక నెమలి ఓ ఇంటిపైకి చేరింది. రేకులపై రెక్కలు కొట్టుకుంటూ పడిపోగా ఇంట్లోనివారు వెళ్లి చూశారు. వెంటనే కిందకు తీసుకొచ్చి నీరు తాగించి సపర్యలు చేసినా.. ప్రాణాలు విడిచింది. జీహెచ్ఎంసీ అధికారులకు తెలియజేయగా, అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జ్యోతి జీహెచ్ఎంసీ సిబ్బందితో చేరుకుని నెమలిని స్వాధీనం చేసుకున్నారు.
మహిళను బెదిరించి అత్యాచారం
పోచారం(ఘట్కేసర్)న్యూస్టుడే: బిహార్ నుంచి ఉపాధికి వెదుక్కుంటూ వస్తే.. భర్త వదిలేశాడు. దినసరి కూలీగా పని చేస్తూ నలుగురు పిల్లలను పోషిస్తోంది. ఆ మహిళపై ఓ రౌడీషీటర్ కన్నేశాడు. బెదిరించి అత్యాచారం చేశాడు. పోచారం ఐటీకారిడార్ సీఐ బి.రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం..బిహార్కు చెందిన మహిళ(30) అన్నోజిగూడలో అద్దె ఇంట్లో ఉంటోంది. ఘట్కేసర్లో ఓ హోటల్లో పనిచేస్తోంది. కొంత కాలంగా అన్నోజిగూడకు చెందిన లారీ డ్రైవర్, రౌడీషీటర్ ఉమేష్నాయక్(22) ఆమె వెంట పడుతూ వేధిస్తున్నారు. ఈ నెల 16న రాత్రి ఘట్కేసర్లో పని ముగిసిన తర్వాత.. ఇంటికి వెళ్తున్న సమయంలో ఉమేష్ వచ్చి బెదిరించాడు. బలవంతంగా బైక్పై ఎక్కించుకొని వెళ్లి అత్యాచారం చేసి పారిపోయాడు. బుధవారం రాత్రి బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని గురువారం రిమాండ్కు తరలించామని సీఐ పేర్కొన్నారు.
మనోవేదనతో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
షాపూర్నగర్, న్యూస్టుడే: ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య ఘటన జగద్గిరిగుట్ట ఠాణా పరిధిలో జరిగింది. సీఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు పాలెం కాలనీకి చెందిన కురెమెల్ల శ్రీదేవి, సూర్యారావుల కుమార్తె వైష్ణవి(20) దుండిగల్లోని ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. సూర్యారావు మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో తల్లితోపాటు వైష్ణవి విజయ్నగర్ కాలనీలోని అపార్ట్మెంట్లో నివాసముంటోంది. తండ్రి చనిపోయినప్పటి నుంచి వైష్ణవి ఎవరితో మాట్లాడకుండా తరచూ బాధపడుతూ ఉండేది. ఈ నేపథ్యంలో ఆమెకు తరచూ తలనొప్పి వస్తుండడంతో చికిత్స చేయిస్తున్నారు. ఈ నెల 17న శ్రీరామనవమి సెలవు ఉండడంతో ఇంట్లోనే ఉంది. సాయంత్రం 6 గంటలకు తల్లి వాకింగ్కు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికిరాగా బాత్రూంలో నల్లా ఓపెన్ చేసి ఉండటంతో కూతురు స్నానం చేస్తోందని భావించింది. ఎంతకూ ఆమె రాకపోవడంతో స్థానికుల సహాయంతో బెడ్రూం తలుపులు బద్దలు కొట్టి చూడగా వైష్ణవి చీరకొంగుతో ఫ్యాన్కు ఉరేసుకుంది. కిందికి దించి చూడగా అప్పటికే చనిపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆమె చరవాణిని పరిశీలించగా.. ‘నేను చేసిన ఈ పనికి ఎవరూ కారణంకాదు, నాన్న లేకుండా బతకడం కష్టంగా ఉంది’ అని ఉంది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
బాలికకు లైంగిక వేధింపులు.. యువకుడికి 20 ఏళ్ల జైలు
నల్లకుంట, న్యూస్టుడే: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడికి 20 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ మేరకు వివరాలను నల్లకుంట సీఐ జదీశ్వర్రావు వెల్లడించారు. జియాగూడకు చెందిన నితీష్సింగ్(20).. 2018లో నల్లకుంట ఠాణా పరిధిలో నవసించే బాలిక(17)ను లైంగిక వేధింపులకు గురి చేశాడు. అనంతరం ఆమె కుటుంబికుల ఫిర్యాదుతో అతడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు(పోక్సో)లో.. కేసుపై వాదోపవాదనలు కొనసాగాయి. స్పెషల్ సెషన్స్ జడ్జి పుష్పలత.. నిందితుడికి 20 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చారని సీఐ వెల్లడించారు.
చనిపోతున్నా అంటూ యువకుడు సెల్ఫీ వీడియో
ఆచూకీ కోసం గాలిస్తున్న కుటుంబసభ్యులు, స్నేహితులు
షాద్నగర్ న్యూటౌన్, న్యూస్టుడే: జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు రంగారెడ్డిజిల్లా షాద్నగర్ పరిసర ప్రాంతంలో శీతల పానీయంలో పురుగుమందు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడుతున్న సెల్ఫీ వీడియో గురువారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అతడి బంధుమిత్రులు, యువకుడు వీడియోలో చెప్పిన వివరాలిలు.. షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన జంగయ్య కుమారుడు బుడ్డనోళ్ల రాజు కూలీ. ఇటీవల అతను ద్విచక్రవాహనం నడుపుతూ మరో వాహనాన్ని ఢీకొట్టగా ఆ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందడంతో మృతుడి సంబంధీకులు తనను కొట్టి నగదు తీసుకున్నారని రాజు వీడియోలో వివరించాడు. నష్టపరిహారం తీసుకున్నాక కూడా తరచూ బెదిరిస్తున్నారని, దీనిపై తన తండ్రి తిడుతుండడంతో మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నానని అతను చెప్పాడు. రాజు ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో అందరూ గాలిస్తున్నారు.
హెచ్సీయూలో విద్యార్థుల ఘర్షణ
గచ్చిబౌలి, న్యూస్టుడే: హెచ్సీయూలో బుధవారం అర్ధరాత్రి విద్యార్థులు ఘర్షణకు దిగారు. జే హాస్టల్ సమీపంలో ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ సభ్యులు చిన్న విషయమై దాడులకు దిగడంతో క్యాంపస్లో ఉద్రిక్తత నెలకొంది. గచ్చిబౌలి పోలీసులు వచ్చా పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తమపై అకారణంగా దాడికి పాల్పడ్డారని ఓ వర్గానికి చెందిన బాలకృష్ణ, మరో వర్గానికి చెందిన హఫీజ్ ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. క్యాంపస్ లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
కేసు కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన రాహిల్
ఈనాడు, హైదరాబాద్: పంజాగుట్ట వద్ద వాహనంతో బారికేడ్లను ఢీకొట్టిన కేసులో నిందితుడిగా చేర్చడాన్ని సవాలు చేస్తూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై గురువారం న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. రాహిల్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, చిన్న ప్రమాదం కేసును పోలీసులు తీవ్రతరం చేస్తూ 13మంది దాకా నిందితులను చేర్చుతూ వెళ్లారన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ విదేశాల నుంచి వచ్చిన పిటిషనర్ను పోలీసులు అరెస్ట్చేశారని, కిందికోర్టు బెయిలు మంజూరుచేసిందని అన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి దర్యాప్తు నిలిపివేతకు నిరాకరిస్తూ పోలీసులకు నోటీసులు జారీచేశారు. విచారణను జూన్ 11కు వాయిదా వేశారు. మరో నిందితుడైన నాని వేసిన పిటిషన్లోనూ పోలీసులకు నోటీసులు జారీ చేశారు.
ఎన్నికల విధులపై నిర్లక్ష్యం.. 10 మందిపై కేసు నమోదు
ఈనాడు, హైదరాబాద్: ఎన్నికల విధులపై నిర్లక్ష్యం వహిస్తూ శిక్షణకు గైర్హాజరైన 10 మందిపై జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ చర్యలు తీసుకున్నారు. సైఫాబాద్ ఠాణాలో ప్రజా ప్రాతినిధ్య చట్టం- 1951లోని సెక్షన్ 134 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు బల్దియా గురువారం ప్రకటించింది. సహకారశాఖ జూనియర్ అసిస్టెంట్ సయ్యద్ ఇలియాస్ అహమ్మద్, ఓయూ సీనియర్ అసిస్టెంట్ జి.రవి, సహాయ ఆచార్యుడు డా.జె.కృష్ణయ్య, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ మజీద్ఖాన్, ఖాజీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మీర్జా నసీర్ బేగ్, పంజాగుట్ట డివిజన్ వాణిజ్య పన్నుల శాఖ డీఎస్టీఓ కె.నాగరాజు, కె.మధుసూదన్ కుమార్, బార్కస్ రెసిడెన్సియల్ పాఠశాల ఉపాధ్యాయుడు సయ్యద్ అబ్దుల్లా జుబేర్, జూనియర్ అసిస్టెంట్ కె.మహేశ్, రోడ్లు భవనాలశాఖ సీనియర్ అసిస్టెంట్ చిలివేరి శంతన్కుమార్లపై మొదటి దశ కింద కేసు నమోదు చేశామని, మరిన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయని రోనాల్డ్రాస్ వెల్లడించారు. గతంలో శిక్షణకు హాజరుకాని వారికి ఈ నెల 20న మళ్లీ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో పోలింగ్ సమయం పెంచిన ఈసీ
[ 01-05-2024]
తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం పెంచుతున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. -
తెలంగాణలో నిప్పులు చెరిగిన భానుడు
[ 01-05-2024]
రాష్ట్రంలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. -
భాజపా కుట్రను తిప్పికొట్టేందుకు పోరాడుతా: సీఎం రేవంత్రెడ్డి
[ 01-05-2024]
భాజపా కుట్రను తిప్పి కొట్టేందుకు కచ్చితంగా పోరాడుతానని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
[ 01-05-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్ల మూసివేతపై దుష్ప్రచారం చేసిన కేసులో భారాస నేత క్రిశాంక్, ఓయూ విద్యార్థి నాగేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
వంట ఆలస్యమైందని భార్య హత్య
[ 01-05-2024]
ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రం నుంచి నాలుగు రోజుల క్రితం నగరానికి వలసొచ్చిన ఆ కుటుంబం మనుగడ మూణ్నాళ్ల ముచ్చటైంది. వంట ఆలస్యంపై దంపతుల మధ్య తలెత్తిన వివాదంలో క్షణికావేశానికి లోనైన భర్త ఇటుకతో భార్య తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. -
దివ్యాంగుడిని చితకబాది.. వృద్ధురాలిపై దాడి
[ 01-05-2024]
తన సెల్ఫోన్ను ఓ వ్యక్తి తీసుకొని తిరిగివ్వడంలేదని ఫిర్యాదు చేయడమే ఆ దివ్యాంగుడు చేసిన పాపం. రెండు కాళ్లు పనిచేయని అతడిని కానిస్టేబుల్ దారుణంగా చితకబాదాడు. తన కుమారుడిని ఎందుకు కొట్టారని ప్రశ్నించిన అతని తల్లినీ వదల్లేదు. -
నా ఒక్క ఓటే కదా... అనుకుంటే ఎలా?
[ 01-05-2024]
‘నా ఒక్క ఓటే కదా.. వేయకపోతే ఏమవుతుంది’ చాలా మందిలో ఉన్న భావన ఇదే. ఓటు హక్కు ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రం వరకు వచ్చి ఓటు వేసేందుకు చాలామంది ఆసక్తి చూపించరు. ఇలా ప్రతి ఒక్కరు నా ఒక్క ఓటే కదానుకుంటే అనర్హులు అందలమెక్కే ప్రమాదం ఉందని భావించాలి. -
మొబైల్ కోసం వ్యక్తి దారుణ హత్య
[ 01-05-2024]
గుడిమల్కాపూర్లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 65 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. -
వడదెబ్బ చికిత్సలకు.. హీట్స్ట్రోక్ క్లినిక్లు
[ 01-05-2024]
ఎండలు మండిపోతున్నాయి. నిత్యం 40-42 డిగ్రీలు నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. సోమవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు 11 మంది మృత్యువాత పడ్డారు. -
ప్రేయసితో లాడ్జికి.. ప్రియుడి అనుమానాస్పద మృతి
[ 01-05-2024]
ప్రియురాలితో కలిసి ఓయో లాడ్జీలో బస చేసిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఎస్సార్నగర్ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై శ్రావణ్కుమార్ వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన హేమంత్ (28) ఇటుకల వ్యాపారం చేస్తున్నాడు. -
మనోళ్లే పనోళ్లు.. బినామీ వసూళ్లు
[ 01-05-2024]
ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలని రాజకీయ నాయకులు.. ఎవరికి ఓటేయాలని ఓటర్లు ఆలోచిస్తున్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగాల్లోని కొందరు అధికారులు మాత్రం.. ఎన్నికల ఏర్పాట్ల పనుల్లో మరోసారి సొమ్ము చేసుకోవడంపై దృష్టి సారించారు. -
సుడిగాలిలా చుట్టి రావలె
[ 01-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార గడువు మరో పదకొండు రోజుల్లో ముగియనుంది. మొన్నటి వరకు పూర్తిస్థాయిలో ప్రచారం చేయని అభ్యర్థులు ఇప్పుడు గడువు దగ్గరపడుతుండడంతో రాత్రిపగలూ ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. -
ఫలితాల్లో.. ‘పది’ పోయింది
[ 01-05-2024]
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో హైదరాబాద్ జిల్లా కిందకు దిగింది. 33 జిల్లాల్లో కింది నుంచి నాలుగో స్థానంలో నిలిచింది. ఇదే వరుసలో రంగారెడ్డి.. మేడ్చల్ జిల్లాలు నిలబడ్డాయి. -
కాలు కదలాలంటే.. డబ్బులు చేతిలో పడాల్సిందే!
[ 01-05-2024]
ప్రధాన పార్టీలు నిర్వహించే ర్యాలీలు, కూడళ్ల సమావేశాలకు జనం తరలింపు పెద్ద తలనొప్పిగా మారుతోంది. నగరంలో సభలు, సమావేశాలు, కూడళ్ల జాతరకు జనం స్వచ్ఛందంగా రావాలంటే కష్టమే. -
ఎర్లీబర్డ్లో రూ.820 కోట్ల పన్ను వసూలు
[ 01-05-2024]
ఆర్థిక సంవత్సరం(2024-25) మొదటి నెలలోనే జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం దాదాపు 40శాతం ఆస్తిపన్నును వసూలు చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30 వరకు గ్రేటర్ పరిధిలో ఎర్లీబర్డ్ పథకం అమలైంది. -
డిటోనేటర్ పరిశ్రమలో భారీ పేలుడు: ఒకరి మృతి
[ 01-05-2024]
డిటోనేటర్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు పేలి ఓ కార్మికుడు సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదం సోమవారం రాత్రి జరిగినా, పరిశ్రమ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోకి వస్తుందని..మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోలీసులకు తెలియకుండా జాగ్రత్తపడింది. -
కన్నడిగులపై కన్ను
[ 01-05-2024]
నగరంలోని కన్నడిగులను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ మొదలుపెట్టింది. అక్కడి నేతలను రంగంలోకి దించడానికి కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఇప్పుడూ ప్రచారం చేయాలని కర్ణాటక నేతలను టీపీసీసీ నాయకులు కోరుతున్నారు. -
రాజకీయక్షేత్రం సకుటుంబ రాజకీయ ప్రచారం
[ 01-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులే కాదు..అభ్యర్థుల కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. అభ్యర్థి గెలుపే లక్ష్యంగా సొంత బాణీతో ఆకట్టుకుంటున్నారు. -
కొండంత న్యాయం నావైపే
[ 01-05-2024]
చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఉప్పర్పల్లిలోని రాజేంద్రనగర్ కోర్టుల సముదాయంలో న్యాయవాదులను కలిసి సహకారం అభ్యర్థించారు. -
భేషజాలు వద్దు.. సమన్వయంతో పనిచేయండి
[ 01-05-2024]
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భేషజాలకు పోకుండా ముఖ్యులు సమన్వయంతో పనిచేయాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్మున్షీ అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో మెదక్ అభ్యర్థి నీలం మధు కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. -
బాబూజీ మార్గదర్శకాలు.. ఉజ్వల భవిష్యత్తుకు నాంది
[ 01-05-2024]
బాబూజీ మహరాజ్ మార్గదర్శకాలు.. ప్రతి తరంలో ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతాయని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. -
నాగన్పల్లి పాఠశాలలో శతశాతం ఉత్తీర్ణత
[ 01-05-2024]
ఇబ్రహీంపట్నం మండలం నాగన్పల్లిలోని రామోజీ ఫౌండేషన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులు శత శాతం ఉతీర్ణులయ్యారు. 2018 వరకు ఈ గ్రామంలో శిథిలమైన ఇరుకైన 4గదుల్లో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల సాగేది. -
భారాస కథ ముగిసింది.. భవిష్యత్తు అంతా కాంగ్రెస్దే: వీర్లపల్లి
[ 01-05-2024]
తెలంగాణలో భారాస కథ ముగిసిందని, ఇక భవిష్యత్తు అంతా కాంగ్రెస్దే అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్కు తరలివస్తున్నారని, పార్టీలోకి ఎవరు వచ్చినా ఘనంగా స్వాగతిస్తామన్నారు. -
భాజపాతోనే రైతు సంక్షేమం: విశ్వేశ్వర్రెడ్డి
[ 01-05-2024]
భాజపాతోనే దేశంలోని రైతులందరికీ సంక్షేమం దక్కుతుందని ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. చేవెళ్లలో మంగళవారం నిర్వహించిన భాజపా కిసాన్మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులను రాజు చేయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. -
కేంద్రంలోనూ అధికారంలోకి రావడం ఖాయం: కాంగ్రెస్
[ 01-05-2024]
ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పాలించిన భాజపా, భారాసలకు ఇవే చివరి ఎన్నికలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొర్ర జ్ఞానేశ్వర్ముదిరాజ్ అన్నారు. -
మళ్లీ నిరాశే..
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో వికారాబాద్ జిల్లా మళ్లీ అట్టడుగున నిలిచింది. గతేడాదిలాగే ఈసారీ 33వ స్థానంతో నిరాశ పరిచింది. గతేడాది కంటే ఉత్తీర్ణత 6 శాతం పెరగడం మాత్రం ఊరట కలిగించే అంశం. 2022-23 విద్యాసంవత్సరంలో 59.46 శాతం పాస్ కాగా.. ఈసారి(2023-24)లో 65.10 శాతం నమోదైందని సర్ది చెబుతున్నారు. -
మాదిగలు ఏ పార్టీలో ఉన్నా భాజపాకే ఓటేయండి: మందకృష్ణ
[ 01-05-2024]
-
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తేనే రాష్ట్రం సుభిక్షం
[ 01-05-2024]
మతతత్వ పార్టీల మాటలు నమ్మరాదని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని శాసన సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. మంగళవారం మోమిన్పేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. -
ఐపీఎల్ ఒరవడి.. అభిమాన సందడి
[ 01-05-2024]
కొండాపూర్లోని శరత్సిటీ క్యాపిటల్ మాల్లో మంగళవారం ఐపీఎల్ క్రికెటర్లు సందడి చేశారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్కుమార్రెడ్డి, ఉనద్కత్, నటరాజన్ విచ్చేసి అభిమానులతో ఉత్సాహంగా గడిపారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు - తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
-
నీ డెబ్యూ నాటికి నేనింకా చెడ్డీలతోనే ఉండుంటా: మిశ్రాతో రోహిత్
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
-
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km