అరచేతిలో సమగ్ర సమాచారం
ప్రలోభాలకు లొంగకుండా, నైతికంగా, నిర్భయంగా ఓటేసేందుకు ఎన్నికల సంఘం పలు సంస్కరణలు అమలు చేస్తోంది.
ఓటరు గైడ్ పుస్తకాల పంపిణీ
పెద్దపల్లిలోని బంధంపల్లిలో ఓటరు గైడ్ పంపిణీ చేస్తున్న బీఎల్వో
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్: ప్రలోభాలకు లొంగకుండా, నైతికంగా, నిర్భయంగా ఓటేసేందుకు ఎన్నికల సంఘం పలు సంస్కరణలు అమలు చేస్తోంది. పోలింగ్ శాతం గణనీయంగా పెంచే మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా లోక్సభ ఎన్నికల్లో ‘ఓటరు గైడ్’ విధానాన్ని తీసుకొచ్చింది. గత శాసనసభ ఎన్నికల్లో దీన్ని ప్రవేశ పెట్టినప్పటికీ తాజాగా స్వల్ప మార్పులతో ఓటరు నమోదు నుంచి ఓటు హక్కు వినియోగించే వరకు సమగ్ర సమాచార వివరాలు అందులో ముద్రించారు. బీఎల్వోలు ఇంటికొక పుస్తకం పంపిణీ చేస్తున్నారు. మరోవైపు సిస్టమెటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ బృందాలు రంగంలోకి దిగాయి. ఫ్లెక్సీలు, బ్యానర్లలతో ఓటర్లలో చైతన్యం తీసుకొస్తున్నారు.
మంచి నాయకులను ఎన్నుకోవాలనే..
దేశ భవిష్యత్తును మార్చేశక్తి ఓటుకు మాత్రమే ఉందని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే సందేశంతో 15 పేజీల పుస్తకాన్ని ఎన్నికల సంఘం ముద్రించింది. మద్యానికి, డబ్బులకు, బహుమతులకు ఓటును అమ్ముకోకుండా స్వేచ్ఛగా ఓటును వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకోవాలనే భావన కలిగించేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి, సీ విజిల్ యాప్, 1950 టోల్ ఫ్రీ నంబర్ ఇతరత్రా యాప్ల వివరాలతో రూపొందించారు. ‘చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం ఓటు, అప్రమత్తత-పరిశీలన-నిజాయతీ గల ఓటరు’ అనే నినాదాలతో అందుబాటులో ఉన్నాయి.
ఆలోచన పెంచి.. చైతన్యం కలిగించి
ఓటరు గైడ్ (మార్గదర్శి) పుస్తకంలో ఓటు హక్కు మొదలు, పోలింగ్ కేంద్రాల్లో వసతులు, సిబ్బంది, ఓటు హక్కు వినియోగం, వేలికి సిరా చుక్క పెట్టడం, ఈవీఎం యంత్రాల బీప్ శబ్దం, వీవీప్యాట్లో ఓటు నమోదైందో లేదో ఇలా ప్రతి ఓటింగ్ ప్రక్రియను సులువుగా తెలుసుకునేలా దీన్ని ముద్రించారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతాననే ప్రతిజ్ఞ అందులో ఉంది. పలు కారణాలతో ఓటింగ్కు దూరమవుతున్న ఓటర్లలో ఆలోచన నింపి, ఓటింగ్ శాతం పెంచే లక్ష్యం విధించారు. ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ లోక్సభ పరిధిలో 2,189, పెద్దపల్లి 1,850, నిజామాబాద్లో 1,807 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఓటరు గైడ్ పుస్తకాలను బీఎల్వోలు పంపిణీ చేస్తున్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి సరిపడా మార్గదర్శి పుస్తకాలు వచ్చాయి. ముందస్తుగా పోలింగ్ కేంద్రాల సమాచారంతో ఓటేసేందుకు వసతులు, ఇతర సందేశాత్మక పుస్తకాలతో పోలింగ్ శాతం పెరగనుందని అధికారులు భావిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో కంటే లోక్సభలో ఓటింగ్ శాతం తగ్గడంపై అన్ని మార్గాల్లో చైతన్యం ముమ్మరం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరిలో ఉండేదెవరు?
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీలో ఉండేదెవరో సోమవారం తేలిపోనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 3 గంటల వరకే సమయం ఉండటంతో ఎవరు బరిలో ఉంటారు..? ఎవరు నామపత్రాలు వెనక్కి తీసుకుంటారో నేడు వెల్లడి కానుంది. -
44 రోజులు.. రూ.9.71 కోట్లు
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. -
ఉపాధి పని... ఉదయపు నడక
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార సరళి మారింది. ఎండలు మండుతుండటంతో ఇంటింటికీ తిరగడానికి నాయకులు జంకుతున్నారు. ఎక్కువ మంది ఓటర్లు ఉండే ప్రాంతాలకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. -
ఓట్లు అడిగే హక్కు వినోద్కే ఉంది
[ 29-04-2024]
కరీంనగర్లో అభివృద్ధి చేసిన వినోద్కుమార్కే ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఉందని.. ఇతర పార్టీల అభ్యర్థులకు లేదని భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
ప్రజా శ్రేయస్సు పట్టని కాంగ్రెస్, భారాస
[ 29-04-2024]
కాంగ్రెస్, భారాసలు ఏనాడూ ప్రజల కోసం పని చేయలేదని ఎంపీ బండి సంజయ్కుమార్ అన్నారు. -
పదేళ్ల భాజపా పాలనలో ప్రగతి శూన్యం
[ 29-04-2024]
కేంద్రంలో కొనసాగిన పదేళ్ల భాజపా పాలనలో ప్రగతి శూన్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. -
ఆగని అక్రమ తవ్వకాలు..
[ 29-04-2024]
రాజకీయ నాయకుల అండదండలు.. అధికారుల నిర్లక్ష్యం వెరసి అక్రమ మట్టి తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. -
ధాన్యం తూకాల్లో వేగం ఏదీ?
[ 29-04-2024]
జిల్లాలో వరి కోతలు 80 శాతం పూర్తయ్యాయి. వచ్చే నెల 15 నాటికి కోతలు ముగుస్తాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. -
రాష్ట్రానికి గులాబీ జెండా అవసరం
[ 29-04-2024]
గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు భారాసకు ఉన్న శక్తి, క్యాడర్ ఏ జాతీయ పార్టీకి లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి గులాబీ జెండా అవసరమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. -
ఓటుహక్కు వినియోగంలో మహిళా చైతన్యం
[ 29-04-2024]
2019 సార్వత్రిక ఎన్నికల్లో జగిత్యాల జిల్లాలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ సంఖ్యలో ఓటేశారు. -
బరిలో ఇద్దరు వారసులు
[ 29-04-2024]
స్థానిక సంస్థల నుంచి లోక్సభ ఎన్నికల వరకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల వారసులు బరిలో నిలుస్తుంటారు. -
టోల్ఫ్రీ నంబరు ఎలా వచ్చిందంటే..!
[ 29-04-2024]
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM