వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి
అనారోగ్యం అధిగమించలేక, ఆర్థిక కారణాలు తట్టుకోలేక మనస్తాపంతో జిల్లాకు చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనలు ఆయా కుటుంబాల్లో విషాదం నింపాయి.
అనారోగ్యం అధిగమించలేక, ఆర్థిక కారణాలు తట్టుకోలేక మనస్తాపంతో జిల్లాకు చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనలు ఆయా కుటుంబాల్లో విషాదం నింపాయి.
కడుపు నొప్పి తాళలేక యువకుడు..
ఖమ్మం నేరవిభాగం, న్యూస్టుడే: కడుపునొప్పి తాళలేక ఖమ్మం నగరంలోని ప్రకాశ్నగర్కు చెందిన యువకుడు చెన్నా కరుణాకర్(24) ఉరివేసుకుని బలన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామీణ మండలం వెంకటగిరి క్రాస్రోడ్డు వద్ద కరుణాకర్ గాలిమిషన్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. వెంటనే చుట్టుపక్కల వారి సహాయంతో కుటుంబ సభ్యులు తలుపులు తీయగా అప్పటికే కరుణాకర్ మృతి చెందాడు. కరుణాకర్కు ఆరు నెలల క్రితమే వివాహం అయింది. మృతుని తండ్రి వీరబాబు ఫిర్యాదు మేరకు మూడో పట్టణ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
క్యాన్సర్తో బాధపడుతూ వృద్ధురాలు..
ఖమ్మం గ్రామీణం, న్యూస్టుడే: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఉమ్మినేని రామలక్ష్మి(72) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. ఖమ్మం కవిరాజనగర్లో నివాసం ఉండే ఉమ్మినేని రంగయ్య సతీమణి రామలక్ష్మి క్యాన్సర్ బారిన పడ్డారు. ఈమెకు విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈక్రమంలో ఆమె మానసికంగా బాధపడుతుండగా, భర్త రంగయ్య ధైర్యం చెబుతున్నారు. బుధవారం ఖమ్మం గ్రామీణం మండలంలోని మారెమ్మగుడికి వెళ్లి వస్తానంటూ ఇంట్లో నుంచి బయలుదేరిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. మారెమ్మగుడి వద్ద గుర్తుతెలియని పురుగులమందు తాగి పడిపోయి ఉండగా మధ్యాహ్నం సమయంలో 108 వాహన సిబ్బంది ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మనస్తాపంతో వివాహిత..
రఘునాథపాలెం, న్యూస్టుడే: మద్యానికి బానిసై మనస్తాపంతో పురుగుమందు తాగి చికిత్సపొందుతూ వివాహిత మృతి చెందిన సంఘటన రఘునాథపాలెం మండలం పాపటపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రవి కథనం ప్రకారం... గోగుల సత్యవతి(42) గత కొన్నాళ్లుగా మద్యానికి బానిసైంది. ఈక్రమంలో మంగళవారం భర్త సహదేవ మందలించడంతో పొలానికి వెళ్లి గుర్తుతెలియని పురుగుమందు తాగి స్పృహతప్పి పడిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందింది. ఆమె కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ వివరించారు.
తన కార్యాలయంలోనే మిరప వ్యాపారి..
ఖమ్మం నేరవిభాగం, న్యూస్టుడే: పురుగులమందు తాగి మిరప వ్యాపారి బలన్మరణానికి పాల్పడిన సంఘటన ఖమ్మం నగరంలోని జమలాపురం పార్కు ప్రాంతంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్నగర్కు చెందిన ఏపూరి కృష్ణయ్య(55) గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో మిర్చి వ్యాపారం చేస్తున్నాడు. మూడో నగర ప్రాంతంలోని బోసుబొమ్మ సెంటర్లో దగ్గర జమలాపురం పార్కు సమీపంలోని తన కార్యాలయంలో పురుగుల మందు తాగి బలన్మరణానికి పాల్పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటనపై బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో పట్టణ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందరూ రావాల్సిందే.. నిబంధనలు పాటించాల్సిందే
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటికే ఈవీఎంలు, సిబ్బందిని సిద్ధం చేసి ఆయా శాసనసభ నియోజకవర్గాలకు కేటాయించారు. -
ఈ శోకం తీర్చలేనిది
[ 10-05-2024]
ఆ ఇద్దరు తల్లుల శోకం తీర్చలేనిది. అందులో ఓ మాతృమూర్తి తన భర్త చనిపోయాక పొట్టచేత పట్టుకుని ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వచ్చింది. గురుకులంలో చదువుతూ వేసవి సెలవుల్లో ఇంటికొచ్చిన చిన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవటాన్ని చూసి స్పృహతప్పి పడిపోయింది. -
ఐటీడీఏలకు రావాలి పూర్వవైభవం
[ 10-05-2024]
గిరిజనుల స్వయం ప్రతిపత్తిని కాపాడుతూనే.. షెడ్యూల్ ప్రాంతాల్లో అభివృద్ధి, ఆచార సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయంగా ఐటీడీఏలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా గిరిజనులకే కలెక్టరేట్గా పిలుచుకునే ఈ సంస్థలు రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో కొలువుదీరగా.. -
రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి: భట్టి
[ 10-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. ఎర్రుపాలెంలో గురువారం నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడారు. -
1,395 పాఠశాలలు, రూ.41.48 కోట్లు
[ 10-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనుల నిర్వహణకు సర్కారు ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’(ఏఏపీసీ)లను భాగస్వాములను చేస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సహకారంతోనే అన్ని వసతులు కల్పించడం ద్వారా బడుల బలోపేతం చేయాలన్న లక్ష్యం. -
ఆదరిస్తే అండగా నిలుస్తా: తాండ్ర
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు అండగా నిలుస్తానని భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కారేపల్లిలో గురువారం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. -
కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోవద్దు: పువ్వాడ
[ 10-05-2024]
కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోవద్దని, తాము అందించిన సంక్షేమాన్ని గుర్తించి లోక్సభ ఎన్నికల్లో భారాసకు ఓటు వేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఆ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. -
రామాలయ అభివృద్ధిపై మంత్రి తుమ్మల సమాలోచనలు
[ 10-05-2024]
భద్రాచలం రామాలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. సోలార్ విద్యుత్తును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. -
భారాస పాలనలోనే ఇల్లెందు అభివృద్ధి: సత్యవతి రాథోడ్
[ 10-05-2024]
పదేళ్ల భారాస పాలనలోనే ఇల్లెందు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ లోక్సభ స్థానం భారాస అభ్యర్థి మాలోత్ కవితకు మద్దతుగా ఇల్లెందులో గురువారం -
బంగారు పర్వదినం
[ 10-05-2024]
అక్షయ తృతీయ అంటే బంగారు పర్వదినం. వైశాఖ మాసంలో వచ్చే మంచిరోజు. సింహాచలంలో వరాహ నరసింహస్వామికి చందనోత్సవం నిర్వహించే విశేషమైన రోజు. -
పాలేరు మళ్లీ పోటెత్తాలి..
[ 10-05-2024]
సమర్థ నాయకత్వాన్ని చట్టసభలకు పంపించే వజ్రాయుధం ఓటు.. 18 ఏళ్లు పైబడి జీవించి ఉన్న ప్రతీ పౌరుడికీ భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. -
భాజపాకు మాదిగలు ఓటేయొద్దు
[ 10-05-2024]
అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేస్తామని, రిజర్వేషన్లు తీసేస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్న భాజపాకు మాదిగలు ఓటు వేయవద్దని మాదిగ ఐకాస వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ నేత డా.పిడమర్తి రవి పిలుపునిచ్చారు. -
దేవుడి తోడు.. మేం ఓటెయ్యం!
[ 10-05-2024]
‘ఎన్నికలొచ్చిన ప్రతిసారీ హామీలివ్వటం.. ఆపై ప్రతిజాప్రతినిధులు మోసగించటం షరామామూలైంది. మా గ్రామాన్ని అధికారులు, నేతలెవరూ పట్టించుకోవడం లేదు. అందుకే.. దేవుడిపై ఒట్టు.. -
ఎన్నికలను బహిష్కరిస్తాం
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలను బహిష్కరించాలని పెద్దవెంకటాపురం గ్రామస్థులు గురువారం తీర్మానించారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఎన్నికలప్పుడు వచ్చే నాయకులు తర్వాత తమవైపు కన్నెత్తి చూడటం లేదని వాపోయారు. -
ఎన్నికల వేళ మందుపాతరల దడ..!
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ మావోయిస్టుల మందుపాతరల ఏర్పాటుతో ఏజెన్సీలో దడ పుడుతోంది. భద్రాచలం ఏజెన్సీలోని అత్యంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈనెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు
తాజా వార్తలు (Latest News)
-
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరు
-
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
-
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న