కాంగ్రెస్ గూటికి మట్టా దయానంద్
సత్తుపల్లికి చెందిన భారాస నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్విజయ్కుమార్, మట్టా రాగమయి దంపతులు భారాసకు రాజీనామా చేసి శుక్రవారం పెద్దఎత్తున తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
సత్తుపల్లి, న్యూస్టుడే: సత్తుపల్లికి చెందిన భారాస నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్విజయ్కుమార్, మట్టా రాగమయి దంపతులు భారాసకు రాజీనామా చేసి శుక్రవారం పెద్దఎత్తున తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎంపీ రేణుకాచౌదరి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమక్షంలో చేరారు. మట్టా ముఖ్య అనుచరులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాసరావు, దొడ్డా శ్రీనివాసరావు, ఎండీ కమల్పాషా, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, మొరిశెట్టి సాంబశివరావు, నరుకుళ్ల అప్పారావు, రాంబాబు, మారేశ్వరరావు, జీవన్కుమార్, శ్రీనివాస్రెడ్డి, ఎండీ ఫక్రుద్దీన్, ఫయాజ్, సాయి, కిశోర్, నరసింహారావు, పుల్లయ్య, సర్వోత్తమరెడ్డి తదితరులు కాంగ్రెస్ గూటికి చేరారు.
వంద కార్లతో హైదరాబాద్కు.. డాక్టర్ మట్టా దయానంద్, రాగమయి దంపతులతోపాటు నియోజకవర్గం నుంచి సుమారు వంద కార్లలో 400 మందితో భారీ కాన్వాయ్గా హైదరాబాద్కు తరలివెళ్లారు. నాడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న మట్టా దయానంద్ 2014లో వైకాపా నుంచి తెదేపా అభ్యర్థి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యపై పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొంగులేటితో కలిసి తెరాసలో చేశారు. 2018 ఎన్నికల్లో సత్తుపల్లి తెరాస సీటును ఆశించి భంగపడ్డారు. మాజీ ఎంపీ పొంగులేటి పలుమార్లు భాజపా నాయకులతో సంప్రదింపులు చేయడంతో ఆయన భాజపాలో చేరతారని భావించి పొంగులేటికి దూరమయ్యారు. సీఎం కేసీఆర్ సైతం సిట్టింగులకే సీట్లు ఇస్తామని పలుమార్లు ప్రకటించడంతో పార్టీకి రాజీనామా చేసి నియోజకవర్గంలోని ఆయన అభిమానులు, అనుచరుల కోరిక మేరకు తాజాగా మాజీ ఎంపీ రేణుకాచౌదరి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందరూ రావాల్సిందే.. నిబంధనలు పాటించాల్సిందే
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటికే ఈవీఎంలు, సిబ్బందిని సిద్ధం చేసి ఆయా శాసనసభ నియోజకవర్గాలకు కేటాయించారు. -
ఈ శోకం తీర్చలేనిది
[ 10-05-2024]
ఆ ఇద్దరు తల్లుల శోకం తీర్చలేనిది. అందులో ఓ మాతృమూర్తి తన భర్త చనిపోయాక పొట్టచేత పట్టుకుని ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వచ్చింది. గురుకులంలో చదువుతూ వేసవి సెలవుల్లో ఇంటికొచ్చిన చిన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవటాన్ని చూసి స్పృహతప్పి పడిపోయింది. -
ఐటీడీఏలకు రావాలి పూర్వవైభవం
[ 10-05-2024]
గిరిజనుల స్వయం ప్రతిపత్తిని కాపాడుతూనే.. షెడ్యూల్ ప్రాంతాల్లో అభివృద్ధి, ఆచార సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయంగా ఐటీడీఏలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా గిరిజనులకే కలెక్టరేట్గా పిలుచుకునే ఈ సంస్థలు రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో కొలువుదీరగా.. -
రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి: భట్టి
[ 10-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. ఎర్రుపాలెంలో గురువారం నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడారు. -
1,395 పాఠశాలలు, రూ.41.48 కోట్లు
[ 10-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనుల నిర్వహణకు సర్కారు ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’(ఏఏపీసీ)లను భాగస్వాములను చేస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సహకారంతోనే అన్ని వసతులు కల్పించడం ద్వారా బడుల బలోపేతం చేయాలన్న లక్ష్యం. -
ఆదరిస్తే అండగా నిలుస్తా: తాండ్ర
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు అండగా నిలుస్తానని భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కారేపల్లిలో గురువారం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. -
కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోవద్దు: పువ్వాడ
[ 10-05-2024]
కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోవద్దని, తాము అందించిన సంక్షేమాన్ని గుర్తించి లోక్సభ ఎన్నికల్లో భారాసకు ఓటు వేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఆ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. -
రామాలయ అభివృద్ధిపై మంత్రి తుమ్మల సమాలోచనలు
[ 10-05-2024]
భద్రాచలం రామాలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. సోలార్ విద్యుత్తును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. -
భారాస పాలనలోనే ఇల్లెందు అభివృద్ధి: సత్యవతి రాథోడ్
[ 10-05-2024]
పదేళ్ల భారాస పాలనలోనే ఇల్లెందు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ లోక్సభ స్థానం భారాస అభ్యర్థి మాలోత్ కవితకు మద్దతుగా ఇల్లెందులో గురువారం -
బంగారు పర్వదినం
[ 10-05-2024]
అక్షయ తృతీయ అంటే బంగారు పర్వదినం. వైశాఖ మాసంలో వచ్చే మంచిరోజు. సింహాచలంలో వరాహ నరసింహస్వామికి చందనోత్సవం నిర్వహించే విశేషమైన రోజు. -
పాలేరు మళ్లీ పోటెత్తాలి..
[ 10-05-2024]
సమర్థ నాయకత్వాన్ని చట్టసభలకు పంపించే వజ్రాయుధం ఓటు.. 18 ఏళ్లు పైబడి జీవించి ఉన్న ప్రతీ పౌరుడికీ భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. -
భాజపాకు మాదిగలు ఓటేయొద్దు
[ 10-05-2024]
అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేస్తామని, రిజర్వేషన్లు తీసేస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్న భాజపాకు మాదిగలు ఓటు వేయవద్దని మాదిగ ఐకాస వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ నేత డా.పిడమర్తి రవి పిలుపునిచ్చారు. -
దేవుడి తోడు.. మేం ఓటెయ్యం!
[ 10-05-2024]
‘ఎన్నికలొచ్చిన ప్రతిసారీ హామీలివ్వటం.. ఆపై ప్రతిజాప్రతినిధులు మోసగించటం షరామామూలైంది. మా గ్రామాన్ని అధికారులు, నేతలెవరూ పట్టించుకోవడం లేదు. అందుకే.. దేవుడిపై ఒట్టు.. -
ఎన్నికలను బహిష్కరిస్తాం
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలను బహిష్కరించాలని పెద్దవెంకటాపురం గ్రామస్థులు గురువారం తీర్మానించారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఎన్నికలప్పుడు వచ్చే నాయకులు తర్వాత తమవైపు కన్నెత్తి చూడటం లేదని వాపోయారు. -
ఎన్నికల వేళ మందుపాతరల దడ..!
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ మావోయిస్టుల మందుపాతరల ఏర్పాటుతో ఏజెన్సీలో దడ పుడుతోంది. భద్రాచలం ఏజెన్సీలోని అత్యంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈనెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు
తాజా వార్తలు (Latest News)
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..