పోడు పట్టాలతో పది ప్రయోజనాలు
పోడు సాగు రైతులకు అందిస్తున్న పట్టాల ద్వారా పది ప్రయోజనాలు చేకూరుతాయని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
మంత్రి హరీశ్రావు
వైద్య కళాశాలలో భవనాలను పరిశీలిస్తున్న మంత్రులు, ఎంపీలు, కలెక్టర్ తదితరులు
ఖమ్మం కార్పొరేషన్, న్యూస్టుడే: పోడు సాగు రైతులకు అందిస్తున్న పట్టాల ద్వారా పది ప్రయోజనాలు చేకూరుతాయని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి పలువురికి పోడు పట్టాలను శుక్రవారం అందజేశారు. మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ జిల్లాలో 6,589 మంది రైతులకు 13,139.05 ఎకరాలకు సంబంధించిన హక్కుపత్రాలు అందజేస్తున్నామన్నారు. పోడు పట్టాల ద్వారా రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, తదితర పథకాలు వర్తిస్తాయని చెప్పారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ధాన్యం సరఫరా చేసేందుకు తెలంగాణ సిద్ధమయ్యిందని, కేసీఆర్ అమలుచేస్తున్న పథకాల ద్వారా రాష్ట్రం ధాన్యాగారంగా మారిందని పేర్కొన్నారు. జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ఎంపీ నామా నాగేశ్వరరావు ఎన్నిసార్లు విన్నవించినా కేంద్రం స్పందించలేదన్నారు. వైరా, ఇల్లెందులోని ప్రభుత్వ ఆసుపత్రులను వంద పడకల దవాఖానాలుగా మార్చేందుకు యత్నిస్తున్నామని వెల్లడించారు.
అత్యధిక లబ్ధి ఉమ్మడి జిల్లా వాసులకే..
పోడు పట్టాలతో అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం వాసులకే లబ్ధి కలుగుతోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతగా పది నియోజకవర్గాల్లోనూ భారాసను గెలిపించాలని ప్రజలను కోరారు. సీˆతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి సాగునీటిని అందిస్తామని పేర్కొన్నారు. ఖమ్మం నగరాన్ని రూ.కోట్లతో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒకేరోజు 1.55లక్షల మందికి భూపట్టాలు ఇచ్చి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారన్నారు. జిల్లాకు వైద్య కళాశాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయకపోయినా సీఎం ఏర్పాటు చేశారని తెలిపారు. అంతకుముందు గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ వేద సాయిచంద్ చిత్రపటానికి మంత్రులు నివాళి అర్పించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఆర్థిక శాఖ ప్రిన్పిల్ సీఎస్ రామకృష్ణారావు, కలెక్టర్ గౌతమ్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు లావుడ్యా రాములునాయక్, హరిప్రియ, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల శేషగిరిరావు, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా ఛైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఐటీడీఏ పీఓ పోట్రు గౌతమ్, కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్, రైబస జిల్లా సమన్వయకర్త నల్లమల వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ పాలెపు విజయ పాల్గొన్నారు.
వైద్య కళాశాల ఆధునికీకరణ పనుల పరిశీలన
ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్టుడే: ఖమ్మంలో ప్రభుత్వ వైద్య కళాశాల పనులను 2023-24 విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేయాలని మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. కళాశాల భవన ఆధునికీకరణ పనులను మంత్రి పువ్వాడ, ఎంపీలు నామా, వద్దిరాజుతో కలిసి పరిశీలించారు. 100 సీట్లతో తరగతులు నిర్వహించేందుకు సదుపాయాలను సమకూర్చాలని కలెక్టర్ గౌతమ్కు సూచించారు. అనంతరం ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఉద్యోగులు, వైద్యాధికారులతో కలిసి మంత్రులు ఫొటో దిగారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సీఎస్ రామకృష్ణారావు, సీపీ విష్ణువారియర్, ప్రిన్సిపల్ రాజేశ్వరరావు, సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ పాల్గొన్నారు.
ఖమ్మంలో పోడు పట్టాలు పంపిణీ చేస్తున్న రవాణా శాఖ మంత్రి అజయ్, చిత్రంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఎంపీలు నామా, వద్దిరాజు, ఎమ్మెల్యేలు రాములునాయక్, హరిప్రియ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాధితుడికి ఆర్థిక సహాయం
[ 29-04-2024]
కామేపల్లి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన కామ రాంబాబు కొద్ది రోజుల నుంచితీవ్రమైన జ్వరం, కామెర్ల వ్యాధితో బాధపడుతున్నాడు. -
భారాస హయాంలో అన్ని రంగాల్లోనూ అవినీతే: జేపీ నడ్డా
[ 29-04-2024]
దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ భాజపాయేనని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. -
ఇల్లందులో రూ.1.5 లక్షల నగదు పట్టివేత
[ 29-04-2024]
ఇల్లందు - ఖమ్మం రహదారిపై లలితాపురం చెక్పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. -
మూడు నెలలు ముహూర్తాలే లేవు!
[ 29-04-2024]
రానున్న మూడు నెలల పాటు శుభ ముహూర్తాలు లేవని వేద పండితులు చెబుతున్నారు. మూఢాల కారణంగా వివాహాది శుభకార్యాలు, నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు, శంకుస్థాపనలు వంటి శుభ కార్యక్రమాలను జరపడం కుదరదని చెబుతున్నారు. -
ప్రచారం ఉద్ధృతం
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో మళ్లీ పాగా వేయాలని భారాస సర్వశక్తులు ఒడ్డుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత: నామా
[ 29-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నారాయణపురంలో ఆదివారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. -
రాహుల్గాంధీని ప్రధాని చేయటమే లక్ష్యం: పొంగులేటి
[ 29-04-2024]
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని ప్రధాని చేయటమే లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మారేదెన్నడు.. అగ్గి ఆరేదెన్నడు?
[ 29-04-2024]
వేసవి అనగానే మనల్ని కలవరపెట్టేది అగ్ని ప్రమాదాలు. నిప్పు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో దాని వినియోగంలో ఏమరపాటు అంతే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. -
3న నామినేషన్ వేస్తా: తీన్మార్ మల్లన్న
[ 29-04-2024]
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) ఖమ్మంలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. -
చుకుబుకు రైలు.. గుండెల్లో గుబులు
[ 29-04-2024]
తెలంగాణలో రైల్వే అభివృద్ధికి దక్షిణ మధ్య రైల్వే చేపడుతున్న ఏర్పాట్లు జిల్లా రైతుల్లో ఆందోళనకు కారణమైంది. -
బాధితులకు భరోసా.. పోక్సో ఈ బాక్స్
[ 29-04-2024]
నిత్యం ఎక్కడో ఓ చోట బాలికలు, అభంశుభం తెలియని చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. -
తలరాతను మార్చే ఓట్లు తరలిపాయె..!
[ 29-04-2024]
రెండు లోక్సభ స్థానాల్లో తలరాతలను మార్చే కీలక ఓటు బ్యాంకు తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు తరలిపోయింది. విభజన సమయంలో మిగతా నియోజకవర్గాల ఓట్లు, సీట్లుపై స్పష్టత ఉన్నప్పటికీ ఐదు మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా ఏపీకి వెళ్లాయి. -
టీటీలో జిల్లా మేటి!
[ 29-04-2024]
క్రీడా పోటీలు ఎప్పుడు ఎక్కడ జరిగినా ఆ ప్రాంతంలో ఆయా క్రీడాంశంలో ఉన్న స్థితిగతుల్ని వివరిస్తుంది. ఆ అంశంలో సాధన చేస్తున్న క్రీడాకారుల ప్రతిభా పాటవాలు ఏ దశలో ఉన్నాయనే విషయాలను తేటతెల్లం చేస్తాయి. -
కిరాణా కొట్లలో మద్యం విక్రయాలు
[ 29-04-2024]
ఖమ్మం కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఓ కిరాణా దుకాణంలో మద్యం సీసాలు దొరికాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందు ఈ ప్రాంతంలో నాలుగు బెల్ట్ దుకాణాలు ఉండేవి. -
ధర బాగుంది.. ధాన్యం బయటే అమ్మేద్దాం!
[ 29-04-2024]
యాసంగిలో వరి అత్యధిక విస్తీర్ణం సాగైన జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం ఒకటి. ప్రాజెక్టులు, ప్రధాన చెరువులు, వాగులు, గొట్టపు బావుల కింద సుమారు 60 వేల ఎకరాల్లో నాట్లు వేశారు. -
భారాస పదేళ్ల పాలనలో అన్నీ వైఫల్యాలే: రఘురాంరెడ్డి
[ 29-04-2024]
పదేళ్ల భారాస పాలన వైఫల్యాలమయం అని ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఎద్దేవా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ