Telangana news: రెండు కోర్సులు.. పుష్కల అవకాశాలు..!
రానున్న విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో రెగ్యులర్ కోర్సులతో పాటు బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ ఆడ్మినిస్ట్రేషన్(బీబీఏ), బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(బీసీఏ) కోర్సులు తప్పనిసరి చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) యోచిస్తోంది.
కొత్తగూడెం విద్యావిభాగం, న్యూస్టుడే: రానున్న విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో రెగ్యులర్ కోర్సులతో పాటు బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ ఆడ్మినిస్ట్రేషన్(బీబీఏ), బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(బీసీఏ) కోర్సులు తప్పనిసరి చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) యోచిస్తోంది. ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ వీటిని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ రెండు కోర్సులకు మార్కెట్లో గణనీయమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి. ఏళ్లుగా ఈ కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ అవగాహన లేమితో బీఏ, బీకాం, బీఎస్సీ, బీజడ్సీ, ఇతర రెగ్యులర్ కోర్సులనే ఎక్కువ మంది అభ్యసిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఎస్ఆర్బీజీఎన్ఆర్, కవిత, ప్రియదర్శిని కళాశాలలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో మాత్రమే బీబీఏ, బీసీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు పోటీపడుతున్నారు. ఒక్కో కోర్సులో 60 మంది ప్రవేశం పొందవచ్చు. పీజీ స్థాయిలో ఎంబీఏ చేయాలనుకునేవారు బీబీఏ, ఎంసీఏ అభ్యసించాలనుకునేవారు బీసీఏను ఎంపిక చేసుకుంటున్నారు.
బీబీఏ అభ్యసిస్తే..
వ్యాపార నిర్ణయాలు తీసుకోవటం, నాయకులుగా మారేందుకు బీబీఏ కోర్సు ఉపకరిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ వ్యాపారాల్లో అద్భుతమైన కెరీర్ పురోగతికి బాటలు వేస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే ట్రైనీ మేనేజర్, ఇతర అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాల్లో ప్రవేశించే వెసులుబాటు ఉంటుంది. సంస్థలు ఎలా పనిచేస్తాయనే అంశంపై బీబీఏ విద్యార్థులకు సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. పరిశ్రమను అర్థం చేసుకోవటానికి కావాల్సిన నైపుణ్యాలనూ ఈ కోర్సు అందిస్తుంది. స్వయం నిర్ణయానికి అవకాశం కల్పిస్తుంది.
బీసీఏ చదివితే..
కంప్యూటర్ అప్లికేషన్ల చుట్టూ సిలబస్ తిరుగుతుంది. బీసీఏ కోర్సు విద్యార్థులకు కంప్యూటర్ ఇన్నోవేషన్ పరిశ్రమల్లో అధిక డిమాండ్ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ సైన్సు రంగంలో సాంకేతిక మార్పులతో బీసీఏ డిగ్రీ ముందంజలో ఉంది.
ప్రస్తుతం నాలుగు డిగ్రీ కళాశాలల్లో బీబీఏ, బీసీఏ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు: 508
ఆర్థిక సంస్థలు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీలు, బ్యాంకులు, విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ రంగాల్లో ఎన్నో ఉపాధి అవకాశాలున్నాయి. డిగ్రీలో ప్రత్యేక కోర్సుల గురించి తెలుసుకొని ప్రవేశం పొందాను. సీనియర్లు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మా కళాశాలలో బీసీఏ కోర్సులో చేరేందుకు పోటీపడుతున్నారు. అన్ని కళాశాలల్లో ఈకోర్సులు అందుబాటులో వస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది.
సుహానిసాహు, బీసీఏ, ద్వితీయ సంవత్సరం, కొత్తగూడెం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇల్లందులో రూ.1.5 లక్షల నగదు పట్టివేత
[ 29-04-2024]
ఇల్లందు - ఖమ్మం రహదారిపై లలితాపురం చెక్పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. -
మూడు నెలలు ముహూర్తాలే లేవు!
[ 29-04-2024]
రానున్న మూడు నెలల పాటు శుభ ముహూర్తాలు లేవని వేద పండితులు చెబుతున్నారు. మూఢాల కారణంగా వివాహాది శుభకార్యాలు, నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు, శంకుస్థాపనలు వంటి శుభ కార్యక్రమాలను జరపడం కుదరదని చెబుతున్నారు. -
ప్రచారం ఉద్ధృతం
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో మళ్లీ పాగా వేయాలని భారాస సర్వశక్తులు ఒడ్డుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత: నామా
[ 29-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నారాయణపురంలో ఆదివారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. -
రాహుల్గాంధీని ప్రధాని చేయటమే లక్ష్యం: పొంగులేటి
[ 29-04-2024]
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని ప్రధాని చేయటమే లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మారేదెన్నడు.. అగ్గి ఆరేదెన్నడు?
[ 29-04-2024]
వేసవి అనగానే మనల్ని కలవరపెట్టేది అగ్ని ప్రమాదాలు. నిప్పు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో దాని వినియోగంలో ఏమరపాటు అంతే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. -
3న నామినేషన్ వేస్తా: తీన్మార్ మల్లన్న
[ 29-04-2024]
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) ఖమ్మంలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. -
చుకుబుకు రైలు.. గుండెల్లో గుబులు
[ 29-04-2024]
తెలంగాణలో రైల్వే అభివృద్ధికి దక్షిణ మధ్య రైల్వే చేపడుతున్న ఏర్పాట్లు జిల్లా రైతుల్లో ఆందోళనకు కారణమైంది. -
బాధితులకు భరోసా.. పోక్సో ఈ బాక్స్
[ 29-04-2024]
నిత్యం ఎక్కడో ఓ చోట బాలికలు, అభంశుభం తెలియని చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. -
తలరాతను మార్చే ఓట్లు తరలిపాయె..!
[ 29-04-2024]
రెండు లోక్సభ స్థానాల్లో తలరాతలను మార్చే కీలక ఓటు బ్యాంకు తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు తరలిపోయింది. విభజన సమయంలో మిగతా నియోజకవర్గాల ఓట్లు, సీట్లుపై స్పష్టత ఉన్నప్పటికీ ఐదు మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా ఏపీకి వెళ్లాయి. -
టీటీలో జిల్లా మేటి!
[ 29-04-2024]
క్రీడా పోటీలు ఎప్పుడు ఎక్కడ జరిగినా ఆ ప్రాంతంలో ఆయా క్రీడాంశంలో ఉన్న స్థితిగతుల్ని వివరిస్తుంది. ఆ అంశంలో సాధన చేస్తున్న క్రీడాకారుల ప్రతిభా పాటవాలు ఏ దశలో ఉన్నాయనే విషయాలను తేటతెల్లం చేస్తాయి. -
కిరాణా కొట్లలో మద్యం విక్రయాలు
[ 29-04-2024]
ఖమ్మం కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఓ కిరాణా దుకాణంలో మద్యం సీసాలు దొరికాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందు ఈ ప్రాంతంలో నాలుగు బెల్ట్ దుకాణాలు ఉండేవి. -
ధర బాగుంది.. ధాన్యం బయటే అమ్మేద్దాం!
[ 29-04-2024]
యాసంగిలో వరి అత్యధిక విస్తీర్ణం సాగైన జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం ఒకటి. ప్రాజెక్టులు, ప్రధాన చెరువులు, వాగులు, గొట్టపు బావుల కింద సుమారు 60 వేల ఎకరాల్లో నాట్లు వేశారు. -
భారాస పదేళ్ల పాలనలో అన్నీ వైఫల్యాలే: రఘురాంరెడ్డి
[ 29-04-2024]
పదేళ్ల భారాస పాలన వైఫల్యాలమయం అని ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఎద్దేవా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు