దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా కాంగ్రెస్ పాలన: తుమ్మల
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలుచేస్తూ ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిలో దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలిచేలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పాలన సాగిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి, మహబూబాబాద్ లోక్సభ స్థానం పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
మహబూబాబాద్లో సభా వేదిక ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు
మహబూబాబాద్, న్యూస్టుడే: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలుచేస్తూ ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిలో దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలిచేలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పాలన సాగిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి, మహబూబాబాద్ లోక్సభ స్థానం పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబాబాద్లోని డీసీసీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే రైతులకు పరిహారం వచ్చే పంటల బీమా పథకాన్ని భారాస సర్కారు అమలుచేయలేదని విమర్శించారు. రైతులకు రూ.2 లక్షల చొప్పున రుణమాఫీ, బోనస్ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చబోతోందని తెలిపారు. పంటల బీమాకు తమ ప్రభుత్వమే రూ.3వేల కోట్ల ప్రీమియం చెల్లిస్తుందన్నారు. ఈ ప్రక్రియను వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం నాటికి పూర్తిచేస్తామని చెప్పారు. మహబూబాబాద్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం హాజరవుతారని వెల్లడించారు. సీఎం బహిరంగ సభ జరిగే ఎన్టీఆర్ స్టేడియాన్ని మంత్రి పరిశీలించారు. అభ్యర్థి పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, భూక్యా మురళీనాయక్, రాంచంద్రునాయక్, తెల్లం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇల్లందులో రూ.1.5 లక్షల నగదు పట్టివేత
[ 29-04-2024]
ఇల్లందు - ఖమ్మం రహదారిపై లలితాపురం చెక్పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. -
మూడు నెలలు ముహూర్తాలే లేవు!
[ 29-04-2024]
రానున్న మూడు నెలల పాటు శుభ ముహూర్తాలు లేవని వేద పండితులు చెబుతున్నారు. మూఢాల కారణంగా వివాహాది శుభకార్యాలు, నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు, శంకుస్థాపనలు వంటి శుభ కార్యక్రమాలను జరపడం కుదరదని చెబుతున్నారు. -
ప్రచారం ఉద్ధృతం
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో మళ్లీ పాగా వేయాలని భారాస సర్వశక్తులు ఒడ్డుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత: నామా
[ 29-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నారాయణపురంలో ఆదివారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. -
రాహుల్గాంధీని ప్రధాని చేయటమే లక్ష్యం: పొంగులేటి
[ 29-04-2024]
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని ప్రధాని చేయటమే లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మారేదెన్నడు.. అగ్గి ఆరేదెన్నడు?
[ 29-04-2024]
వేసవి అనగానే మనల్ని కలవరపెట్టేది అగ్ని ప్రమాదాలు. నిప్పు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో దాని వినియోగంలో ఏమరపాటు అంతే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. -
3న నామినేషన్ వేస్తా: తీన్మార్ మల్లన్న
[ 29-04-2024]
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) ఖమ్మంలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. -
చుకుబుకు రైలు.. గుండెల్లో గుబులు
[ 29-04-2024]
తెలంగాణలో రైల్వే అభివృద్ధికి దక్షిణ మధ్య రైల్వే చేపడుతున్న ఏర్పాట్లు జిల్లా రైతుల్లో ఆందోళనకు కారణమైంది. -
బాధితులకు భరోసా.. పోక్సో ఈ బాక్స్
[ 29-04-2024]
నిత్యం ఎక్కడో ఓ చోట బాలికలు, అభంశుభం తెలియని చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. -
తలరాతను మార్చే ఓట్లు తరలిపాయె..!
[ 29-04-2024]
రెండు లోక్సభ స్థానాల్లో తలరాతలను మార్చే కీలక ఓటు బ్యాంకు తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు తరలిపోయింది. విభజన సమయంలో మిగతా నియోజకవర్గాల ఓట్లు, సీట్లుపై స్పష్టత ఉన్నప్పటికీ ఐదు మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా ఏపీకి వెళ్లాయి. -
టీటీలో జిల్లా మేటి!
[ 29-04-2024]
క్రీడా పోటీలు ఎప్పుడు ఎక్కడ జరిగినా ఆ ప్రాంతంలో ఆయా క్రీడాంశంలో ఉన్న స్థితిగతుల్ని వివరిస్తుంది. ఆ అంశంలో సాధన చేస్తున్న క్రీడాకారుల ప్రతిభా పాటవాలు ఏ దశలో ఉన్నాయనే విషయాలను తేటతెల్లం చేస్తాయి. -
కిరాణా కొట్లలో మద్యం విక్రయాలు
[ 29-04-2024]
ఖమ్మం కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఓ కిరాణా దుకాణంలో మద్యం సీసాలు దొరికాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందు ఈ ప్రాంతంలో నాలుగు బెల్ట్ దుకాణాలు ఉండేవి. -
ధర బాగుంది.. ధాన్యం బయటే అమ్మేద్దాం!
[ 29-04-2024]
యాసంగిలో వరి అత్యధిక విస్తీర్ణం సాగైన జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం ఒకటి. ప్రాజెక్టులు, ప్రధాన చెరువులు, వాగులు, గొట్టపు బావుల కింద సుమారు 60 వేల ఎకరాల్లో నాట్లు వేశారు. -
భారాస పదేళ్ల పాలనలో అన్నీ వైఫల్యాలే: రఘురాంరెడ్డి
[ 29-04-2024]
పదేళ్ల భారాస పాలన వైఫల్యాలమయం అని ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఎద్దేవా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!