logo

రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

బర్లగూడెం గ్రామంలో రాష్ట్రస్థాయిలో ఆర్ఆర్‌ఆర్‌ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్, బర్లగూడెం ఎక్సలెంట్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను శాసనసభ్యుడు కోరం కనకయ్య ప్రారంభించారు.

Published : 24 Apr 2024 16:42 IST

కామేపల్లి: బర్లగూడెం గ్రామంలో రాష్ట్రస్థాయిలో ఆర్ఆర్‌ఆర్‌ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్, బర్లగూడెం ఎక్సలెంట్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను శాసనసభ్యుడు కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన క్రీడాకారులను, నిర్వాహకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు, దృఢత్వం ఏర్పడటానికి, ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గింజల నరసింహారెడ్డి, మాజీ ఎంపీపీ మాలోతు సరిరామ్ నాయక్, ఎంపీటీసీ సభ్యులు, నల్లమోతు లక్ష్మయ్య, నిర్వాహకులు మాలోతు రాజేష్, మాలోత్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు