logo

కబ్జాదారులను తరిమికొట్టండి

ఎన్నికల్లో వైకాపాకు తగిన బుద్ధి చెప్పాలని, కబ్జాదారులను తరిమికొట్టాలని పాణ్యం తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ పిలుపునిచ్చారు.

Published : 16 Apr 2024 06:28 IST

చెన్నంశెట్టిపల్లెలో ప్రచారంలో పాల్గొన్న పాణ్యం తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి, మల్లెల రాజశేఖర్‌

ఓర్వకల్లు: ఎన్నికల్లో వైకాపాకు తగిన బుద్ధి చెప్పాలని, కబ్జాదారులను తరిమికొట్టాలని పాణ్యం తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ పిలుపునిచ్చారు. మండలంలో పలు గ్రామాల్లో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వెంకటాపురం, చెన్నంశెట్టిపల్లె, కొమరోలు, సోమయాజులపల్లె, గుడుంబాయి తండా, కాల్వ గ్రామాల్లో రోడ్‌షో జరిపి మాట్లాడారు. ఐదేళ్లైనా అభివృద్ధి ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉందన్నారు. తెదేపా వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి పాల్గొన్నారు.

 పార్టీలో పలువురి చేరిక: పలు గ్రామాల్లో వైకాపా నుంచి తెదేపాలో పలువురు భారీగా చేరారు. చెన్నంశెట్టిపల్లెలో వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో బోయ సిద్ధయ్య, వెంకటేశ్వర్లుతోపాటు 15కుటుంబాలు,  కొమరోలులో పాలకొలను సుధాకరరెడ్డి ఆధ్వర్యంలో 15 కుటుంబాలు పార్టీలో చేరాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు