వాహన మిత్ర ద్రోహి.. జగన్
బతకడానికి సొంత ఆటో కొనుక్కుని నడిపే ప్రతి ఆటో సోదరుడికీ మాట ఇస్తున్నా.. అధికారంలోకి వచ్చాక ప్రతి ఆటో డ్రైవరుకూ రూ.10 వేలు ఇస్తాం.. వాటితో ఇన్సురెన్సు, రోడ్డు ట్యాక్స్ కట్టుకోవచ్చు. చిన్నచిన్న రిపేర్లు చేయించుకోవచ్చు.
నంద్యాల పట్టణం, న్యూస్టుడే
‘‘బతకడానికి సొంత ఆటో కొనుక్కుని నడిపే ప్రతి ఆటో సోదరుడికీ మాట ఇస్తున్నా.. అధికారంలోకి వచ్చాక ప్రతి ఆటో డ్రైవరుకూ రూ.10 వేలు ఇస్తాం.. వాటితో ఇన్సురెన్సు, రోడ్డు ట్యాక్స్ కట్టుకోవచ్చు. చిన్నచిన్న రిపేర్లు చేయించుకోవచ్చు.
ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు జగన్ ఇచ్చిన హామీ.!!
‘‘గతేడాది వాహనమిత్ర కింద నాకు రూ.10 వేలు ఇచ్చారు. బీమా కింద రూ.7 వేలు, ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం రూ.4 వేలు, కాలుష్య ధ్రువీకరణ కోసం మరో రూ.వెయ్యి కట్టించుకున్నారు. రూ.12 వేలు కట్టించుకుని రూ.10 వేలు ఇచ్చారు. ఇచ్చే లెక్కకంటే తీసుకునే లెక్కనే ఎక్కువగా ఉంది.
ఓ ఆటో డ్రైవర్ ఆవేదన.!!
జగనన్న సీఎం అయితే ఏడాదికి రూ.10 వేలిస్తారని నమ్మి ఓట్లేసిన ఆటో డ్రైవర్లకు.. అప్పుడు తెలియలేదు ఆయన మాటలకు అర్థాలే వేరని. కుడిచేత్తో ఇస్తూ ఎడమచేత్తో వాతలు పెడతారని.. పన్నుల బాదుడుతో తమ జేబుల్ని ఖాళీ చేస్తారని ఊహించలేకపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఇంధన ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆయనిచ్చిన ఊకదంపుడు ఉపన్యాసాలు వినీ వినీ.. ఆయనొస్తే నిజంగానే ధరల్ని తగ్గిస్తారేమోనని ఆశపడ్డారు. చివరికి మోసపోయారు. జగన్ అధికారం చేపట్టిన తొలి ఏడాది నుంచే.. ఆటోడ్రైవర్లకు చుక్కలు చూపడం మొదలైంది. వాహనమిత్ర పథకాన్ని ప్రకటించిన తర్వాత.. ఆటో రోడ్డెక్కితే చాలు ఎడాపెడా కేసులతో బడుగుజీవుల ఆదాయానికి కత్తెర వేయడం ప్రారంభమైంది.
రూ.10 వేలు రావాలంటే రూ.19,200 కట్టాలి
వాహనమిత్ర లబ్ధిదారులు కచ్చితంగా తమ వాహనానికి బీమా చేయించాలి. ఇదే సమయంలో గతంలో కంటే బీమా మొత్తాన్ని పెంచేశారు. ఏడేళ్లు దాటిన ఆటోకు గ్రీన్ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. వాహనానికి ఎఫ్సీ (ఫిట్నెస్ సర్టిఫికెట్) తప్పనిసరి చేశారు. పథకం అమలు కాకముందు ఆటోకు రూ.3 వేలు బీమా చెల్లించేవారు. దీనిని ప్రస్తుతం రూ.8,800కు పెంచారు.
ఏడేళ్లు దాటిన ఆటోలకు ఏటా గ్రీన్ ట్యాక్స్ కింద ప్రస్తుతం రూ.400 కట్టించుకుంటున్నారు. ఇదే సమయంలో ఆటోకు ఎఫ్సీ చేయించుకోవాలంటే రూ.10 వేల వరకు ఖర్చవుతోంది. ఇవన్నీ ఉంటేనే పథకానికి అర్హులవుతారు.
‘‘ ఉదాహరణకు ఓ ఆటో డ్రైవరు వాహన మిత్ర పథాకానికి అర్హుడు కావాలంటే.. సొంత వాహనం కలిగి ఉండటంతోపాటు గ్రీన్ ట్యాక్స్ రూ.400, బీమా రూ.8,800 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.9,200 కచ్చితంగా ఆర్టీఏ కార్యాలయాల్లో చెల్లించాలి. ఇక ఫిట్నెస్ సర్టిఫికెట్ అవసరమైతే రూ.10 వేల మొత్తం అదనం. ఒక ఆటో డ్రైవర్కు వాహనమిత్ర పథకం కింద రూ.10 వేలు చెల్లిస్తున్న ప్రభుత్వం రూ.19,200 తీసుకుంటుండటం గమనార్హం.’’
షరతులు వర్తిస్తాయి
ఏడాదికి రూ.10 వేల చొప్పున అందిస్తానని హామీ ఇచ్చిన జగన్.. ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే సొంత వాహనాలు ఉన్నవారికే ఈ పథకం అంటూ మెలికపెట్టారు. ఆ తర్వాత రూ.10 వేలు ఇచ్చేందుకు పలు నిబంధనలు అమల్లోకి తెచ్చారు. కుటుంబంలో ఒకరికే పరిమితం చేశారు. కుటుంబంలో మరో వ్యక్తికి ఏదైనా కారు వంటి వాహనం ఉంటే వర్తించదు. ఆటోకు రిజిస్ట్రేషన్, యజమానికి చోదక అనుమతి పత్రం లేకపోయినా, విద్యుత్తు బిల్లు నెలకు 300 యూనిట్లు దాటినా వాహనమిత్ర పథకం రాదు.
ఇచ్చేదెంత.. నొక్కేదెంత
రాష్ట్రంలో ఇంధనం ధరలు భారీగా ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పోలిస్తే పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం డీజిల్ ధర రూ.97.62 ఉంది. ఇదే కర్ణాటకలో రూ.87కే విక్రయిస్తున్నారు. మనవద్ద లీటరుపై రూ.10 అదనంగా తీసుకుంటున్నారు. ఒక ఆటో డ్రైవరు సగటున రోజుకు ఐదు లీటర్ల డీజిల్ వేయించినా రూ.50 అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన నెలకు రూ.1,500, ఏడాదికి రూ.18 వేలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. వైఎస్సార్ వాహనమిత్ర పేరుతో ఇచ్చేది రూ.10 వేలు మాత్రమే. ఈ ప్రకారం జగనన్న ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్ నుంచి రూ.8 వేలు అదనంగా లాక్కుంటున్నట్లే.
ఇదో రకం బాదుడు
జగన్ పాలనలో పెనాల్టీల బాదుడూ ఎక్కువే. బీమా లేకపోతే రూ.5 వేలు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోకుంటే రూ.5 వేలు, కోటు వేసుకోకున్నా.. రూ.235 చొప్పున వసూలు చేస్తున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుంటే రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. వాహనమిత్ర కింద ఏడాదికి ఇచ్చే రూ.10 వేలతో పోలిస్తే.. నెలకు నమోదయ్యే కేసులు, చెల్లించే జరిమానాలకే ఎక్కువ అవుతోంది.
- ఆటో డ్రైవర్లు : 26 వేలు
- ట్యాక్సీ డ్రైవర్లు : 3 వేలు
- వాహన మిత్ర లబ్ధిదారులు : 11,236 (కర్నూలు), 7,698 (నంద్యాల)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తా
[ 29-04-2024]
పట్టణంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెదేపా అభ్యర్థి బీవీ జయ నాగేశ్వర్రెడ్డి అన్నారు. -
గూడ్స్ బోగిలో మంటలు
[ 29-04-2024]
గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని చిప్పగిరి మండలం నేమకల్లు రైల్వే స్టేషన్లో ఆదివారం గూడ్స్ బోగిలో మంటలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది వెంటనే అగ్ని మాపక శాఖ వారికి సమాచారం అందించారు. -
జలం తీసుకొస్తాం.. జనాలను బాగు చేస్తాం
[ 29-04-2024]
పశ్చిమ ప్రాంతం పూర్తిగా వెనుకబడింది.. మంత్రాలయం నియోజకవర్గంలో వలసలు ఎక్కువ.. అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా.. వలసలకు అడ్డుకట్ట వేస్తామని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. -
వైకాపాలో రగడ
[ 29-04-2024]
పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఆదివారం వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక సగర (ఉప్పర) సంఘం నాయకులు ఏర్పాటు చేసిన సమావేశం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వీరశైవ సంఘం ఛైర్మన్ రుద్రగౌడ్, పట్టణ బ్యాంకు ఛైర్మన్ యు.కె.రాజు తదితరులు హాజరయ్యారు. -
జగన్ పాలన.. కష్టాల‘పాలు’
[ 29-04-2024]
చంద్రబాబు ఆలోచన: తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం.. ‘పాడి’ రంగాన్ని ప్రోత్సాహం ఇచ్చారు. రాష్ట్రంలోనే ఎక్కడ లేనివిధంగా కల్లూరు మండలం తడకనపల్లెలో పశు వసతిగృహాన్ని ఏర్పాటు చేశారు. -
పశ్చిమాన వలస విలాపం
[ 29-04-2024]
పశ్చిమాన పల్లెలు కన్నీరు పెడుతున్నాయి.. వలస వెళ్తున్న ప్రజలను చూసి. ఇళ్లకేసిన తలుపులు, తాళాలు ప్రశ్నిస్తున్నాయి.. మళ్లీ ఎప్పుడు తీస్తారని. ఇంటికి కాపలా ఉన్న పెద్దలు ఎదురు చూస్తున్నారు.. అయినవాళ్లు ఎప్పుడు తిరిగొస్తారని. -
విలీనం చేసి.. జగన్ నిలువునా ముంచి
[ 29-04-2024]
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైతే ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లభిస్తుంది. అవసరమైన సదుపాయాలు సమకూరుతాయి. -
జగన్ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
[ 29-04-2024]
ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పోలవరం కట్టలేదని, రాజధానిలో ఒక్క ఇటుక వేయలేదని, రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయకుండా మాట తప్పారని, మరోసారి మోసం చేసేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. -
అరాచక పాలనకు అంతం తప్పదు
[ 29-04-2024]
రాష్ట్రంలో అరాచక పాలనకు త్వరలోనే అంతం తప్పదని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. మండలంలోని చెన్నంశెట్టిపల్లెలో తెదేపా నేత వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
నెరవేరని మాటలు.. అవస్థల పాఠాలు
[ 29-04-2024]
విద్యార్థులు చదువుకునేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పలు ప్రసంగాల్లో ఊదరగొడుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో పొంతన ఉండటం లేదు. -
వైకాపాను నమ్మి మళ్లీ మోసపోవద్దు
[ 29-04-2024]
ఆదోని పట్టణంలోని శివశంకర్నగర్లో భాజపా అభ్యర్థి డా.పార్థసారథి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట తెదేపా సీనియర్ నాయకులు భూపాల్చౌదరి, తెదేపా మాజీ ఇన్ఛార్జి గుడిసె కృష్ణమ్మ పాల్గొన్నారు. -
కానిస్టేబుళ్లపై విచారణకు డీఐజీ ఆదేశం
[ 29-04-2024]
ఆర్థికమంత్రి బుగ్గన నామినేషన్ బందోబస్తుకు వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లపై విచారణకు డీఐజీ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 22న బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి నామినేషన్కు ఆవుకు పోలీస్స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లు బందోబస్తు నిమిత్తం డోన్కు వచ్చారు. -
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధిచెబుదాం: బీసీ
[ 29-04-2024]
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధిచెప్పి ఇంటికి పంపిద్దామని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని పెండేకంటి నగర్, శివనందినగర్లో ‘ప్రజాగళం’లో భాగంగా రాష్ట్ర కార్యదర్శి కాటసాని చంద్రశేఖరరెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. -
కల్తీ విత్తనాలు, స్థిరాస్తి వ్యాపారులను ఓడించాలి
[ 29-04-2024]
నంద్యాలలో నకిలీ విత్తనాలు, స్థిరాస్తి వ్యాపారం చేస్తూ ప్రజలను మోసగిస్తున్న ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డిలను ఓడించాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్