బీమా.. జగన్ డ్రామా
తెదేపా హయాంలో చంద్రన్న బీమా పథకం అమలు చేశారు. సాధారణ మరణం అయితే యాబై ఏళ్ల వయస్సు ఉన్నవారికి రూ.2 లక్షలు, 50 ఏళ్లకు పైబడి 59 ఏళ్ల వయస్సు వారికి రూ.30 వేల బీమా పరిహారం అందించారు.
మృతులు వేలల్లో.. పరిహారం వందల్లో
వైకాపా ప్రభుత్వం విచిత్ర నిబంధనలు
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే
చంద్రన్న ఉదారత..
తెదేపా హయాంలో చంద్రన్న బీమా పథకం అమలు చేశారు. సాధారణ మరణం అయితే యాబై ఏళ్ల వయస్సు ఉన్నవారికి రూ.2 లక్షలు, 50 ఏళ్లకు పైబడి 59 ఏళ్ల వయస్సు వారికి రూ.30 వేల బీమా పరిహారం అందించారు. కుటుంబంలో ఎవరు చనిపోయినా పరిహారం ఇచ్చేవారు. ప్రమాద బీమా కింద రూ.5 లక్షలు ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్సుతో సంబంధం లేకుండా వర్తింపజేశారు. రెండు నెలల్లోపే పరిహారం పంపిణీ చేశారు.
జగనన్న కక్కుర్తి
వైఎస్సార్ బీమా కింద మూడేళ్లలో ఉమ్మడి జిల్లాలో 30.63 లక్షల మంది పాలసీదారులను నమోదు చేశారు. 18-50 ఏళ్లు ఉండి సంపాదించే వ్యక్తి సహజ మరణం చెందితే ఆ కుటుంబానికి రూ.లక్ష, 18-70 ఏళ్ల మధ్య ఉండి సంపాదించే వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందితే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 42 లక్షల వరకు జనాభా ఉంది. కుటుంబ యజమాని చనిపోతేనే వైఎస్సార్ బీమా వర్తిస్తుంది. ఆ కుటుంబంలో భార్య, పిల్లలు చనిపోతే బీమా పరిధిలోకి రారు. కుటుంబ యజమానికి 50 ఏళ్లకు పైబడి ఉండి సాధారణ మరణమైతే బీమా వర్తించదు.
గొప్పలు చెప్పారు
కేంద్రం ఇచ్చే 50 శాతం వాటా ఇప్పుడు లేనప్పటికీ దేశంలో ఎక్కడా లేనివిధంగా పూర్తి ఖర్చు రాష్ట్రమే భరిస్తూ ఉచిత బీమా అమలు చేస్తోంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోయి నిస్సహాయ స్థితిలోని నిరుపేద కుటుంబాలకు ఆలంబనగా జగనన్న ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ వైఎస్సార్ బీమా.!!
ముఖ్యమంత్రి జగన్ ప్రగల్భాలు!
వేదన మిగిల్చారు
తెదేపా ప్రభుత్వ హయాంలో కార్డులో ఉన్నవారందరికీ బీమా వర్తించేది. వైకాపా అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత 2021-22 నుంచి వైఎస్సార్ బీమా పథకాన్ని తీసుకొచ్చింది. ఒక కార్డుకు ఒక్కరికే పరిమితం చేసింది. సాధారణంగా 18-70 ఏళ్ల మధ్య వయస్సు వారికి బీమా వర్తింపజేయాలి. 50-70 ఏళ్ల మధ్య వయస్సువారు ఎక్కువగా చనిపోతుంటారని భావించిన ప్రభుత్వం బీమా పథకం వర్తింపజేయడంలో కక్కుర్తి పడుతోందన్న విమర్శలు ఉన్నాయి. గత మూడేళ్లలో 37,500 మృతి చెందితే 7,386 మందికే బీమా కల్పించారు.
కొర్రీలు పెట్టి.. కోత విధించి
- కర్నూలు జిల్లాలో మూడేళ్లలో 4,281 మంది వైఎస్సార్ బీమా పాలసీదారులు మరణిస్తే అందులో 3,895 మంది బాధిత కుటుంబాలకే బీమా వర్తింపజేశారు. వివిధ కారణాలతో 386 మందికి బీమాలో కోత విధించారు. ప్రమాద మరణాలు చాలా తక్కువగా చూపుతున్నారు. మూడేళ్లలో కేవలం 360 మంది ప్రమాద మృతులను చూపారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో నెలకు 10 ప్రమాద మరణాలు జరిగినట్లు.. అవి బీమా కింద నమోదైనట్లు చూపడం గమనార్హం.
- అధికారుల లెక్కల ప్రకారం నంద్యాల జిల్లాలో మూడేళ్లలో 3,602 పాలసీదారులు మరణించగా ఏటా 1,163 మంది చొప్పున మూడేళ్లకు 3,491 మంది బాధిత కుటుంబాలకు వైఎస్సార్ బీమా పరిహారం చెల్లించారు. వివిధ కారణాలతో వందకుపైగా క్లెయిమ్లకు అందలేదు.
మట్టి ఖర్చులూ ఇవ్వడం లేదు
- బాధితులు మృతి చెందిన రోజునే మట్టి ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాల్సి ఉంది. నెలలు గడిచినా ఇవ్వడం లేదు. ప్రమాద మరణాలకు సంబంధించి ఎఫ్ఐఆర్, మరణ ధ్రువీకరణ పత్రం, శవ పరీక్ష నివేదిక (పోస్టుమార్టం) ఉంటేనే పరిహారం వస్తుందని అధికారులు చెబుతున్నారు. రహదారి ప్రమాదాల్లో చనిపోతే డ్రైవింగ్ లైసెన్స్ నిబంధన కచ్చితం చేశారు. ఈ కారణంతో ఏటా వేలాది మందికి బీమా అందడం లేదు.
- ఉమ్మడి కర్నూలు జిల్లాలో నెలకు 205 మంది బాధిత కుటుంబాలకు బీమా పరిహారం పంపిణీ అందజేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఓ వ్యక్తి సాధారణ మరణమైతే ఆ కుటుంబానికి రూ.లక్ష సాయమందించాలి. దరఖాస్తు చేసుకున్న బాధిత కుటుంబానికి మొదట రూ.10 వేలు ఇస్తున్నారు. మిగిలిన సొమ్ముకు బాధిత కుటుంబాలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాయి.
ఆందోళన చేసినా ఆలకించరు
2021 నుంచి ఉమ్మడి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన 236 మంది బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ప్రమాద బీమా పరిహారం మంజూరు చేయలేదు. దీంతో బాధిత కుటుంబాలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నాయి. యూనివర్సల్ సోం బీమా కంపెనీ బాధిత కుటుంబాలకు పరిహారం విడుదల చేయడం లేదు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల మరణాలు రెండు వేల వరకు ఉన్నాయి. సాధారణ మరణాలు ఉమ్మడి జిల్లాలో 10 వేలకుపైగా ఉన్నాయి. ఆ బాధిత కుటుంబాలు బీమా పరిహారం కోసం ఎదురుచూసి చివరికి మరిచిపోయే పరిస్థితి నెలకొంది.
7,386 మందికే పరిహారం
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏటా సాధారణ, ప్రమాదవశాత్తుగా 7,500 మంది చనిపోతుండగా.. అందులో 1,200 వరకు ప్రమాద మరణాలే ఉన్నాయి. మరో 5 వేలకుపైగా ఇళ్ల దగ్గర చనిపోతున్నవారున్నారు. ఈ లెక్కన సాధారణ, ప్రమాద మరణాలు ఏటా 12,500 సంభవిస్తున్నాయి. మూడేళ్లలో 37,500 మరణాలు సంభవిస్తే.. వైఎస్సార్ బీమా కింద మూడేళ్లలో కేవలం 7,386 క్లెయిమ్లకే బీమా వర్తింపజేశారు. వివిధ కారణాలతో 497 క్లెయిమ్లకు దక్కలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముస్లింలకు జగన్ ధోకా
[ 30-04-2024]
తెదేపా హయాంలో ముస్లిం మైనార్టీలకు న్యాయం చేశాం.. ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాం. ఉర్దూను రెండో భాషగా గుర్తించాం.. దుకాన్ మకాన్, దుల్హన్ లాంటి పథకాలు తెచ్చాం.. రంజాన్ తోఫా ఇచ్చి అండగా నిలిచా.. ఈ పథకాలన్నీ జగన్రెడ్డి రద్దు చేసి మైనార్టీలకు అన్యాయం చేశారు. -
పండుటాకులతో జగన్ పింఛనాట
[ 30-04-2024]
సామాజిక పింఛన్ల వ్యవహారంలో జగన్నాటకం కొనసాగుతోంది.. ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేయకుండా ఉండేందుకు ఎన్ని రకాలు కుట్రలు, కుతంత్రాలు పన్నాలో అన్నింటినీ అమలు చేస్తున్నారు. -
జలం కోసం జనం ఆందోళన
[ 30-04-2024]
మండలంలోని కులుమాల గ్రామంలో నెలలు తరబడిగా వేధిస్తున్న తాగునీటి సమస్యను తీర్చాలని గ్రామస్థులు సోమవారం గోనెగండ్లలోని మండల పరిషత్తు కార్యాలయాన్ని ముట్టడించారు. -
అసెంబ్లీ బరిలో 126 మంది
[ 30-04-2024]
జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో 126 మంది అభ్యర్థులు నిలిచారు. నంద్యాల పార్లమెంటు స్థానానికి 31 మంది పోటీలో ఉన్నారు. -
పరిహారం ఇచ్చే వరకు పనులు ఆపండి
[ 30-04-2024]
మండలంలోని పిన్నాపురం గ్రామంలో గ్రీన్కో సంస్థ చేపట్టిన విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నిర్మాణ పనులను రైతులు అడ్డుకున్నారు. -
1 వరకు దరఖాస్తుకు గడువు
[ 30-04-2024]
ఎన్నికల ఏజెంట్లుగా నియమించుకోవాలనుకునేవారు ఫామ్-8 ఇవ్వడంతోపాటు వ్యయ నిర్వహణ కోసం ఒకరిని ఏర్పాటుచేసుకోవాలని పాణ్యం ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌర్య అన్నారు. -
రాక్షస పాలనను తరిమేద్దాం
[ 30-04-2024]
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, దీనికి త్వరలోనే చరమగీతం పాడాలని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి, తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. -
5 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ
[ 30-04-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవో, ఓపీవోలు, అత్యవసర సర్వీసుల్లో విధులు నిర్వహిస్తున్న వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఎన్నికల సంఘం కల్పించింది. -
స్వతంత్ర అభ్యర్థికి గ్లాస్ టంబ్లర్ గుర్తు
[ 30-04-2024]
కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి భరత్.ఎన్కు అధికారులు గ్లాస్ టంబ్లర్ గుర్తు కేటాయించారు. -
ఫైనాన్స్ సంస్థకు మొట్టికాయ
[ 30-04-2024]
నిబంధనలు పాటించని మణిప్పురం ఫైనాన్స్ సంస్థకు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ మొట్టికాయ వేసింది. -
వంతెనలు కూలుతున్నా.. కునుకు వీడరా!
[ 30-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు అని చెప్పడానికి ఈ చిత్రాలే నిదర్శనం. వంకలు, నదులపై నిర్మించిన వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నా జగన్ ఐదేళ్ల పాలనలో కనీసం వాటి మరమ్మతుకు అడుగు ముందుకు పడలేదు. -
జగనన్నా.. న్యాయం ఏదన్నా..
[ 30-04-2024]
మహిళలకు రక్షణ కల్పించేందుకు దిశా పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి గొప్పలు చెప్పారు. వీటిద్వారా మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. -
ప్రతి ఎకరాకు నీరందిస్తాం
[ 30-04-2024]
తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రతి ఎకరాకు నీరందిస్తామని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్రెడ్డి హామీ ఇచ్చారు. -
ఉమ్మడి కూటమితోనే ఏపీలో అభివృద్ధి సాధ్యం
[ 30-04-2024]
ఉమ్మడి కూటమితోనే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడుస్తుందని నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో విలేకరి మృతి
[ 30-04-2024]
ఆత్మకూరుకు చెందిన నెత్తికొప్పుల మహేష్(48) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విలేకరిగా పని చేస్తున్న మహేశ్ పట్టణ శివారులోని ఆర్డీటీ కాలనీలో నివాసం ఉంటున్నారు.