logo

రహదారుల బాగుకు చర్యలు : బుగ్గన

వైకాపా వెన్నుపోటుదారులకు, అవాకులు చవాకులు మాట్లాడే వారికి ఎన్నికల తర్వాత కోలుకోలేని విధంగా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 18 Apr 2024 02:50 IST

బేతంచెర్ల, న్యూస్‌టుడే: వైకాపా వెన్నుపోటుదారులకు, అవాకులు చవాకులు మాట్లాడే వారికి ఎన్నికల తర్వాత కోలుకోలేని విధంగా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం బేతంచెర్ల పట్టణంలో షిరిడీ సాయిబాబా ఆలయ కల్యాణ మండపంలో నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో, మీ అందరి ఆశీర్వాదం వల్ల విద్య, వైద్యం, రహదారులు, దేవాలయాలు, తాగునీటి ప్రాజెక్టు వంటి పనులు చేపట్టినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని