logo

నేడు చంద్రబాబు రాక

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించనున్నారు.

Published : 28 Apr 2024 02:32 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3.45 గంటలకు మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం చేరుకుంటారని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. సాయంత్రం 4 గంటలకు కౌతాళం బస్టాండ్‌ వద్ద ప్రజాగళం సభలో మాట్లాడతారు. అనంతరం హెలిపాప్టర్‌లో బయలుదేరి 6.10 గంటలకు కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని గూడూరుకు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 6.30 రాత్రి 8 గంటల వరకు నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని