వరాల జల్లు కురిపించేనా..!
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనపై పాలమూరు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండోసారి సీఎంగా కేసీఆర్ గతేడాది వనపర్తి, మహబూబ్నగర్ కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవానికి వచ్చారు.
కేసీఆర్ పర్యటనపై పాలమూరువాసుల ఆశలు
నాగర్కర్నూల్కు నేడు సీఎం రాక
ఈనాడు, మహబూబ్నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనపై పాలమూరు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండోసారి సీఎంగా కేసీఆర్ గతేడాది వనపర్తి, మహబూబ్నగర్ కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవానికి వచ్చారు. 2019లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పరిశీలించడానికి వచ్చారు. అధికారికంగా జరిగిన ఈ మూడు కార్యక్రమాల్లో ఇక్కడి ప్రాంత ప్రజలకు కేసీఆర్ ఎన్నో వరాలు గుప్పించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణామోహన్రెడ్డిలను పరామర్శించడానికి వ్యక్తిగతంగా వచ్చారు. నాగర్కర్నూల్ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించడానికి మంగళవారం మరోసారి సీఎం ఈ ప్రాంతానికి రానున్నారు. ఈ సందర్భంగా భారీ సభను ఏర్పాటు చేస్తున్నారు. పాలమూరుకు వరాల జల్లు గుప్పిస్తారని, గత హామీలపై కూడా దృష్టి పెడతారన్న భరోసాలో ఉన్నారు.
నాగర్కర్నూల్ జిల్లాలోని వట్టెం జలాశయం కరకట్ట
ప్రాజెక్టులే ప్రధాన అస్త్రంగా..
ఉమ్మడి పాలమూరులో ప్రాజెక్టులే ప్రధాన అస్త్రంగా కేసీఆర్ హామీలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సచివాలయం ప్రారంభోత్సవం కాగానే అధికారులతో మొదటి సమీక్ష పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపైనే పెట్టారు. ఈ నెలగానీ, వచ్చే నెలాఖరుకుగానీ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 2019లో పాలమూరు ప్రాజెక్టు పనులను పరిశీలించిన సమయంలో ఏడాది లోపు పనులను పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు పనులు మాత్రం పూర్తిస్థాయిలో జరగలేదు. 2020లో కరోనా రావడం, హరిత ట్రైబ్యునల్ కేసులు, నిధుల కొరత వెరసి పనులు నెమ్మదించాయి. ఈ పనులు గడువులోగా పూర్తి కావాలంటే పెద్ద ఎత్తున నిధులు కావాలి. శ్రీశైలం తిరుగు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. తాగునీరు, పరిశ్రమల అవసరాలకు కూడా నీటి కొరత తీరనుంది. దీనిపైనే పాలమూరు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
* నిర్మిత ప్రాజెక్టులైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ పరిధిలో 2 లక్షల ఎకరాలకు సంబంధించిన అదనపు ఆయకట్టు పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులు పూర్తి కావాలంటే భారీగా నిధులు అవసరం. గత నాలుగైదేళ్లుగా నిర్మిత ప్రాజెక్టుల అదనపు ఆయకట్టు పనులు ముందుకు సాగడం లేదు. వీటికి కూడా నిధులు భారీగా అవసరం. వీటికి నిధుల ప్రకటనపై ఆయకట్టు రైతులు ఆశ పెట్టుకున్నారు.
* తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పరిధిలో మల్లమ్మకుంట, జూలకల్లు, వల్లూరు జలాశయాలను నిర్మించాల్సి ఉంది. ఇటీవల సీఎం మల్లమ్మకుంట జలాశయానికి ఆమోదం తెలిపారు. జూలకల్లు, వల్లూరు జలాశయాల కోసం నిధులు మంజూరు చేస్తే వరద ఉన్నప్పుడే నీటిని తోడుకుని అవసరాలకు వాడుకోవచ్చు. సుమారు రూ.380 కోట్లు అవసరం ఉంటుంది.
* నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జూరాల జలాశయం ముంపు గ్రామాలైన అనుగొండ, దాదాన్పల్లి, అంకెన్పల్లిలకు ఇప్పటికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పనులు పూర్తికాలేదు.
* బీమా ప్రాజెక్టు పరిధిలో నేరడ్గం, సంగంబండ, భూత్పూరు జలాశయాల ప్రజలు కూడా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం ఎదురు చూస్తున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పరిధిలోని కానాయిపల్లి ప్రజలు శంకరసముద్రం జలాశయానికి భూములు ఇచ్చారు. వీరికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు.
సారూ.. వీటిపై దృష్టి సారించరూ!
ప్రజలు రెండు పడక గదుల ఇళ్లపై ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో వీటి నిర్మాణం ముందుకు సాగడం లేదు. నిధులు కొరతతోగుత్తేదారులు ముందుకు రావడంలేదు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 5 వేల మందికి రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేశారు. మరో ఐదు వేల వరకు ఇళ్లను పూర్తి చేయాల్సి ఉంది. పాలమూరు జిల్లాల్లో వనపర్తి మినహా ఎక్కడా కూడా ఇంజినీరింగ్ కళాశాల లేదు. కనీసం మహబూబ్నగర్కైనా ఒక్క ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్లో ఉన్న 40వేల మంది మాదాసి కురువలు తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతున్నారు.
సభకు భారీగా ఏర్పాట్లు
నాగర్కర్నూల్, న్యూస్టుడే: నాగర్కర్నూల్ సమీపంలోని వెలమ సంఘం ఫంక్షన్ హాల్ పక్కన బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. పోలీసులు సభా ప్రాంగనాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. 1,200 మంది పోలిస్ సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎస్పీ మనోహర్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
షెడ్యూల్ ఇలా..: సీఎం కేసీఆర్ హెలీప్యాడ్లో సాయంత్రం 4 గంటలకు దిగుతారు. అక్కడి నుంచి నేరుగా భారాస జిల్లా కార్యాలయం వద్దకు వెళ్లి ప్రారంభిస్తారు. తర్వాత ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కొత్త కలెక్టరేట్కు వస్తారు. కలెక్టరేట్తోపాటు వైద్య కళాశాల శిలాఫలకాన్ని ప్రారంభిస్తారు. అక్కడే కొద్దిసేపు ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షిస్తారు. 6 గంటలకు బహిరంగ సభ స్థలికి చేరుకొని ప్రసంగిస్తారు. సభ ముగిసిన అనంతరం రోడ్డు మార్గాన హైదరాబాద్కు వెళ్లనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపాకు నడిగడ్డ హక్కుల పోరాట సమితి మద్దతు
[ 05-05-2024]
భాజపా నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్కు నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కన్వీనర్ రంజిత్ కుమార్ తెలిపారు. -
కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక
[ 05-05-2024]
భారాసకి చెందిన పలువురు నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. -
ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు
[ 05-05-2024]
100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలను పూర్తిగా మోసం చేసిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్రెడ్డి ఆరోపించారు. -
పాలమూరుకు జాతీయ హోదా ఎందుకివ్వలేదు?
[ 05-05-2024]
పాలమూరుకు నరేంద్రమోదీ చుట్టంలా వస్తారు.. పోతారు.. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: మురుగన్
[ 05-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ మూడో సారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని ఎట్టి పరిస్థితులలోను రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి మురుగన్ తేల్చి చెప్పారు. -
నేడు ఎర్రవల్లిలో జనజాతర
[ 05-05-2024]
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ జనజాతర సభను ఏర్పాటు చేసింది. -
మాటలతో మోసం చేశారు: చల్లా
[ 05-05-2024]
రాష్ట్రంలో పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్ధానికీ జరుగుతున్న యుద్ధమే ఈ ఎన్నికలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. -
సామాజిక వాణి పాలమూరు బాణి
[ 05-05-2024]
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే నాయకులు ఎంతో హైరానా పడేవారు.. అభ్యర్థులు ఏం చెబుతున్నారో, ఎలాంటి భావజాలంతో ఉన్నారో సభలకు వెళ్తేకానీ జనాలకూ తెలిసేది కాదు. కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. -
నల్లమలకు చేరిన చిరుత
[ 05-05-2024]
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయ ప్రాంతంలో ఆరు రోజులుగా ప్రజలను హడలెత్తించిన చిరుత ఎట్టకేలకు నల్లమల అటవీ ప్రాంతానికి చేరింది. -
వడ్డేపల్లి @ 46 డిగ్రీలు
[ 05-05-2024]
జిల్లాలో గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
ఎన్నికల నిర్వహణలో అధికారులది కీలకపాత్ర
[ 05-05-2024]
ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర అని జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ అన్నారు. -
హస్తం దెబ్బకు కారు షెడ్డుకు
[ 05-05-2024]
భారాస పదేళ్ల పాలనలో అభివృద్ధి కంటే అవినీతి బాగా జరిగిందని అందుకే ప్రజలు శాసనసభ ఎన్నికల్లో ఓటుతో ఆ పార్టీకి బుద్ధి చెప్పారని నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. -
హోం ఓటింగ్కు 1,026 మందే దరఖాస్తు
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల్లో 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లతో పాటు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటెయ్యలేని దివ్యాంగులకు హోం ఓటింగ్(ఇంటి వద్దే ఓటు వినియోగం)కు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. -
పేదల బతుకులు మార్చేందుకొచ్చా: ఆర్ఎస్
[ 05-05-2024]
ఎర్రబుగ్గ కార్లలో తిరిగేందుకు, హోదా కోసం రాజకీయాల్లోకి రాలేదు.. కేవలం పేదల జీవితాల్లో మార్పుతీసుకువచ్చేందుకు మాత్రమే వచ్చానని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ప్రవీణ్కుమార్ అన్నారు. -
భారాసకు ఓటు వేస్తే భాజపాకు వేసినట్లే: మంత్రి జూపల్లి
[ 05-05-2024]
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ప్రజల కష్టాలు తీరుతాయని, కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి మల్లు రవి గెలుపునకు ప్రతి ఒక్కరూ పని చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
రైతులను మోసం చేసిన కాంగ్రెస్ : మన్నె
[ 05-05-2024]
రుణమాఫీ చేయకుండా, బోనస్ ఇవ్వకుండా రైతులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఎంపీ, భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. -
మరికల్లో భారీ చోరీ
[ 05-05-2024]
మరికల్ పట్టణంలో శుక్రవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. బంగారం, నగదు కలిపి సుమారుగా రూ. 34 లక్షలు విలువ చేసే సొత్తును దొంగలు ఎత్తుకెళ్లారు. -
ఫలానావారి కుమార్తెలు 30లక్షల మంది
[ 05-05-2024]
1951లో తొలిసారి ఓటరు నమోదు చేపట్టారు. అప్పట్లో ఆచారాలు, సంప్రదాయాల కారణంగా మహిళలు తమ పేరుతో పాటు భర్త పేరు చెప్పేందుకు నిరాకరించారు.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న