ఐటీ పరిశ్రమలో కొలువులేవీ?
రాష్ట్రంలో టైర్-2 పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలన్న లక్ష్యం ఉమ్మడి జిల్లాలో నీరుగారిపోతోంది. భారాస ప్రభుత్వం మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో ఐటీ టవర్ నిర్మాణాలకు సంకల్పించింది.
పాలమూరుపై కంపెనీల అనాసక్తి
వనపర్తిలో శంకుస్థాపనకే పరిమితం
మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన ఐటీ టవర్
ఈనాడు, మహబూబ్నగర్: రాష్ట్రంలో టైర్-2 పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలన్న లక్ష్యం ఉమ్మడి జిల్లాలో నీరుగారిపోతోంది. భారాస ప్రభుత్వం మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో ఐటీ టవర్ నిర్మాణాలకు సంకల్పించింది. మహబూబ్నగర్లో 2018 జులై 7న ఐటీ టవర్ పైలాన్ను ఆవిష్కరించింది. జిల్లా కేంద్రం శివారులోని ఎదిర, దివిటిపల్లిలోని 556, 607 సర్వే నంబర్లలో 371 ఎకరాల్లో ఐటీ, మల్టీపర్పస్ ఇండస్ట్రీయల్ కారిడార్ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలోని ఐదెకరాల్లో ఐటీ టవర్ భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. గతేడాది మేలో దీనిని ప్రారంభించారు. కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ సాఫ్ట్వేర్ పరిశ్రమలు రాలేదు. రెండు, మూడు కంపెనీలు వచ్చినా నామమాత్రంగానే కొనసాగుతున్నాయి. వనపర్తి శివారులో గతేడాది సెప్టెంబరులో రూ.45 కోట్లతో ఐటీ టవర్ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఏడు నెలలు గడుస్తున్నా ఈ నిర్మాణానికి అడుగు కూడా ముందుకు పడలేదు.
మహబూబ్నగర్లో ప్రారంభించినా..: మహబూబ్నగర్ శివారులో 5 ఎకరాల్లో ఐటీ టవర్ భవనాన్ని గత ఏడాది ప్రారంభించారు. ఈ టవర్ను 19,370 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. మొత్తం జీ+4 అంతస్తుల్లో ఏర్పాటు చేయగా రూ.40 కోట్లు ఖర్చయ్యాయి. ఈ భవనం ప్రారంభం సందర్భంగా తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ కేంద్రం(టాస్క్), టీ-హబ్, వీ హబ్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముల్లర్ డాట్ కనెక్షన్, అమరరాజ గ్రూప్, జువెన్ టెక్నాలజీస్, ఇంటూట్స్ ఎల్ఎల్సి, ఉర్పాన్ టెక్నాలజీస్, ఈ-గ్రోస్ సిస్టమ్స్, ఐటీ విజన్ 360 ఇంక్, ఫొర్ ఓక్స్ఇంక్, బీసీడీసీ క్లౌడ్ కేంద్రాలకు ఈ టవర్లో పని చేసేందుకు అనుమతి పత్రాలను అందించారు. వాటిలో చాలా కంపెనీలు ప్రస్తుతం ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేయలేదు. ఇటీవల రెండు, మూడు పరిశ్రమలు ముందుకొచ్చినా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు చేపట్టడం లేదు. మిగతా పరిశ్రమలిక్కడ తమ సంస్థలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపడంలేదు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉండడం, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి గంట వ్యవధిలో చేరుకోవడం తదితర కారణాలతో ఇక్కడికి ఐటీ పరిశ్రమలు ఎక్కువగా వస్తాయని ఆశించినా ఇవేవీ జరగలేదు. ఈ టవర్ పూర్తయితే కనీసం 10 వేల మందికి ఉద్యోగాలొస్తాయని అప్పట్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటించారు. కనీసం ఇక్కడ 300 మంది కూడా సరిగ్గా ఉపాధి పొందడం లేదు. అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.
పురోగతి లేదు..: ఉమ్మడి జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న పట్టణాల్లో వనపర్తి ఒకటి. జిల్లా కేంద్రం కూడా కావడంతో ఇక్కడ ఐటీ టవర్ నిర్మాణానికి భారాస ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పట్టణ శివారులోని నాగవరంలో రెండెకరాల స్థలంలో రూ.45కోట్లతో అప్పటి ప్రభుత్వం భూమి పూజ చేసింది. టీఎస్ఐసీసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణంతోపాటు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ ఐటీ టవర్ ఏర్పాటుకు సంబంధించిన ఎలాంటి పురోగతి లేదు. దీనిపై టీఎస్ఐఐసీ మహబూబ్నగర్ ఇన్ఛార్జి మేనేజర్ విజయ్కుమార్ ‘ఈనాడు’తో మాట్లాడుతూ మహబూబ్నగర్లో అప్పట్లో తొమ్మిది సంస్థలు ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమేనని ప్రస్తుతం రెండు మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా కలశ స్థాపన మహోత్సవం
[ 29-04-2024]
తుంగభద్ర నదిలో నీరు పూర్తిగా తగ్గడంతో బయటకు తేలిన రాజోలి శివారులోని శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో కలశ స్థాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
[ 29-04-2024]
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం ఉండవల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తా ఫ్లైఓవర్పై జరిగింది. -
ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
[ 29-04-2024]
నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ప్రచండ ఎండ!
[ 29-04-2024]
పాలమూరులో భానుడు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఏప్రిల్లోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చెరువులు, నదులు, వాగులు, బావులు, చెక్డ్యాంలు, నీటికుంటలు ఎండిపోతున్నాయి. -
వలస ఓటర్లపై ఆశలు!
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని వలస ఓటర్లపై ప్రధాన పార్టీల అభ్యర్థులు దృష్టి పెట్టారు. ముంబయి, పుణె, భీమండిలో ఈ ప్రాంతానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాది మంది ఉపాధి కోసం హైదరాబాద్లో స్థిరపడ్డారు. -
వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం
[ 29-04-2024]
వచ్చే వానాకాలంలో పంటల సాగుకు అనుకూల పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలపటంతో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువుల నిల్వలపై ముందస్తు అంచనాలు తయారు చేశారు. -
దుందుభి.. దుఃఖిస్తోంది!
[ 29-04-2024]
దుందుభి వాగులో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. రాత్రిళ్లు ఇసుక మాఫియా వాగును ఖాళీ చేస్తుండటంతో మండలంలోని కొత్తూర్, వెలుగొముల, రెడ్డిగూడ, చిల్వేరు, అయ్యవారిపల్లి, కొత్తపల్లి, వాడ్యాల గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి సంస్కృత శిక్షణ శిబిరం
[ 29-04-2024]
మహబూబ్నగర్ - జడ్చర్ల రోడ్డులోని మయూరి పార్కు సమీప కేశవరెడ్డి ఉన్నత పాఠశాలలో సోమవారం నుంచి మే 5 వరకు రాష్ట్రస్థాయి సంస్కృత శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు సంస్కృత భారతి, రామకృష్ణ సేవా సమితి ప్రతినిధులు యాదయ్య, వెంకట్రెడ్డి, రాజ్మల్లేశ్ వెల్లడించారు. -
ఈవీఎంల వయసు 35 ఏళ్లు
[ 29-04-2024]
ప్రస్తుతం ఎన్నికల్లో పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలను వినియోగిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈవీఎంలను తొలిసారి ఎప్పుడు వినియోగించారు? దాని పుట్టు పూర్వోత్తరాలను ఒకసారి పరిశీలిద్దాం. -
ఐదేళ్లకు ఓ పూట
[ 29-04-2024]
సినిమా అంటే క్యూలో నిలుచొని టిక్కెట్లు తీసుకుని మూడుగంటలు వెచ్చిస్తారు... స్నేహితులతో ముచ్చట్లు చెప్పడానికి ఎంతో సమయం తీసుకుంటారు... సామాజిక మాధ్యమాల్లో విహరించడానికి మరెంతో టైం ఖర్చవుతుంది... -
భారాస, భాజపా మాటలు నమ్మొద్దు : మంత్రి జూపల్లి
[ 29-04-2024]
భారాస, భాజపా నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన మండలంలోని పలు గ్రామాల్లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. -
దోచుకున్న సొమ్ముతో దుబాయ్లో పెట్టుబడులు : వంశీచంద్రెడ్డి
[ 29-04-2024]
కేసీఆర్ కుటుంబం తెలంగాణలో పదేళ్ల పాటు దోచుకున్న సొమ్మంతా దుబాయ్లోని మాల్స్లో పెట్టుబడులు పెట్టిందని, అక్కడ అకాల వర్షాలతో మాల్స్ కొట్టుకుపోతే వారిలో అలజడి మొదలైందని మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి ఆరోపించారు. -
ముగిసిన శిర్సనగండ్ల రాములోరి బ్రహ్మోత్సవాలు
[ 29-04-2024]
రెండో భద్రాదిగా పేరొందిన చారకొండ మండలం శిర్సనగండ్ల శ్రీసీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం వైభవంగా ముగిసాయి. -
అలంపూర్ బేనీషా.. ప్రియం
[ 29-04-2024]
ప్రఖ్యాతి గాంచిన అలంపూర్ బేనీషా ఈ ఏడాది దొరకడం గగనమే. అత్యంత రుచికరమైన ఈ పండుకు మంచి గిరాకీ ఉంటుంది. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించక తోటల్లో సగానికన్నా తక్కువ కాత కన్పిస్తోంది. -
ఎలుకా కొరకకే!
[ 29-04-2024]
నారాయణపేటలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో రోగులకు ఎలుకలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన చిన్న పిల్లలు, కుటుంబికులు ఆందోళన చెందుతున్నారు. -
అందని ద్రాక్షగా.. టీ ఫైబర్ సేవలు
[ 29-04-2024]
గ్రామాలకు డిజిటల్ సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన టీ ఫైబర్ సేవల పథకం పడకేసింది. రెండేళ్లుగా అమలును విస్మరించడంతో గ్రామీణులకు డిజిటల్ సేవలు అందనిద్రాక్షగా మారాయి.
తాజా వార్తలు (Latest News)
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?