logo

18న డీకే అరుణ నామపత్రం దాఖలు

మహబూబ్‌నగర్‌ భాజపా లోక్‌సభ అభ్యర్థి డీకే అరుణ ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు పార్టీ మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

Published : 17 Apr 2024 05:26 IST

హాజరు కానున్న కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : మహబూబ్‌నగర్‌ భాజపా లోక్‌సభ అభ్యర్థి డీకే అరుణ ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు పార్టీ మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ఉదయం 9 గంటలకు కేంద్ర మంత్రితో కలిసి డీకే అరుణ పిల్లలమర్రి రహదారిలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారని, అక్కడి నుంచి భాజపా నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీతో కలెక్టరేట్‌కు చేరుకొని నామినేషన్‌ దాఖలు చేస్తారని వివరించారు. నామినేషన్‌ దాఖలు అనంతరం కలెక్టరేట్‌ నుంచి భగీరథ కాలనీ వరకు డీకే అరుణ ద్విచక్రవాహన ర్యాలీతో వస్తారని, భగీరథ కాలనీ నుంచి పాదయాత్రతో వన్‌టౌన్‌ కూడలి, రామమందిర్‌ కూడలి, పాన్‌ చౌరస్తా మీదుగా క్లాక్‌టవర్‌ కూడలికి చేరుకుంటారని తెలిపారు. క్లాక్‌టవర్‌ వద్ద ఏర్పాటు చేయబోయే కార్నర్‌ మీటింగ్‌లో ప్రజలను ఉద్దేశించి కేంద్ర మంత్రి ప్రసంగిస్తారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని