ప్రశాంత ఎన్నికలకు సహకరించండి
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఈ నెల 18 నుంచి 25 వరకు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నామ పత్రాలను సమర్పించవచ్చని జిల్లా ఎన్నికల అధికారి తేజస్నందలాల్ పవార్ అన్నారు.
మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్
వనపర్తి న్యూటౌన్, న్యూస్టుడే : లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఈ నెల 18 నుంచి 25 వరకు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నామ పత్రాలను సమర్పించవచ్చని జిల్లా ఎన్నికల అధికారి తేజస్నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం వనపర్తి కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. వారికి నోటిఫికేషన్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18న నాగర్కర్నూల్ రిటర్నింగ్ అధికారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు నేరుగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించాలన్నారు. ఆన్లైన్ ద్వారా కూడా అవకాశం ఉందన్నారు. ఆన్లైన్లో హార్డ్ కాపీలను రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రచార అనుమతులు సహాయ రిటర్నింగ్ అధికారి నుంచి తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో పారదర్శకంగా, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. సమావేశంలో జిల్లా సహాయ రిటర్నింగ్ అధికారి నగేశ్, ఆర్డీవో పద్మావతి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
24 గంటల్లో ఆన్లైన్లో ధాన్యం కొనుగోలు వివరాల నమోదు
వనపర్తి న్యూటౌన్, న్యూస్టుడే : రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను 24 గంటల్లో ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 242 కేంద్రాలన్నింటినీ ప్రారంభించాలని సూచించారు. కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలన్నారు. పంట విక్రయించిన రైతులకు 24 గంటల్లోనే వారి ఖాతాలో డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లుల నుంచి రావాల్సిన సీఎంఆర్ బియ్యం సకాలంలో అందించే విధంగా ఉప తహసీల్దార్లు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. గత మూడు సీజన్లకు సంబంధించి మిల్లర్లు కార్పొరేషన్కు 18 వేల మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉందన్నారు. నాణ్యత లేని బియ్యం ఇచ్చిన మిల్లర్లకు నోటీసులు పంపి ధాన్యాన్ని వెనక్కి పంపామన్నారు. వారి నుంచి నాణ్యమైన ధాన్యం తిరిగి సేకరించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్వో శ్రీనివాసులు, డీఎం ప్రవీణ్, మార్కెటింగ్ అధికారి స్వరణ్సింగ్, డీఆర్డీవో నాగేంద్ర, ఉప తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సార్వత్రికం... తీర్పు ప్రత్యేకం
[ 30-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో శాసనసభకు, పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటోంది. -
ప్రశ్నార్థకం.. జలాశయాల నిర్మాణం
[ 30-04-2024]
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం నిర్మాణం 2007లో పునాది పడింది. 2012లో 50 శాతం పూర్తయి నీటి తోడిపోత మొదలై సాగునీరందింది. -
పాలమూరు పోరు @50
[ 30-04-2024]
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల లెక్క తేలింది. -
దృష్టి మరల్చేందుకే రిజర్వేషన్లపై దుష్ప్రచారం : అరుణ
[ 30-04-2024]
బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని భాజపాపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆరోపించారు. -
వనిత..కలత!
[ 30-04-2024]
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధిక ఓటర్లు అతివలే. పురుష ఓటర్ల కంటే వారు 1,13,920 మంది ఎక్కువగా ఉన్నారు. -
ఏ సభలో ఎంత మంది సభ్యులు?
[ 30-04-2024]
భారత పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయి. దిగువ సభను లోక్సభ అంటారు. దీనినే ప్రజా ప్రతినిధుల సభ అని కూడా పిలుస్తారు. ఈ సభలో మొత్తం 552 మంది సభ్యులు ఉంటారు. -
కాంగ్రెస్వి మోసపూరిత హామీలు: భారాస
[ 30-04-2024]
రాష్ట్రంలో పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్దానికి జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో పేదల సంక్షేమానికి పాటుపడిన కేసీఆర్ నాయకత్వంలోని భారాసను గెలిపించాలని పార్టీ నాగర్కర్నూల్ లోకసభ స్థానం అభ్యర్థి ప్రవీణ్కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. -
దశాబ్దాల కల నెరవేరదేమి?
[ 30-04-2024]
ఉమ్మడి జిల్లాలో కేంద్ర విద్యాలయాల ఏర్పాటుపై కొన్నేళ్లుగా వివక్ష కొనసాగుతోంది. కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయం, సైనిక స్కూళ్లకు మంచి డిమాండ్ ఉంది. -
మైలారం గుట్టపై తవ్వకాలకు ససేమిరా
[ 30-04-2024]
రాళ్లతో వ్యాపారం చేస్తూ రూ.కోట్లు గడిస్తున్న మైనింగ్ మాఫియా మైలారం గుట్టపై తవ్వకాలకు సిద్ధమైంది. గుట్టపై కన్నేసిన వ్యాపారులు 2017లోనే మైనింగ్, పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు 20 ఏళ్ల వరకు అనుమతులు జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
గెలుపు ఖాయం.. భారీ మెజార్టీయే లక్ష్యం
[ 30-04-2024]
సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా కావటంతో ఇక్కడి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి కృషిచేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సూచించారు. -
రక్తనిధి కేంద్రంలో... తగ్గుతున్న నిల్వలు
[ 30-04-2024]
పట్టణంలోని జనరల్ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో రోజు రోజుకు రక్తపు నిల్వలు తగ్గుతున్నాయి. అత్యవసర పరిస్థితిలో రోగులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పేదోళ్లు ఇంటర్ చదవద్దా?
[ 30-04-2024]
ఉమ్మడి పాలమూరులో వెనకబడిన జిల్లా నారాయణపేట. కార్మికులు, వలస కూలీల జిల్లాగా పేరుంది. -
ఇండియా కూటమిని గెలిపిద్దాం : మంత్రి జూపల్లి
[ 30-04-2024]
ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపిద్దామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. -
నాడు మామ.. నేడు అల్లుడు
[ 30-04-2024]
మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఆడబిడ్డ పోటీ చేస్తుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని, ఓడించేందుకు నాడు మామ, నేడు అల్లుడు కుట్ర చేస్తున్నారని భాజపా లోక్సభ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
ఇథనాల్ పాపం భాజపా, భారాసలదే
[ 30-04-2024]
కేంద్రం, రాష్ట్రంలోని భాజపా, భారాస ప్రభుత్వాల అనుమతులతోనే మరికల్ మండలం చిత్తనూరు శివారులో అప్పట్లో ఇథనాల్ కంపెనీ ఏర్పాటైందని మహబూబ్నగర్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. -
రూ. 50 కోసం దుకాణాలకు నిప్పు
[ 30-04-2024]
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ పక్కన ఉన్న వీధి వ్యాపారుల షెడ్డులో డబ్బా దుకాణాలు దహనం చేసిన నిందితుడిని గుర్తించి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై గోవర్దన్ సోమవారం తెలిపారు. -
కస్తూర్బా విద్యాలయం సిబ్బందిపై వేటు
[ 30-04-2024]
కేజీబీవీలో నలుగురు సిబ్బందిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో ఇందిర ఉత్తర్వ్యులు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం