ఆదాయం ఘనం.. వసతులు అధ్వానం
ఆదాయం పెంపుపై దృష్టిపెడుతున్న ఆర్టీసీ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలన్న బాధ్యత మాత్రం విస్మరిస్తోంది. ఉమ్మడి జిల్లాలో అత్యధిక బస్సులు, ప్రయాణికులు రాకపోకలు సాగించే జడ్చర్ల బస్టాండులో అనేక సమస్యలు పేరుకుపోయాయి.
అందుబాటులో మరుగుదొడ్లు లేక మహిళల పాట్లు
జడ్చర్ల బస్టాండులో ప్రయాణికుల రద్దీ
న్యూస్టుడే, జడ్చర్ల గ్రామీణం: ఆదాయం పెంపుపై దృష్టిపెడుతున్న ఆర్టీసీ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలన్న బాధ్యత మాత్రం విస్మరిస్తోంది. ఉమ్మడి జిల్లాలో అత్యధిక బస్సులు, ప్రయాణికులు రాకపోకలు సాగించే జడ్చర్ల బస్టాండులో అనేక సమస్యలు పేరుకుపోయాయి. ఈ బస్టాండుకు నిత్యం తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకకు చెందిన 1,200 బస్సులు వచ్చి పోతున్నాయి. 60వేలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఇక్కడి ఏడు వ్యాపార సముదాయాలు, క్యాంటీన్ నుంచి ఆర్టీసీకి రూ.లక్షల్లో ఆదాయం వస్తున్నా ప్రయాణికుల సమస్యలు పట్టించుకోవటం లేదు.
బస్టాండులో పరిస్థితి ఇదీ..
- ప్రస్తుతం ఇక్కడ ద్విచక్ర వాహన పార్కింగ్ సౌకర్యం మాత్రమే ఉంది. కార్లకు పార్కింగ్ సౌకర్యం లేకపోవటంతో ఖాళీ స్థలంలో నిలుపుతున్నారు. చాలామంది ప్రైవేటు స్థలాల్లో డబ్బులు చెల్లించి కార్లు నిలుపుతున్నారు. బస్టాండులోని ఖాళీ స్థలంలో కారు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తే ఆదాయం పెరగటంతో పాటు ప్రయాణికుల సమస్య తీరనుంది.
- డ్రైవర్లు, కండక్టర్లకు ఉచితంగా అల్పాహారం, భోజనం అందిస్తుండటంతో బస్సులన్నీ క్యాంటీన్ ముందే ఆపుతున్నారు. పెరిగిన రద్దీ దృష్ట్యా కర్నూల్ వైపు ఖాళీ స్థలంలో మరో క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఆదాయం పెరగడంతో పాటు ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. బస్సులు ఎక్కడికక్కడ నిర్దేశిత స్థలంలో ఆగుతాయి.
- ఇక్కడ వ్యాపారులకు పాల ఉత్పత్తులు, చల్లని పానీయాలు, టీస్టాల్ నిర్వహణకు టెండర్ నిర్వహించి అవకాశం కల్పిస్తే అన్ని రకాల వస్తువులు విక్రయించటంతో పాటు అధిక ధరలతో ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారు.
- గతంలో ఎమ్మెల్సీగా ఉన్న ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ తన నిధులతో ఇక్కడ నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. దీని నీటిని ప్రయాణికులు తాగేలా బస్టాండు నలుమూలల నల్లాలు ఏర్పాటు చేయొచ్చు. ఆర్టీసీ అలా చేయలేదు. వేసవిలో ప్రయాణికుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల సత్యసాయి ట్రస్టు వారు చలివేంద్రం ఏర్పాటుచేసి కొంత ఉపశమనం కల్పించారు.
నిరుపయోగంగా మరుగుదొడ్లు
దూరప్రాంతాల నుంచి వచ్చే లగ్జరీ, ఎక్స్ప్రెస్ బస్సులు ఇక్కడ ఆగుతాయి. అందుబాటులో మరుగుదొడ్లు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్నగర్ వైపు, జాతీయ రహదారి-44 వైపు ఉచితంగా వాడుకునేలా గతంలో నిర్మించిన మూత్రశాలలు, మరుగుదొడ్లు ఇప్పుడు వృథాగా మారాయి. ప్రైవేటు సులభ్ కాంప్లెక్స్ మూలన ఉంది. దూరంగా ఉన్న ఆ ప్రైవేటు మరుగుదొడ్ల వద్దకు వెళ్లి వచ్చేలోపు బస్సులు వెళ్లిపోతాయని అక్కడికి వెళ్లడం లేదు. ఖాళీ స్థలం ఉన్నందున అందుబాటులో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.
అధికారులేమన్నారంటే.. : ఆర్టీసీ మహబూబ్నగర్ ఆర్ఎం శ్రీదేవిని ‘న్యూస్టుడే’ ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేయగా ఆమె అందుబాటులోకి రాలేదు. జడ్చర్ల బస్టాండు మేనేజర్ జమరాజ్ని సంప్రదించగా సమస్యలను తాము గుర్తించి ఆర్ఎం దృష్టికి తీసుకెళ్లామని, ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సార్వత్రికం... తీర్పు ప్రత్యేకం
[ 30-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో శాసనసభకు, పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటోంది. -
ప్రశ్నార్థకం.. జలాశయాల నిర్మాణం
[ 30-04-2024]
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం నిర్మాణం 2007లో పునాది పడింది. 2012లో 50 శాతం పూర్తయి నీటి తోడిపోత మొదలై సాగునీరందింది. -
పాలమూరు పోరు @50
[ 30-04-2024]
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల లెక్క తేలింది. -
దృష్టి మరల్చేందుకే రిజర్వేషన్లపై దుష్ప్రచారం : అరుణ
[ 30-04-2024]
బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని భాజపాపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆరోపించారు. -
వనిత..కలత!
[ 30-04-2024]
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధిక ఓటర్లు అతివలే. పురుష ఓటర్ల కంటే వారు 1,13,920 మంది ఎక్కువగా ఉన్నారు. -
ఏ సభలో ఎంత మంది సభ్యులు?
[ 30-04-2024]
భారత పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయి. దిగువ సభను లోక్సభ అంటారు. దీనినే ప్రజా ప్రతినిధుల సభ అని కూడా పిలుస్తారు. ఈ సభలో మొత్తం 552 మంది సభ్యులు ఉంటారు. -
కాంగ్రెస్వి మోసపూరిత హామీలు: భారాస
[ 30-04-2024]
రాష్ట్రంలో పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్దానికి జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో పేదల సంక్షేమానికి పాటుపడిన కేసీఆర్ నాయకత్వంలోని భారాసను గెలిపించాలని పార్టీ నాగర్కర్నూల్ లోకసభ స్థానం అభ్యర్థి ప్రవీణ్కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. -
దశాబ్దాల కల నెరవేరదేమి?
[ 30-04-2024]
ఉమ్మడి జిల్లాలో కేంద్ర విద్యాలయాల ఏర్పాటుపై కొన్నేళ్లుగా వివక్ష కొనసాగుతోంది. కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయం, సైనిక స్కూళ్లకు మంచి డిమాండ్ ఉంది. -
మైలారం గుట్టపై తవ్వకాలకు ససేమిరా
[ 30-04-2024]
రాళ్లతో వ్యాపారం చేస్తూ రూ.కోట్లు గడిస్తున్న మైనింగ్ మాఫియా మైలారం గుట్టపై తవ్వకాలకు సిద్ధమైంది. గుట్టపై కన్నేసిన వ్యాపారులు 2017లోనే మైనింగ్, పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు 20 ఏళ్ల వరకు అనుమతులు జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
గెలుపు ఖాయం.. భారీ మెజార్టీయే లక్ష్యం
[ 30-04-2024]
సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా కావటంతో ఇక్కడి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి కృషిచేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సూచించారు. -
రక్తనిధి కేంద్రంలో... తగ్గుతున్న నిల్వలు
[ 30-04-2024]
పట్టణంలోని జనరల్ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో రోజు రోజుకు రక్తపు నిల్వలు తగ్గుతున్నాయి. అత్యవసర పరిస్థితిలో రోగులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పేదోళ్లు ఇంటర్ చదవద్దా?
[ 30-04-2024]
ఉమ్మడి పాలమూరులో వెనకబడిన జిల్లా నారాయణపేట. కార్మికులు, వలస కూలీల జిల్లాగా పేరుంది. -
ఇండియా కూటమిని గెలిపిద్దాం : మంత్రి జూపల్లి
[ 30-04-2024]
ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపిద్దామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. -
నాడు మామ.. నేడు అల్లుడు
[ 30-04-2024]
మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఆడబిడ్డ పోటీ చేస్తుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని, ఓడించేందుకు నాడు మామ, నేడు అల్లుడు కుట్ర చేస్తున్నారని భాజపా లోక్సభ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
ఇథనాల్ పాపం భాజపా, భారాసలదే
[ 30-04-2024]
కేంద్రం, రాష్ట్రంలోని భాజపా, భారాస ప్రభుత్వాల అనుమతులతోనే మరికల్ మండలం చిత్తనూరు శివారులో అప్పట్లో ఇథనాల్ కంపెనీ ఏర్పాటైందని మహబూబ్నగర్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. -
రూ. 50 కోసం దుకాణాలకు నిప్పు
[ 30-04-2024]
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ పక్కన ఉన్న వీధి వ్యాపారుల షెడ్డులో డబ్బా దుకాణాలు దహనం చేసిన నిందితుడిని గుర్తించి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై గోవర్దన్ సోమవారం తెలిపారు. -
కస్తూర్బా విద్యాలయం సిబ్బందిపై వేటు
[ 30-04-2024]
కేజీబీవీలో నలుగురు సిబ్బందిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో ఇందిర ఉత్తర్వ్యులు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై
-
ఐసీయూలో పనిచేయని ఏసీలు