ఎరువుల రేక్ పాయింట్ జిల్లాకు వరం
ఎరువుల రేక్పాయింట్ జిల్లా రైతాంగానికి వరం లాంటిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. గజ్వేల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏరువుల రేక్పాయింట్ను వారు సోమవారం ప్రారంభించారు.
కేసీఆర్ కృషితో గజ్వేల్ గడ్డ అభివృద్ధిలో అగ్రగామి
మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి
గూడ్స్ రైలు వద్ద స్థానికుల సందడి
గజ్వేల్, న్యూస్టుడే: ఎరువుల రేక్పాయింట్ జిల్లా రైతాంగానికి వరం లాంటిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. గజ్వేల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏరువుల రేక్పాయింట్ను వారు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏఎంసీ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ రైతులకు ఎరువుల కష్టాలు తీర్చేందుకు ఉమ్మడి జిల్లా కోసం తూప్రాన్ ప్రాంతంలో ఎరువులు రేక్పాయింట్ ఏర్పాటు చేయాలని సమైక్య రాష్ట్రంలో ఎన్నో సార్లు విజ్ఞప్తులు చేసినా, జడ్పీ సమావేశంలో నెత్తినోరు మొత్తుకున్నా అప్పటి ప్రభుత్వాలు చెవిన పెట్టలేదన్నారు. జిల్లాకు ఎరువులు రావాలంటే హైదరాబాద్లోని సనత్నగర్ నుంచి వచ్చేవని ట్రాఫిక్ ఆంక్షలతో రాత్రిపూట మాత్రమే తీసుకొచ్చేందుకు వీలుండేదన్నారు. తద్వారా సీజన్లో సకాలంలో ఎరువులు అందక రైతులు అరిగోస పడేవారన్నారు. బస్తా ఎరువు కోసం వరుసలో నిలబడే రోజుల నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రైలు వచ్చి, రేక్పాయింట్ అందుబాటులోకి రావటంతో మన వద్దనే 20 వేల మెట్రిక్ టన్నుల స్టాక్ పెట్టుకునే స్థాయికి ఎదిగామన్నారు. మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ రేక్పాయింట్ వల్ల ఎరువులు దిగుమతి చేసుకోవటంతోపాటు గూడ్స్ రైలు సౌకర్యంతో అనేక రకాలైన వస్తువులను ఎగుమతి చేసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. రైతులకు, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించి లబ్ధిపొందాలని కాంగ్రెస్, భాజపా నాయకులు పగటి కలలు కంటున్నారన్నారు. కేంద్రాన్ని ఏలుతున్న భాజపా ప్రభుత్వం వరిసాగు, వడ్ల కొనుగోలులో బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తుందన్నారు.
హమాలీలతో మాటామంతీ
గూడ్స్ రైలులోంచి ఎరువులు దింపుతున్న బిహార్ హమాలీలతో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. తెలంగాణలో చేతినిండా పని దొరుకుతుందని ఇక్కడ ఎంతో బాగుందని హమాలీలు బదులిచ్చారు. గజ్వేల్లోని ఐఓసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 557 లబ్ధిదారులకు రూ.5.56 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. 108 మంది లబ్ధిదారులకు రూ.82.60 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. కొత్త గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధుల మంజూరు పత్రాన్ని మంత్రి హరీశ్రావు ఆయా సర్పంచులకు అందజేశారు. పట్టణంలోని సమీకృత విపణిని మంత్రి నిరంజన్రెడ్డి సోమవారం సందర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, యాదవరెడ్డి, ఎఫ్డీసీ ఛైర్మన్ ప్రతాప్రెడ్డి, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు రోజాశర్మ, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు దేవీ రవీందర్, జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్పాటిల్, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియా అధ్యక్షుడు రాజమౌళి, ఉపాధ్యక్షుడు జకీ, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ సభ్యుడు మల్లేశం, పీఏసీఎస్ ఛైర్మన్ వెంకటేశం గౌడ్, సర్పంచ్ల ఫోరం గజ్వేల్ అధ్యక్షుడు చంద్రమోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైలు రాకతో స్థానికుల హర్షం
మనోహరాబాద్-గజ్వేల్ సెక్షన్లో అధికారికంగా మొదటి గూడ్స్ రైలు సోమవారం కూతపెడుతూ ఎరువుల లోడుతో అడుగిడటంతో స్థానికులు సంతోషంలో మునిగిపోయారు. రైలును చూసేందుకు తండోపతండాలుగా రావటంతో గజ్వేల్లోని రైల్వేస్టేషన్ జన సందడితో కళకళలాడింది. దక్షిణమధ్య రైల్వే శాఖ గజ్వేల్ను రైల్వే డివిజన్గా 2022లో నమోదు చేసింది. కాకినాడ నుంచి గజ్వేల్కు ఎరువులతో వచ్చిన రైలును పూలదండలతో అలంకరించారు. రోజాశర్మ, మహిళ ప్రజాప్రతినిధులు రైలుతో స్వీయ చిత్రాలు దిగారు. మంత్రులు ప్రారంభించిన అనంతరం ప్లాట్ఫారంపై లారీలను ఉంచి బస్తాలను హమాలీలు దించారు. అనంతరం గజ్వేల్ మార్కెట్యార్డులోని రేక్పాయింట్కు తరలించారు. మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు రైలు మార్గాన్ని సకాలంలో పూర్తి చేసి సరుకు రవాణాకు కృషి చేసిన నిర్మాణం, పర్యవేక్షక అధికారులను దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ ఒక ప్రకటనలో అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దావత్ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ
[ 07-05-2024]
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఉపాధి ప్రశ్నార్థకం.. జీవనం భారం!
[ 07-05-2024]
రేయింబవళ్లు చెమటోడ్చి.. బీడీలు చుట్టే కార్మికుల కష్టం అంతాఇంతా కాదు. ఆరోగ్యాన్ని లెక్కచేయక.. కుటుంబ పోషణ భారం మోసే మహిళలు అనేకం. కొన్నేళ్లుగా ఈ రంగంపై ఆధారపడిన వారికి ఉపాధి కరవవుతోంది. -
గ్యారంటీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
[ 07-05-2024]
హామీలను నెరవేర్చడంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. సోమవారం వెల్దుర్తిలో నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. -
హామీల అమలులో మాట తప్పిన సీఎం
[ 07-05-2024]
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న సీఎం రేవంత్రెడ్డి మాట తప్పారని, మాట తప్పిన ముఖ్యమంత్రికి ఓటు ద్వారానే ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. -
అధినేత యాత్రపై ఆశలు
[ 07-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. సిట్టింగ్ స్థానమైన మెదక్ లోక్సభ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు, -
పేదలకు ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దే
[ 07-05-2024]
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దేనని ఆ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. సోమవారం హవేలిఘనపూర్ నుంచి బూర్గుపల్లి వరకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్తో కలిసి ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. -
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
[ 07-05-2024]
అదనపు ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి, రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
అత్యవసరమైతేనే బయటకు రండి
[ 07-05-2024]
జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. వడగాలులు వీస్తున్నాయి. పిల్లలు, పెద్దలు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. నిత్యం సగటున 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
స్వతంత్రులు నామమాత్రమేనా?
[ 07-05-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీచేస్తున్నా కనీస ప్రభావం చూపలేకపోతున్నారు. ఎక్కువ మంది డిపాజిట్లు కోల్పోతున్నారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ప్రస్తుతం నాలుగో ఎన్నిక జరుగుతోంది. -
రిజర్వేషన్లపై అసత్య ప్రచారం: రాజాసింగ్
[ 07-05-2024]
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనలో ఇబ్బందులు పడ్డారని, రేవంత్రెడ్డి పాలనతో అంతకు మించిన కష్టాలు అనుభవిస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. -
భాజపా ఓడితేనే అన్ని వర్గాలకు న్యాయం
[ 07-05-2024]
దేశంలో అన్నివర్గాలకు న్యాయం జరగాలన్నా, ఆర్థిక వ్యవస్థ బాగుపడాలన్నా.. భాజపా ఓడిపోవాల్సిందేనని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. -
కాంగ్రెస్లో చేరిన హుస్నాబాద్ భాజపా ఇన్ఛార్జి
[ 07-05-2024]
హుస్నాబాద్ నియోజకవర్గ భాజపా ఇన్ఛార్జి, హౌజ్ఫెడ్ మాజీ ఛైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి తన అనుచరులతో కలసి తిరిగి కాంగ్రెస్లో చేరారు. సోమవారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. -
సామాజిక మాధ్యమం.. ప్రచారానికి ఊతం
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సమీపిస్తుండటంతో మెదక్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రతి ఓటరును చేరాలన్న ఉద్దేశంతో సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకున్నారు. -
అక్కడ తప్పని సరి.. ఇక్కడ ఇంతేమరి
[ 07-05-2024]
చెల్లించే పన్నుకి జరిగే అభివృద్ధికి ఏ మాత్రం తేడా కనిపించినా కొన్ని దేశాల్లో పౌరులు ఉపేక్షించరు. నాయకులు ఎదురుపడితే నిలదీస్తారు. ఎదురు మాట్లాడితే ‘వి ఆర్ టాక్స్ పేయర్స్’ అంటూ ఉద్యమాలు చేపడతారు. -
కాస్త దృష్టిసారిస్తే ఆరోగ్యమే
[ 07-05-2024]
ఓ వైపు ఎండ తీవ్రత పెరిగింది. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ సమయంలోనే లోక్సభ ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. ప్రచారం శనివారంతో ముగియనుంది. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
[ 07-05-2024]
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
దొంగల వెంట పోలీస్ పరుగో పరుగు
[ 07-05-2024]
తాళం వేసిన ఇంట్లో చోరీ చేసేందుకు వచ్చిన దొంగలు పోలీసులపై దాడికి యత్నించి పరారైన సంఘటన తూప్రాన్లో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?