మెరిసిన ఆణిముత్యం
చదువు గురించి తెలియని అమ్మానాన్నలు నన్ను కష్టపడి చదివించారు. వారి కలలు నెరవేర్చడమే నా లక్ష్యమంటూ చదువులో ప్రతిభ చాటారు ఆ యువకుడు. మారుమూల తండాకు చెందిన
అడవిదేవులపల్లి, న్యూస్టుడే
చదువు గురించి తెలియని అమ్మానాన్నలు నన్ను కష్టపడి చదివించారు. వారి కలలు నెరవేర్చడమే నా లక్ష్యమంటూ చదువులో ప్రతిభ చాటారు ఆ యువకుడు. మారుమూల తండాకు చెందిన గిరిజన ఆణిముత్యం జాతీయ స్థాయిలో రాణించారు. ఐఎఫ్ఎస్లో జాతీయ స్థాయి ర్యాంకు సాధించి ఉన్న ఊరికి, కన్న తల్లిదండ్రులకు పేరు తెచ్చిపెట్టారు. భవిష్యత్తులో ఐఏఎస్ సాధించి పేదలకు సేవలందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఆయనే అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లికి చెందిన కుర్ర తావుర్యానాయక్ - మారోని దంపతుల కుమారుడు శ్రీను.
కుటుంబం
వ్యవసాయ కుటుంబానికి చెందిన తావుర్యాకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెల పెళ్లిళ్లు చేసిన తావుర్యా గ్రామ రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవలందించారు. ఆ తర్వాత వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా ఉన్నప్పుడు రాజకీయ హత్యకు గురయ్యారు. తావుర్యా మృతితో ఆయన భార్య మారోని 2013లో జరిగిన సర్పంచి ఎన్నికల్లో గెలుపొంది 2018 వరకు కొనసాగారు.
విద్యాభ్యాసం
కుర్ర శ్రీనివాస్ బాల్యం నుంచే చదువుపై ఎంతో శ్రద్ధ వహించేవారు. స్థానికంగా పదోతరగతి వరకు చదివారు. ఇంటర్మీడియట్ విజయవాడలోని ఓ ప్రయివేట్ కళాశాలలో పూర్తిచేసి ఐఐటీ జేఈఈలో ఎస్టీ కేటగిరీలో ఆలిండియా 22వ ర్యాంకు సాధించి మద్రాస్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్లో చేరారు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం, రూ.లక్షల వేతనాలతో దేశీయంగా ఉద్యోగావకాశాలు వచ్చినా సివిల్ సర్వీసెస్కు వెళ్లాలన్న సంకల్పంతో వాటిని వదిలేశారు. బీటెక్ పూర్తయిన తర్వాత హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో చేరి, ఉద్యోగం చేస్తూనే సివిల్ సర్వీసెస్ శిక్షణ తీసుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్ ఫెలోషిప్, భద్రాచలంలోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు విద్య, వైద్యం, నక్సలిజం వైపు ఆకర్షితులు కాకుండా అవగాహన కల్పించే విషయంలో అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టర్ ఇలంబర్దికి ఏడాదిపాటు సహాయకుడిగా సేవలందించారు. 2014-15లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్(ఐఎఫ్ఎస్), 2015లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) ఎంపికయ్యారు. ఐఏఎస్కు ఇంటర్వ్యూ వరకు వెళ్లి వచ్చారు. తదుపరి ఐఎఫ్ఎస్లో చేరి శిక్షణ అనంతరం ప్రస్తుతం కేరళలోని త్రిచూర్లో డివిజనల్ ఫారెస్ట్ అధికారిగా పనిచేస్తున్నారు.
ఐఏఎస్ సాధించడమే లక్ష్యం
- కుర్ర శ్రీనివాస్
తల్లిదండ్రులు ఎంతో శ్రమించి నన్ను చదివించారు. నాన్న నిత్యం ప్రజల మధ్య ఉండి వారి కోసం పనిచేశారు. నన్ను కలెక్టర్గా చూడాలన్నది ఆయన కల. ప్రస్తుతం ఐఎఫ్ఎస్లో కొనసాగుతూ ప్రజలకు సేవలందిస్తున్నా, తండ్రి ఆశయ సాధనకు ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తున్నా. భవిష్యత్తులో ఐఏఎస్ సాధించడం ద్వారా పేదలకు మరిన్ని సేవలందిస్తా. గెలుపోటములను సమానంగా స్వీకరించే గుణం అలవర్చుకోవాలి. ఆలోచన ధోరణి పాజిటివ్గా ఉండాలి. ఒకసారి పరాజయం ఎదురవగానే నిర్వేదం తగదు. నువ్వు యుద్ధం గెలిచేంత వరకూ ఏ శబ్దం చేయకు. నీ విజయమే పెద్ద శబ్దమై ప్రపంచానికి వినిపిస్తుందన్న మహాత్మాగాంధీ మాటలు మరువరాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భానుడి వేడి..దొరకని నాడి
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
ప్రచారం కన్నా... సమీక్షలే మిన్నా..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారానికి మరో ఏడు రోజులే గడువు ఉన్నా.. గతంతో పోలిస్తే క్షేత్రస్థాయిలో మాత్రం ప్రచారం ఊపందుకోలేదు. -
మనమే కారణం.. మేల్కోకుంటే దారుణం
[ 05-05-2024]
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
అప్రమత్తతే శ్రీరామరక్ష
[ 05-05-2024]
మిర్యాలగూడ పట్టణంలో శనివారం దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. -
రైతు భరోసా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం
[ 05-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
గంగా, సబర్మతి మాదిరిగా మూసీ ప్రక్షాళన
[ 05-05-2024]
ఈ ప్రాంత ప్రజలను ఏళ్లుగా పట్టి పీడిస్తున్న మూసీ కాలుష్యాన్ని శాశ్వతంగా నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తాం. గంగా, సబర్మతి నదుల్లాగా మూసీని కాలుష్యరహితంగా తయారు చేస్తామని భువనగిరి భారాస అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు. -
చుక్క నీరు కూడా వదులుకోబోం: మంత్రి ఉత్తమ్
[ 05-05-2024]
ప్రస్తుత ఎన్నికలు భారతదేశ దిశ, దశ మార్చేవని, ప్రతి ఓటరూ ఇది గుర్తించి ఓటు వేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. -
నాలుగు లక్షల మెజార్టీ ఖాయం: రాజగోపాల్రెడ్డి
[ 05-05-2024]
భువనగిరి లోక్సభ నియోకవర్గంలో నాలుగు లక్షల మెజార్టీ తగ్గకుండా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు -
ఆ ఎద్దడి మనకొద్దు.. అప్రమత్తతే ముద్దు
[ 05-05-2024]
ప్రస్తుతం బెంగళూరు నగర నీటి సంక్షోభం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. -
ఆయకట్టులో ఆగని చోరీలు
[ 05-05-2024]
సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులకు దొంగలు చుక్కలు చూపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా యథేచ్ఛగా వారి పని చేసుకుంటూ పోతున్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెట్టొద్దు
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు తెలిపారు. -
భానుడి ప్రతాపం.. బాతులకు తాపం
[ 05-05-2024]
రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.దీంతో పక్షులు సేదతీరేందుకు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నాయి. -
నేనేంటీ.. నాకింత విలువేంటి..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంతో పాటు చేరికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. -
నేటి నుంచి ఈవీఎంల కమీషనింగ్
[ 05-05-2024]
ఎన్నికల పర్వంలో మరో కీలక ఘట్టమైన ఈవీఎంల కమీషనింగ్ (బ్యాలెట్ కాగితం అమర్చడం, నమూనా పోలింగ్) ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. -
6న నల్గొండలో నడ్డా సభ: సైదిరెడ్డి
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో భాజపా జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా పాల్గొంటారని ఆ పార్టీ నల్గొండ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. -
కొనసాగిన ఇంటి వద్ద పోలింగ్
[ 05-05-2024]
జిల్లాలో రెండు రోజులుగా ఇంటి వద్ద పోలింగ్ నిర్వహణను అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించారు. -
రూ.2తో ఓటు సవాల్
[ 05-05-2024]
ఓటును సవాల్ (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది. -
రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడి దుర్మరణం
[ 05-05-2024]
రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలోని అక్కలదేవిగూడెంలో శనివారం చోటుచేసుకుంది.