నూతన కలెక్టర్గా వినయ్ కృష్ణారెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బదిలీ అయ్యారు. జిల్లా నూతన కలెక్టర్గా వినయ్కృష్ణారెడ్డి నియమితులయ్యారు.
కలెక్టర్ పమేలా సత్పతి బదిలీ
వినయ్కృష్ణారెడ్డి
భువనగిరి, న్యూస్టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బదిలీ అయ్యారు. జిల్లా నూతన కలెక్టర్గా వినయ్కృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ జిల్లాకు ఆయన మూడో కలెక్టర్. పమేలా సత్పతిని సాధారణ పరిపాలనా విభాగానికి బదిలీ చేశారు. రెండేళ్లపాటు ఆమె కలెక్టర్గా పనిచేశారు.
జిల్లాపై చెరగని ముద్ర... నృసింహసాగర్ భూసేకరణ.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు.. తుది దశకు చేరుకున్న యాదాద్రి ఆలయ పనులు.. సీఎం దత్తత గ్రామంగా వాసాలమర్రి పనులు ప్రారంభం.. ఇలా జిల్లాలో క్లిష్టతరమైన సమస్యలు నెలకొన్న సమయంలో జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్గా పమేలా సత్పతి రెండేళ్ల కాలంలో జిల్లాపై చెరగని ముద్ర వేశారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేస్తూ ఆమె కలెక్టర్గా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. అదనపు కలెక్టర్ పనిచేయకున్నా.. పాలనానుభవం లేకున్నా.. తనదైన శైలిలో జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూనే తనకు వచ్చిన ఆలోచనలు జిల్లాలో అమలు చేసి రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలిచారు. శుక్రవారం సభలు పేరుతో ఆమె గర్భిణులు, మహిళలు, బాలికల్లో రక్తహీనత తొలగించేందుకు అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశాలు సత్ఫలితాలనిచ్చాయి. మహిళలల్లో రక్తహీనత 51 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు. బుధవారం బోధన, స్నేహిత, విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బస్వాపూర్లో నిర్మిస్తున్న నృసింహసాగర్ జలాశయంలో ముంపునకు గురవుతున్న బీఎన్ తిమ్మాపూర్ వాసులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భువనగిరిలో నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు, పరిహారం అందించడంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గెలుపు వ్యూహం..!
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపు కోసం భాజపా వ్యూహాలు రచిస్తోంది. -
సాగు ప్రణాళిక ఖరారు.. విత్తనాలకు ప్రతిపాదనలు
[ 29-04-2024]
నల్గొండ జిల్లా వానాకాలం పంటల సాగుపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. సాగును అంచనా వేసి అవసరమైన విత్తనాలు కోసం జిల్లాలో ప్రణాళిక సిద్ధం చేసింది. -
భానుడు భగ్గుమనె..!
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాపై ఆదివారం భానుడు నిప్పులు చెరిగాడు. ఏడు మండలాల్లో 45 డిగ్రీల సెల్సియస్కు పైగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నిబంధనలకు నీళ్లు..!
[ 29-04-2024]
కోదాడ పట్టణంలో సుమారు 30 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో పురపాలిక నుంచి అనుమతి తీసుకున్నవి ఐదు మాత్రమే. -
మడిగల్లోనే దశాబ్దాలుగా..!
[ 29-04-2024]
దేవరకొండ రెవెన్యూ డివిజన్, నియోజకవర్గ కేంద్రం, పురపాలికలో ఏ దుకాణాలు అద్దెకు తీసుకోవాలన్నా.. రూ.వేలు అద్దె చెల్లించాల్సిన పరిస్థితి. -
నల్లబజార్కు భారత్ సరకులు..!
[ 29-04-2024]
మార్కెట్లో నిత్యావసరాల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది నెలలుగా రాయితీపై సరఫరా చేస్తున్న ‘భారత్ దాల్’ను మిర్యాలగూడ కేంద్రంగా కొందరు అక్రమార్కులు ప్యాకెట్లు చింపి.. బస్తాల్లో నింపి ఏపీలోని పలు జిల్లాలకు తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. -
ద్వితీయ శ్రేణి.. గుంభనం వీడదేమీ!
[ 29-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు.. లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అగ్రనాయకుల హడావుడి తప్ప కిందిస్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. -
ఒక్కొక్కరికి ఒక్కోలా.. అందరూ వినియోగించుకునేలా
[ 29-04-2024]
ఓటును అందరూ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఉపయోగించుకోలేరు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు, సైనికులు, గుఢాచారి వ్యవస్థల్లో పనిచేసే వారు తమ ఓటును ఉపయోగించుకునేందుకు వివిధ మార్గాలను ఎన్నికల సంఘం కల్పించింది. -
రఘువీర్ 44.. నర్సయ్య 65
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల నుంచి బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ 44 ఏళ్లలో అతి చిన్న వయస్కుడిగా నిలవగా... భువనగిరి భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ 65 ఏళ్లతో అత్యధిక వయస్కుడిగా నిలిచారు. -
ప్రేమజంట బలవన్మరణం
[ 29-04-2024]
ఆరేళ్లుగా ప్రేమించుకుంటూ.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం తుమ్మలపెన్పహాడ్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. -
ఓటెత్తేలా.. స్ఫూర్తి చాటేలా..!
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. -
700 ఏళ్ల నాటి సంకెళ్ల బావి
[ 29-04-2024]
అది చరిత్ర పుటల్లో శిథిలమైన మహానగరం.. చుట్టూ అడవి.. ఎతైన కొండలు..కోటలు.. ఇంకొంచెం తొంగిచూస్తే మరెన్నో చారిత్రక విశేషాలు. -
త్వరలో భారాస కనుమరుగు: రాజగోపాల్రెడ్డి
[ 29-04-2024]
భారాస త్వరలో కనుమరుగవుతుందని కాంగ్రెస్ భువనగిరి లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి జోస్యం చెప్పారు. -
ఆమె కోసం..!
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో మహిళా శక్తే ప్రాధాన్యంగా కనిపిస్తోంది. అభ్యర్థులు, నాయకుల దృష్టి మహిళా ఓటర్లపైన పడింది. -
డిజిటల్ లావాదేవీలపై నిఘా..
[ 29-04-2024]
ఆలేరుకు చెందిన ఓ ఖాతాదారుడు భువనగిరిలో నివాసం ఉంటున్నాడు. ప్రైవేట్ బ్యాంకు నుంచి అధికారులు ఫోన్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!